Jump to content

తిరుమల పై ఏపీ సర్కారు పెత్తనం ఏమిటి?: స్వామి


Recommended Posts

total ga government kindha vunte more damage,,,,,YSR vunnappudu 3 hills christians ki ammesadu. only gov kakunda more people ni involve cheyali decision making lo

What did swamy do at that time . Why didn't he approach courts at that time if he is so concerned
Link to comment
Share on other sites

TTD lo only Hindus ne appoint cheyali...... TTD run education institutes lo reservations follow kavalanukonta........ithe ayyaru..... secular/ politically correct ideologies tho savdobbakonda vunte better....at least SV University varaku.... 

Link to comment
Share on other sites

TTD lo only Hindus ne appoint cheyali...... TTD run education institutes lo reservations follow kavalanukonta........ithe ayyaru..... secular/ politically correct ideologies tho savdobbakonda vunte better....at least SV University varaku....

Edina ttd hindus ne appoint cheyyali bro...no space for secularism in ttd run institutions..
Link to comment
Share on other sites

స్వామి తిరుమల రచ్చ వెనక ఉన్నది మనోళ్లేగా !

తిరుమల వెంకన్న ఆలయం మీద ఏపీకి ఏం హక్కుంది ? ఆలయాన్నిస్వతంత్ర అధారిటీగా ప్రకటించాలి… ఆదాయాన్ని వాడుకునేందుకు ప్రొవిజన్ ఉండాలంటూ సుప్రీం వరకూ వెళ్లింది సుబ్రమణ్యస్వామి పైత్యం. ఇన్నాళ్లూ అగస్టాలు, టూజీలపై స్వామి కోర్టు కెళితే సంతోషించిన వాళ్లం ఇప్పుడు మాత్రం భగ్గుమంటున్నాం. కారణమేంటి…? తేడా ఎక్కడుంది ? స్వామి రాంగా ? మన ఆలోచన రాంగా ? అంటే… రెండూ కాదు… నా సామి రంగా ఇదీ కారణం అని ఇంకొ కొత్త యాంగిల్ కనిపిస్తోంది. అదేంటో తెలుసా మీకు…!

సుబ్రమణ్యస్వామి చిత్రమైన మనిషి. ఏం చేశామన్నది కాదన్నయ్యా… రచ్చ అయ్యిందా లేదా అన్నట్టుంది ఆయన పాయింట్. ప్రపంచం అంతా ఏకమైనా ఆయన మాత్రం తాను అనుకున్నదివాదిస్తూ… అప్పుడప్పుడూ తప్పు అయిపోయిందని రోదిస్తూ కూర్చుంటాడు. అంత లిటికెంట్ కాబట్టే ఆయన్ని కోరికోరి రాజ్యసభలో పెట్టుకుంది బీజేపీ. మరీ మితిమీరిన అతి చేస్తుంటాడు కాబట్టే కేబినెట్ లో ఉండాల్సిన వాడు ఇపుడు ఫైళ్లు పట్టుకొని సుప్రీం చుట్టూ తిరుగుతున్నాడు. అదంతా సరే కానీ మన విషయానికి వచ్చేద్దాం !

సుబ్బు వాదన ఇది…

తిరుమల ఆలయానికి వేల కోట్ల ఆదాయం ఉంది. లక్షల కోట్ల ఆస్తులన్నాయ్. అపార సంపదని రాష్ట్రం సొంత అజెండా కోసం ఖర్చు చేస్తోంది. ధర్మ ప్రచారం కోసం హిందూ ధర్మోద్ధరణ కోసం మాత్రమే కేటాయించాల్సిన సొమ్ముని దారి మళ్లిస్తున్నారంటూ తోచిన ఆరోపణ చేసేశారు స్వామి. అదే పిటిషన్ లో కూడా ఉంది. పైగా ఇంకో ఉదాహరణ కూడా చూపిస్తున్నారు. చిదంబరం నటరాజ స్వామి ఆలయం విషయంలో ఇలాగే కేసు వేసి విజయం సాధించానని ఇపుడు కూడా అలాంటి రిజల్టే చూపిస్తానని స్వామి అంటున్నారు. ఇది పైకి కనిపిస్తున్న స్టోరీ. దీని వెనక మన లోకల్ రాజకీయం కూడా ఉంది.

