Jump to content

farmer ki


Recommended Posts

4,5 విడతల రుణమాఫీ ఒకేసారి
27-12-2018 03:58:48
 
  • జనవరి మొదటివారంలో జమ
  • కర్నూలులో 670 కోట్లతో మెగాసీడ్‌ పార్క్‌
  • వ్యవసాయంపై శ్వేతపత్రంలో ముఖ్యాంశాలు
అమరావతి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగానికి నాలుగేళ్ల క్రితం కేవలం 4.5ు మాత్రమే బడ్జెట్‌ కేటాయింపులు ఉండగా.. ఇప్పుడు రెట్టింపు పైగా పెంచి 10 శాతానికి తీసుకెళ్లినట్లు రాష్ట్రప్రభుత్వం వ్యవసాయంపై విడుదల చేసిన శ్వేతపత్రంలో తెలిపింది. అందులోని ముఖ్యాంశాలు..
  • 2013-14 బడ్జెట్‌లో వ్యవసాయానికి కేటాయింపులు రూ.6,128కోట్లు. 2018-19లో రూ.19,070కోట్లకు పెంపు.
  • వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 2014 నుంచి స్థిరమైన పెరుగుదల. 2014-15లో వృద్ధిరేటు 3.55 శాతమే. 2015-16లో 7.78ు, 2016-17లో 14.91ు, 2017-18లో 17.76 శాతానికి పెరుగుదల.
  • రైతు రుణమాఫీ కింద రూ.24 వేల కోట్లు కేటాయింపు. 58.29 లక్షల రైతులకు లబ్ధి. ఇప్పటివరకు మూడు విడతల్లో రూ.15,147.57 కోట్లు చెల్లింపు. మిగతా 2 విడతల మొత్తం ఒకేసారి జనవరి మొదటివారంలో చెల్లింపు.
 
రైతన్నకు చేయూత..
  • కౌలు రైతులకు రూ.9411 కోట్ల రుణాలు.
  • రూ.3,556 కోట్లతో పంటల కొనుగోలు.
  • నాలుగేళ్లలో ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.5,500 కోట్లు.
  • నూరు శాతం సబ్సిడీతో 25 లక్షల హెక్టార్లకు ఉచితంగా సూక్ష్మపోషకాలు.
  • 47 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా
  • ఆర్గానిక్‌ పంటల సాగు రాష్ట్రంలో 8 శాతం.
  • రైతు రథం పథకం కింద 12,217 పెద్ద ట్రాక్టర్లు, రోటోవేటర్ల పంపిణీ.
  • వరి ఉత్పాదకతలో రెండోస్థానం. జొన్నలో మొదటి స్థానం.
  • భూసార పరీక్షల అమల్లో రాష్ట్రానికి మొదటి స్థానం. 68 లక్షల మంది రైతుల పొలాల్లో 103.35 లక్షల భూసార పరీక్షలు.
  • కర్నూలు జిల్లా తంగడంచలో రూ.670 కోట్లతో మెగా సీడ్‌ పార్కు.
  • ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన 39.33లక్షల మ ంది రైతులకు రూ.3,608 కోట్ల చెల్లింపు.
 
 
ప్రకృతి సేద్యం..
ప్రకృతి వ్యవసాయం ప్రచారంతో ఎరువుల వాడకం ఐదు లక్షల టన్నుల తగ్గుదల. 2,200 టన్నుల పురుగు మందుల వాడకం తగ్గింపు. తద్వారా రైతులకు రూ.1900 కోట్లు ఆదా.
 
 
మత్స్య సంపద కోసం..
  • చేపల ఉత్పత్తిలో రాష్ట్రానికి ప్రథమ స్థానం.
  • ఆక్వా రైతులకు విద్యుత్‌ చార్జీ యూనిట్‌కు రూ.4.63 నుంచి రూ.2కు తగ్గింపు. 50% సబ్సిడీతో రొయ్యలు, చేపల ప్రాసెసింగ్‌ యూనిటు.
  • ఆక్వా ఉత్పత్తుల విలువ రూ.17,621 కోట్ల నుంచి రూ.41,328 కోట్లకు వృద్ధి.
  • దేశంలో ఉత్పత్తి అయ్యే చేపల్లో 22%, రొయ్యల్లో 65 శాతం రాష్ట్రంలోనే ఉత్పత్తి.
 
