Jump to content

Godavari- krishna-pennar rivers interlink study


Recommended Posts

1 hour ago, ravindras said:

exactly deeni gurinchey naa anumaanam and baadha - bhayya 

- TG vaalla ki nastam aney daani kannaa AP ki yekkuva upayogam Ani vaddu anadam + ayicut and water usage can’t exceed upto 50 TMC aney arguement tho deny chestunnaaru antey - it is the time we also stand for our State’s Benefit. Ee akinepalli plan voppukuntey mana AbbaiG and AnnaGaru cheppinatlu mana nethina power bills pedathaaru and more over ippudu MH and KA laa aana kattalu Katti neellu aapi dobbinaaa aascharyam ledu - after all we are living next to Taliban rulers

Link to comment
Share on other sites

1 hour ago, DVSDev said:

exactly deeni gurinchey naa anumaanam and baadha - bhayya 

- TG vaalla ki nastam aney daani kannaa AP ki yekkuva upayogam Ani vaddu anadam + ayicut and water usage can’t exceed upto 50 TMC aney arguement tho deny chestunnaaru antey - it is the time we also stand for our State’s Benefit. Ee akinepalli plan voppukuntey mana AbbaiG and AnnaGaru cheppinatlu mana nethina power bills pedathaaru and more over ippudu MH and KA laa aana kattalu Katti neellu aapi dobbinaaa aascharyam ledu - after all we are living next to Taliban rulers

sabari merge with godavari at kunavaram which is below telangana. in terms of water availability polavaram-penna- cauvery link is ideal  choice as it covers 100 % catchment area of godavari river . it is free from controversies. we have first right over water usage.  only issue here is power consumption to lift water is high. 

if chandrababu able to convince gadkari with this plan then it is good, otherwise our state has to take up this project on its own.  ap government may not able to provide the funding for this big project as it has other commitments on welfare. 

 

Link to comment
Share on other sites

9 hours ago, ravindras said:

ikkada big catch vundi.. why would T oppose this plan when it is getting 100tmc without any investment? AP ki ekkuva benefit ani ante AP ok antundani sketch edho vesinattu vunnaru. AP janala intha vedhavalla kanapadutunnara vellaki?

Link to comment
Share on other sites

29 minutes ago, katti said:

ikkada big catch vundi.. why would T oppose this plan when it is getting 100tmc without any investment? AP ki ekkuva benefit ani ante AP ok antundani sketch edho vesinattu vunnaru. AP janala intha vedhavalla kanapadutunnara vellaki?

Drama sarasam.....to be frank oka rayi vesi Srisailum ki eddam rayi ani...

udyamam time lo freefood recha gottudu ki cheppina sollu ki continuation cheyykapote kastam kada....daniki reasoing SAGAR left canal ki sagar nunchi water vastunte Godavari nunchi enduku ani gorrela ki oka convincing rayi...

basic ga 2014 lo CBN request chesadu DUmmagudem cheyyandi koncham TILPOND ki water vastundi...same time Nalgonda,Khammam survive avutai ani..

AP baga dorikindi water lekunda&source kooda ledu ani reject annaru....sametime inka AP ni alladinchadaniki power istam anna kooda SAGAR,SRISAILUM khali chesi dobbadu...

Till Pattiseema idea came POLAVARAM(they thought it takes 5-7 years) completion was only way for KIRSHNA delta survival..Pattiseema katti chupinchi CBN scene reverse chesadu...

ivvala DUMAGUDEM madchi ettuko maku kuda other options unnai ani CBN PENNA proposal tho rasi mari kottadu....

 

* Nalgonda,Khamma,Sagar Right bhali pasuvulu overall ga...Ippudu 45 KM canal LIFT katti Sagar right ni rescue chestam very soon...

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

On 10/6/2016 at 9:19 AM, sonykongara said:

penna2.jpg

if the central government takeup godvari penna project it may take more than 20 years. cbn can complete this project in 10 years. as per wapcos if the canal capacity is 92,000 cusecs(roughly 8 tmc per day ) there is a possibility to utilize 812 tmc (50 percent dependability) and 707 tmc(75% dependability) it will  require 1,50,000 crore . if cbn able to complete this project and uttarandhra sujala sravanti ,he will be remembered by forever by people in the state. with current behaviour of modi we can't rely on central funding.  To fund this big project cbn have to reduce spending on some projects amaravathi. stop giving freebee like chandranna sankranthi, unemployment benefit . ignore projects like vijayawada metro, vizag metro.  he has to stop giving too much hikes to govenment employees . he needs to reduce spending wherever possible. 