నిజానికి ఇది నెల రోజుల నాటి సంగతి. అప్పుడే సుప్రీంలో పిటిషన్ వేశారు. ఇప్పుడు విచారణకి వచ్చింది. సరిగ్గా స్వామి పిటిషన్ వేయడానికి రెండు రోజుల ముందు మన విశాఖ సో కాల్డ్ స్వామీజి సుబ్రమణ్యస్వామితో సమావేశం అయ్యారు. ఆదారాలుంటాయ్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది. అందులో తిరుమల వ్యవహారంతోపాటు మరికొన్ని రాజకీయ కోణాలు కూడా ప్రస్తావనకి వచ్చాయ్. నాకు హిందూ ధర్మం మీద విశ్వాసం లేదనే ఓ అరాచక నాయకుణ్ని సమర్థించే ఈ సో కాల్డ్ పీఠాధిపతి సుబ్రమణ్యస్వామికి ఇన్ పుట్ ఇస్తాడు. వాటి ఆధారంగా ఆయన చెలరేగిపోతాడు. అదీ మేటర్.

ఎందుకిలా ?

తిరుమలపై పట్టుకోసం ప్రాపకం కోసం ప్రయత్నాలు చేసి మట్టికరిచిన మహానుభావులు ఇటీవలి చరిత్రలో చాలామంది ఉన్నారు. వెయ్యి కాళ్ల మంటపం విషయంలో గొడవ చేసి టీటీడీ నా పాదాక్రాంతం అవ్వాలంటూ బహిరంగంగా చెలరేగిన ఓ సాధువు ఇపుడు యాదాద్రి ఉద్ధరణలో ఉన్నారు. అక్కడైతే ఆయనకి పొర్లు దండాలు దండిగా దొరుకుతాయ్ మరి. ఇక మన విశాఖ స్వామీజీ లాంటి వాళ్ల లెక్క తీయాలే కానీ… రాస్తే పేజీలు అవుతాయ్. కొలిస్తే కేజీలు కాదు టన్నులుంటాయ్ ఇలాంటి వాళ్ల చవాకులు అవాకులు. ఇక్కడ కుదరడం లేదు కాబట్టి అక్కడి నుంచి సెగ రేపుదాం అనుకునే కక్కుర్తి కమండలాలు ఇవన్నీ ! ఏదో రకంగా యాగీ చేసి మీడియాలో కాస్త కనిపించొచ్చు…లేదంటే చర్చనీయం అవ్వొచ్చు అనుకునే కొద్ది బుద్ధులు ఇవన్నీ ! అంతకు మించి మరేం లేదు. ఓరకంగా రాష్ట్రానికి ఉన్న సహజమైన హక్కులు అదధికారాల్ని కాలరాచే ప్రయత్నాల్లో ఇవో భాగం.

సుబ్రమణ్య స్వామితోపాటు మిగతా మహానుభావులకి తెలియాల్సిన సంగతులు చాలానే ఉన్నాయ్. టీటీడీ దేశంలోనే కాదు ప్రంపచంలోనే మోస్ట్ ఆర్గనైజ్డ్ అండ్ ఇనిస్టిట్యూషనలైజ్డ్ అధారిటీ. ఓ ధార్మిక సంస్థ ఇంత పగడ్బందీగా సామాజిక ఆర్థిక సేవా ప్రయోజనాలతో నడవడం మరెక్కడా లేదు. స్వామి ఆస్తుల్ని స్వామి కార్యాలకే కాదు విద్యాదానాలకి ఆర్తులను ఆదుకోడానికే తప్ప అన్యథా వినియోగించిన దాఖలా ఇప్పటి వరకూ లేదు. రాదు కూడా ! పైగా ప్ర్తత్యేక బడ్జెట్, ఆడిటింగ్ వ్యవస్థ అన్నీ ఉన్నాయ్. ప్రభుత్వానికి సమాంతరంగా నడుస్తుందే తప్ప ఇప్పటికీ దేవాదాయ శాఖలో టీటీడీ భాగం కాదు. అవసరమైతే అక్కడ వ్యవస్థని రెగ్యులేట్ చేయడమే తప్ప ముక్కుతాడు వేసి నడిపిస్తున్న దాఖలా కనిపించదు ఎప్పుడూ ! మరి ఇప్పుడు విశ్వాసాలకీ భరోసాకి వచ్చిన ఇబ్బంది ఏముందో అర్థం కాదు.