 
ఫుడ్‌పార్కులు..
దేశంలో రాష్ట్ర నిధులతో ఫుడ్‌పార్కులు మంజూరుచేస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. ఐదు మెగా ఫుడ్‌ పార్కులు, 5 ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ పార్కులు ప్రారంభం. నెల్లూరు జిల్లాలో మెగా ఫుడ్‌పార్కులో ఉత్పత్తికి శ్రీకారం.
 
 
భవిష్యత్‌ లక్ష్యాలు..
  • 2 కోట్ల ఎకరాలకు సాగునీరు
  • పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి.. వర్షపు నీటి నిల్వతో భూగర్భ జలాల పెంపు.
  • సూక్ష్మసాగు ప్రస్తుత 30 లక్షల ఎకరాల నుంచి కోటి ఎకరాలకు పెంపు.
  • కోటి ఎకరాల్లో ఉద్యానవన పంటల సాగు.
  • నూటికి నూరు శాతం ప్రకృతి సేద్య విధానాలకు అనుగుణంగా వ్యవసాయం.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
తడిసిన ధాన్యం సేకరణ!
18-01-2019 02:36:11
 
636833757721496290.jpg
  • రైతుల కోసం సీఎం సానుకూల నిర్ణయం
  • క్వింటా రూ.1550 చొప్పున కొనుగోలు
  • 3 లక్షల టన్నుల నిల్వలున్నట్టు అంచనా
  • ప్రభుత్వంపై 465 కోట్ల భారం: మంత్రి సోమిరెడ్డి
అమరావతి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ధాన్యం రైతుకు తీపికబురు. పెథాయ్‌ తుఫాన్‌ వల్ల తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయనుంది. క్వింటా రూ.1,550 చొప్పున రైతు నుంచి తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కొనాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెథాయ్‌ తుఫాన్‌ ప్రభావంతో అన్నదాతలు పడుతున్న ఇబ్బందులపై ఈనెల 13న ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ‘అమ్మితే అరువు.. ఉంచితే బరువు’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. టీడీపీ ముఖ్యనాయకులూ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. తడిసిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐ కొనుగోలు చేసేలా చూస్తామని సీఎం ప్రకటించారు. అయితే, కేంద్రం నుంచి సానుకూలత లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలని నిర్ణయించింది. కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో దాదాపు 3 లక్షల టన్నుల తడిసిన ధాన్యం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.
 
ఆ మొత్తాన్ని ప్రభుత్వమే నేరుగా రూ.465 కోట్లతో రైతుల నుంచి కొనుగోలు చేయడానికి సీఎం అంగీకరించారని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వెల్లడించారు. గురువారం సచివాలయంలోని తన చాంబర్‌లో మంత్రి నక్కా ఆనందబాబు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌, పౌరసరఫరాల శాఖ అధికారులు, 3 జిల్లాల రైతు సంఘాల నాయకులతో మంత్రి సోమిరెడ్డి సమావేశం నిర్వహించారు. బీ గ్రేడు ధాన్యం క్వింటా రూ.1750 ఉన్నందున తడిసిన ధాన్యానికి రూ.200 తగ్గించి కొనాలని సీఎం ఆదేశించారని మంత్రి చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారమూ లేదని, పెథాయ్‌ తుఫాన్‌కు నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకుంటుందని స్పష్టం చేశారు.
 
 
నకిలీ ఎరువుల సరఫరాదారులపై చర్యలు
అమరావతి జనవరి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇటీవల వెలుగుచూసిన నకిలీ పొటాష్‌ ఎరువుల వ్యవహారంపై వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం అమరావతి సచివాలయంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల వ్యవసాయ సంయుక్త సంచాలకులు వారి వారి పరిధిలో పూర్తి స్థాయి విచారణ జరిపి నకిలీ ఎరువులు సరఫరా చేస్తున్న డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 4 weeks later...
  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...