Link to comment
Share on other sites

27 minutes ago, ravindras said:

if the central government takeup godvari penna project it may take more than 20 years. cbn can complete this project in 10 years. as per wapcos if the canal capacity is 92,000 cusecs(roughly 8 tmc per day ) there is a possibility to utilize 812 tmc (50 percent dependability) and 707 tmc(75% dependability) it will  require 1,50,000 crore . if cbn able to complete this project and uttarandhra sujala sravanti ,he will be remembered by forever by people in the state. with current behaviour of modi we can't rely on central funding.  To fund this big project cbn have to reduce spending on some projects amaravathi. stop giving freebee like chandranna sankranthi, unemployment benefit . ignore projects like vijayawada metro, vizag metro.  he has to stop giving too much hikes to govenment employees . he needs to reduce spending wherever possible. 

Penna varuku ayithe AP will have to do it on its own.. if it is extended to Kaveri, then Center will fund it. once the projects like Handri Neeva, Galeru and other small projects are completed in the next year or so, CBN can use that money for this project. Every year 15k-20k funds avasaram.

But TN nunchi chala pressure vastondhi centre ki. North TN ki water levu ippudu... RK Nagar elections lo Seeman deeni midhe campaign chesadu and he got good support antunnaru though he might not win. so TN gola valana anna center might get involved in this project.

Edited by katti
Link to comment
Share on other sites

On Tuesday, December 19, 2017 at 2:34 PM, Jeevgorantla said:
మహా యజ్ఞంపై మెలిక
19-12-2017 02:14:55
 
  • నదీ సంధానంపై కేంద్రం కొత్త ప్రతిపాదన
  • కాళేశ్వరం నుంచి కావేరీ వరకు ‘సంగమం’
  • స్టాక్‌ పాయింట్‌గా నాగార్జున సాగర్‌
  • కాళేశ్వరం చేర్చడంపై ఏపీ అభ్యంతరాలు
  • గోదావరి- కావేరీపై సీఎం సానుకూలత
  • రాష్ట్రానికి వచ్చిన తమిళనాడు అధికారులు
  • నేడు సంధానంపై చర్చలు
అమరావతి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): గోదావరి - కృష్ణా - పెన్నా - కావేరీ నదుల మహా సంగమ ప్రాజెక్టుపై కేంద్రం కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. రాష్ట్ర స్థాయిలో గోదావరి జలాలను పెన్నా నది వరకు తీసుకెళ్లాలన్నది రాష్ట్ర ప్రభుత్వ యోచన కాగా... దీనిని కావేరీ వరకు పొడిగించాలని కేంద్రం ప్రతిపాదించింది. తాజాగా... తెలంగాణలోని కాళేశ్వరాన్ని కూడా జతచేర్చి... అక్కడి నుంచి కావేరీ వరకు మహా సంగమం ప్రాజెక్టు చేపట్టాలంటూ కొత్త మెలిక పెట్టింది.
 
గోదావరి - పెన్నా అనుసంధాన కార్యక్రమం అంతర్‌ రాష్ట్ర నదుల అనుసంధానం కిందకు రాదని, తమిళనాడునూ కలుపుకోవాలన్నది తొలి ప్రతిపాదన. రూ.90 వేల కోట్ల దాకా వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులను మంజూరు చేసే అవకాశం ఉన్నందున రాష్ట్రం సుముఖత తెలిపింది. అయితే, తాజాగా కాళేశ్వరాన్ని కూడా చేర్చడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకు తాగు నీటిని అందిస్తున్నందున కావేరీ దాకా గోదావరి - పెన్నా అనుసంధాన కార్యక్రమాన్ని తీసుకువెళ్లడంపై దృష్టి సారించి డీపీఆర్‌ను సిద్ధం చేయాల్సిందిగా ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ తరుణంలో కేంద్రం మరో మెలిక పెట్టింది.
 
