Jump to content

forest land lo IT Hub


Recommended Posts

U troll when kcr team cuts few trees in university. what CBN is doing?

 

IT can be developed in Vizag with its available infrastructure.

 

33350 acres greenary gonna be doomed

a lands  lo enni acers lo forest undo miku telusa? avi forest ne kani akkada chala bhumu lo trees kuda udavu chala land lo janla lu kabhja lu chesi vadu kutunaru,33350 acres lo  greenary pothundi badhapadtunnaru ippudu state govt antha vere land lo forest penichi ivvalai adi telusukondi.

Link to comment
Share on other sites

a lands lo enni acers lo forest undo miku telusa? avi forest ne kani akkada chala bhumu lo trees kuda udavu chala land lo janla lu kabhja lu chesi vadu kutunaru,33350 acres lo greenary pothundi badhapadtunnaru ippudu state govt antha vere land lo forest penichi ivvalai adi telusukondi.

Forest penchatam adi jarige pani kadu le bro

Link to comment
Share on other sites

  • 10 months later...
త్వరలోనే అటవీ భూముల డీనోటిఫికేషన్?
 
  • కొద్ది రోజుల్లోనే ఉత్తర్వులు!
అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): అమరావతి నిర్మాణం కోసం రాజధాని ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న అటవీ భూములను డీనోటిఫై చేసి, తనకు అప్పగించాల్సిందిగా ఏపీసీఆర్‌డీయే దాదాపు రెండేళ్లుగా చేస్తున్న అభ్యర్థనలు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ భూములను రాజధాని కోసం అప్పగిస్తూ కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ కొన్నివారాల్లోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ శాఖకు అనుబంధంగా పని చేసే ఫారెస్ట్‌ అడ్వైజరీ కమిటీ అధికారులు కోరిన సమాచారాన్ని రాష్ట్ర అధికారులు ఇవ్వడమే కాకుండా వెలిబుచ్చిన అనుమానాలన్నింటినీ నివృత్తి చేశారు. దీంతో, దీర్ఘకాలంగా నానుతూ వస్తున్న ఈ అంశం త్వరలోనే ఒక కొలిక్కి వస్తుందని ఏపీ సీఆర్‌డీయే ఆశిస్తున్నట్లు భోగట్టా.
12,444 హెక్టార్ల కోసం కృషి
ప్రపంచంలోని మేటి 5 నగరాల్లో ఒకటిగా అమరావతిని నిర్మించాలంటే భూసమీకరణ ప్రాతిపదికన సమీకరించిన సుమారు 33,000 ఎకరాలు, ప్రభుత్వ భూములతోపాటు అమరావతికి సమీపంలో, వివిధ ప్రదేశాల్లో విస్తరించి ఉన్న 12,444 హెక్టార్ల అటవీ భూమి కూడా అవసరమని సీఆర్‌డీయే భావిస్తోంది. ఈ అటవీ భూములను డీనోటిఫై చేసి, తమకు అప్పగిస్తే వాటిల్లో రాజధాని ప్రాంతానికి చుట్టుపక్కల అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో కూడిన పారిశ్రామిక, వాణిజ్య తదితర క్లస్టర్లను అభివృద్ధి పరచాలన్నది ఆ సంస్థ అభిప్రాయం. నిబంధనలను అనుసరించి ఈ భూమికి సరిసమానమైన భూమిని వేరొక ప్రాంతంలో ఇచ్చేందుకు అంగీకరించడంతోపాటు అందులో అడవులను పెంచేందుకు అవసరమైన నిధులను కూడా ఇస్తామంటూ ప్రతిపాదించింది. దీనిపై కేంద్ర అధికారులు, సీఆర్‌డీయేల మధ్య ఇప్పటికి పలు పర్యాయాలు సమావేశాలు నిర్వహించినా డీనోటిఫికేషన్ కు సంబంధించిన ఉత్తర్వులు మాత్రం విడుదల కాలేదు.
ఎప్పటికప్పుడు ఈ అంశం ఒక కొలిక్కి వచ్చేస్తుందనిపించినా కేంద్ర అధికారులు మళ్లీ ఏవేవో అనుమానాలు వ్యక్తం చేయడంతో అలా జరగకపోవడం పరిపాటైంది. కానీ, ఈ నెల 16న ఢిల్లీలో జరిన చర్చలు మాత్రం ఈ అంశానికి ఫుల్‌స్టాప్‌ పెట్టే విధంగా సాగినట్లు సమాచారం. రాష్ట్ర అధికారుల వివరాలపై కేంద్ర అధికారులు సంతృప్తి చెందారని భావిస్తున్న సీఆర్‌డీయే ఉన్నతాధికారులు ఇకపై వాయిదాలు అవసరం లేకుండా అటవీ భూముల డీనోటిఫికేషన్ కు కేంద్రం ఉత్తర్వులు వెలువరించడం ఖాయమని విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఈ పరిణామం చోటు చేసుకోవచ్చునని వారు అంచనా వేస్తున్నట్లు సమాచారం.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...