ఇదంతా పూర్తి రాజకీయం. ప్రేరేపితం. ఏదోరకంగా ఇబ్బంది పెట్టడం లేదంటే అసహనం కలిగేలా వ్యవహరించాలనుకోవడం తప్ప మరోటి కాదు. పైగా ఇందులో మన వాళ్ల రాజకీయానికితోడు అరవకోణం కూడా ఉంది. ఓ ఎనబై ఏళ్లనాడు తిరుమల ఆలయంపై తమిళులకే పట్టు ఎక్కువ. వాళ్లు ఆడింది ఆటగా సాగేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోయేసరికి అన్నీ కలిపికొట్టేందుకు సుబ్బు సిద్ధపడితే… మన దగ్గర కడుపు ఉబ్బరంగా ఉన్నవాళ్లు ఆయనకి వంత పాడుతున్నారు. అంతే !

Link to comment
Share on other sites

  • 3 weeks later...
ఆలయాలపై ప్రభుత్వ పెత్తనమేంటి?: సుప్రీం
09-08-2016 03:01:12
636063085504283032.jpg
న్యూఢిల్లీ, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): మతపరమైన ఆలయాల వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం తగదని, దేవాదాయ చట్టం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ తమిళనాడు, పుదుచ్చేరిలకు చెందిన పలువురు అర్చకులు, హిందూ ధార్మిక సంస్థలు సుప్రీంకోర్టునాశ్రయించాయి. ఏపీకి చెందిన అర్చక సమాఖ్య, టెంపుల్స్‌ ఫౌండర్స్‌ అసోసియేషన్‌, అహోబిలం మఠాలు, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామిలు కూడా వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. వీటన్నింటినీ సోమవారం జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌, జస్టిస్‌ రోహింగ్టన్‌ నరీమన్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఆలయాలపై ప్రభుత్వ పెత్తనంపై ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. 4వారాల్లోగా సమాధానమివ్వాలంది.
Link to comment
Share on other sites

  • 1 year later...
అమిత్‌ షా, రాజ్‌నాథ్‌తో రమణదీక్షితులు భేటీ 
సామాజిక మాధ్యమాల్లో  చిత్రాలు చక్కర్లు 
భాజపా, వైకాపాల బంధువర్యుడు రమణదీక్షితులు’ అంటూ కొందరు వ్యాఖ్యానాలు 
21ts-main16a.jpg

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయ మాజీ ప్రధానఅర్చకులు రమణదీక్షితులు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఇటీవల భేటీ అయిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. రమణదీక్షితులు ఇటీవల చెన్నై, దిల్లీ, హైదరాబాద్‌లో వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ తితిదేపై ధ్వజమెత్తుతున్న విషయం విదితమే. దిల్లీలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో.. అదేరోజు ఆయన అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసినట్లుగా చిత్రాలు సోమవారంనుంచి సామాజిక మాధ్యమాల్లో కన్పించాయి. ఈ చిత్రాల కింద ‘భాజపా, వైకాపాల బంధువర్యుడు రమణదీక్షితులు’ అంటూ కొందరు వ్యాఖ్యానాలు కూడా జోడించారు. ఆయన ఆస్తుల చిట్టా, భవంతులు, ఆడి కారు, వాహనానికి ఆర్‌టీఏ జారీ చేసిన రిజిస్ట్రేషన్‌ పత్రంతో కూడిన ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వచ్చాయి. శ్రీవారి ఆలయ పాకశాల(పోటు) మరమ్మతులపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని రమణ దీక్షితులు పునరుద్ఘాటించారు. సీబీఐ విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వస్తాయని, వాటిని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. వజ్రం విషయంలో తితిదే ఈవో నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని విమర్శించారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
టీటీడీ విముక్తి’ కోసం సుప్రీంకోర్టుకు: స్వామి
04-06-2018 00:45:50
 