 
తెలంగాణనూ కలుపుకోండి
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌కు, సాగర్‌ నుంచి సోమశిలకు, సోమశిల నుంచి కావేరీకి నదుల అనుసంధానం చేయాలంటూ తాజాగా గడ్కరీ ప్రతిపాదించారు. గోదావరి (కాళేశ్వరం), కృష్ణా (నాగార్జునసాగర్‌), పెన్నా (సోమశిల), కావేరీ నదులను అనుసంధానం చేయడం ద్వారా 100 టీఎంసీల నీటిని బదలాయించేలా కార్యచరణను సిద్ధం చేయాలంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వాప్కోస్ కు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను సాగర్‌లోకి పంపి నిల్వ చేసిన వెంటనే కృష్ణా జలాలపై వాటాను కోల్పోతామని ఏపీ జల వనరుల శాఖ వర్గాలు వివరిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా జలాల్లోని వాటాను వదులుకునేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేస్తున్నారు.
 
 
తమిళనాడు అధికారుల రాక
గోదావరి - పెన్నా - కావేరీ అనుసంధాన ప్రక్రియపై ఏపీ అధికారులతో చర్చించేందుకు తమిళనాడు జల వనరుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నేతృత్వంలోని ఓ బృందం సోమవారం విజయవాడకు వచ్చింది. ఈ బృందం మంగళవారం రాష్ట్ర జల వనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌తో సమావేశమై కావేరీ దాకా గోదావరి జలాలను తరలించే ప్రాజెక్టుపై సమీక్షించనుంది. ఈ చర్చలలో పురోగతి ఉంటే భవిష్యత్‌లో మరిన్ని సమావేశాలు ఏపీ - తమిళనాడు మధ్య జరిగే వీలుందని అధికార వర్గాలు వివరించాయి.

Abn vadu munde rasadu e daridram gurincchi ,maname psttichukola

Link to comment
Share on other sites

 

  • ప్రాజెక్టు వ్యయం 92,450 కోట్లు
అమరావతి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): గోదావరి - పెన్నా నదుల అనుసంధాన మహా యజ్ఞాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. వారం రోజుల క్రితం గోదావరి -పెన్నా అనుసంధానంపై జల వనరుల శాఖతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఐదు దశల్లో గోదావరి-పెన్నా అనుసంధానాన్ని పూర్తి చేసేలా అంచనాలను రూపొందించాలని అధికారులకు సూచించారు. దీంతో.. ఐదు దశల్లో రూ.92,450 కోట్లతో అనుసంధాన కార్యక్రమాన్ని చేపట్టేలా జల వనరుల శాఖ అంచనాలు రూపొందించింది. తొలి దశలో బొల్లాపల్లి రిజర్వాయరు వద్ద అక్విడెక్టు నిర్మిస్తారు. 44 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్‌ను నిర్మిస్తారు. ఐదు లిఫ్టులను ఏర్పాటు చేసి 12.33 కిలోమీటర్ల మేర గోదావరి జలాలను ఎత్తిపోస్తారు. రెండో దశలో పోలవరం నుంచి కృష్ణా నదిలోకి గ్రావిటీ ద్వారా నీటిని తరలించేందుకు 186 కిలోమీటర్ల పొడవునా కాల్వను నిర్మిస్తారు. ఆ తర్వాతి దశల్లో బొల్లాపల్లి రిజర్వాయర్‌ నుంచి సోమశిల జలాశయానికి నీటిని తరలిస్తారు. ఈ ప్రాజెక్టుకు తొలి దశలో.. రూ.9357కోట్లు, రెండో దశలో రూ.15276 కోట్లు, మూడో దశలో రూ.38195 కోట్లు, నాలుగో దశలో రూ.15301 కోట్లు, ఐదో దశలో రూ.14334 కోట్లు వ్యయం చేయనున్నారు. బొల్లాపల్లి నుంచి సోమశిలకు గ్రావిటీ ద్వారా నీటిని అందించేందుకు 381 కిలోమీటర్ల కాల్వను నిర్మించనున్నారు. ఇందులో 1.70 కిలోమీటర్ల మేర టన్నెల్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మొత్తం 320 టీఎంసీల నీటిని నిల్వ చేసుకొనే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం వల్ల 14,200 కుటుంబాలు నిర్వాసితులు అవుతాయని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 9 ఎత్తిపోతల పథకాలు ఉంటాయని, వాటి నిర్వహణకు 2443 మెగావాట్ల విద్యుత్తు అవసరం అవుతుందని అంచనా వేశారు.
Link to comment
Share on other sites