చెన్నై, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): దేశంలోనే అత్యధిక ఆదాయం అర్జించే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏపీ ప్రభుత్వం గుప్పిట నుంచి విముక్తి చేయాలని కోరుతూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఎం.సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. దీనిపై సోమవారం ఆయన పిల్‌ దాఖలుకు సిద్ధమయ్యారు. తన న్యాయనిపుణులతో చెన్నైలో మంతనాలు జరిపారు.
Link to comment
Share on other sites

దీక్షితులు ఆరోపణల వెనుక కుట్ర: సుధాకర్‌
04-06-2018 00:46:11
 
నెల్లూరు, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): టీటీడీలో అవినీతి జరిగిందని, ఆభరణాలుమాయమయ్యాయని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణల వెనుక కుట్ర దాగుందని టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ అన్నారు. ఆదివారం నెల్లూరులో ఆయనకు జిల్లా యాదవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం జరిగింది. ఈ కార్యక్రమం లో పుట్టా మాట్లాడుతూ రమణదీక్షితులు ఆరోపణలన్నీ అవాస్తవాలన్నారు. 20 ఏళ్లకుపైగా స్వామివారికి సేవలు అందించిన ఆయన టీటీడీ గురించి తప్పుగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. స్వామివారి ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయన్నారు. ఇప్పటివరకు టీటీడీలో యాదవులకు అవకాశం ఇవ్వలేదని, సీఎం చంద్రబాబు రూపంలో శ్రీవారే తనకు చైర్మన్‌ పదవి కేటాయించారని కొనియాడారు.
Link to comment
Share on other sites

51 minutes ago, sonykongara said:
టీటీడీ విముక్తి’ కోసం సుప్రీంకోర్టుకు: స్వామి
04-06-2018 00:45:50
 
చెన్నై, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): దేశంలోనే అత్యధిక ఆదాయం అర్జించే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏపీ ప్రభుత్వం గుప్పిట నుంచి విముక్తి చేయాలని కోరుతూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఎం.సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. దీనిపై సోమవారం ఆయన పిల్‌ దాఖలుకు సిద్ధమయ్యారు. తన న్యాయనిపుణులతో చెన్నైలో మంతనాలు జరిపారు.

veedi veshalu mamulga levuga ... 

TTD vimukthi kosam aa ... nastha poyedi TDP kadura ... 

Is anyone working to bring every temple, masjid , church into this supreme court discussion?

We should.

 

Link to comment
Share on other sites

On 7/20/2016 at 9:46 AM, krishna_Bidda said:
On 7/20/2016 at 9:19 AM, Seniorfan said:

TTD lo only Hindus ne appoint cheyali...... TTD run education institutes lo reservations follow kavalanukonta........ithe ayyaru..... secular/ politically correct ideologies tho savdobbakonda vunte better....at least SV University varaku....

Read more  

Edina ttd hindus ne appoint cheyyali bro...no space for secularism in ttd run institutions..

 

Link to comment
Share on other sites

karunakar reddy ni ysr appoint cheste, chusthu kurchunna deekshithulu CBN meeda matladuthunnadu ... CBN Srivari nagalu dongilinchanda ... ee deekshituluki buddunda asalu ... leka ithaniki support chese brahmins ki buddi leda ... 

veedi intlo ysr photo ... emani respect cheyyamantaru ... alochinchadayya ... 

idi 18 century kaadu ... 

Link to comment
Share on other sites

  • 3 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...