పోలవరం నుంచే మేలు 
కావేరితో అనుసంధానంపై వ్యాప్కోస్‌ స్పష్టీకరణ 
ఇంద్రావతి ఉప పరీవాహక ప్రాంతంలో అంత నీటి లభ్యత లేదు 
ఛత్తీస్‌గఢ్‌ నీటి వాటాపై ఆధారపడి ఇంత వ్యయం సరికాదు 
కేంద్ర మంత్రి గడ్కరీకి వివరించనున్న వ్యాప్కోస్‌ ప్రతినిధులు 
ఈనాడు - అమరావతి
అకినేపల్లి నుంచి గోదావరి జలాలను కావేరికి మళ్లించడం కన్నా పోలవరం జలాశయం నిర్మాణం తర్వాత అక్కడి నుంచి (పైడిపాకల నుంచి) మళ్లించడమే మేలని కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్‌ తేల్చి చెప్పింది. దుమ్ముగూడెంకు ఎగువన తుపాకులగూడెంకు దిగువన అకినేపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి నాగార్జునసాగర్‌ జలాశయానికి పంపి అక్కడి నుంచి సోమశిల, ఆ తర్వాత కావేరి నదికి గోదావరి నీటిని మళ్లించాలని జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూఏ) ప్రతిపాదిస్తోంది. ఇది ఆచరణయోగ్యం కాదని, అందులో అనేక ఇబ్బందులున్నాయని పేర్కొంటూ ఒక తాజా నివేదికను వ్యాప్కోస్‌ రూపొందించింది. నివేదికలోని వివరాలను ఆంధ్రప్రదేశ్‌ జల వనరులశాఖ అధికారులు కొందరికి బుధవారం వ్యాప్కోస్‌ ప్రతినిధులు వివరించారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వ్యాప్కోస్‌కు సర్వే బాధ్యతలు అప్పగించింది. లైడార్‌ సర్వే చేసి పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని సూచించింది. ఆ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు లైడార్‌ సర్వే పూర్తి చేశారు. తాజాగా కేంద్రం గోదావరి నీటిని కావేరికి తరలించాలని భావిస్తున్న నేపథ్యంలో వారు ఈ అంశాన్నీ అధ్యయనం చేశారు. అందులోని ముఖ్యాంశాలివీ.... 
* గోదావరికి మొత్తం 12 ఉప పరీవాహక ప్రాంతాలున్నాయి. అకినేపల్లి వద్ద నుంచి నీరు తరలించాలంటే ఇంద్రావతి ఉప పరీవాహక ప్రాంతంపై ఆధారపడాలి. ఇక్కడ ఛత్తీస్‌గఢ్‌కు 180 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 130 టీఎంసీల వాటాలున్నాయని చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌ తన వాటా నీటిని వాడుకుంటే ఇక్కడ గోదావరి నీటిని మళ్లించడానికి లభ్యత ఉండదు. 
* ప్రతిపాదిత ప్రాంతం దిగువన తెలంగాణ ఒక బ్యారేజీ, ఎగువన తుపాకులగూడెం వద్ద మరో ప్రాజెక్టు చేపడుతోంది. ప్రస్తుత ప్రతిపాదిత ప్రాంతం రెండింటి మధ్య ఉండటంతో అక్కడ నీటిని ఎత్తిపోసేందుకు నిర్దేశించుకునే ఎత్తువద్ద కొన్ని పరిమితులున్నాయి. అవి నీటిని ఒక స్థాయి దాటి మళ్లించడానికి ఆస్కారం లేకుండా ఉన్నాయి. 
* ఛత్తీస్‌గఢ్‌ తన వాటాను వినియోగించుకుంటే అకినేపల్లి వద్ద ప్రతిపాదిత 240 టీఎంసీలు అందుబాటులో ఉండవు. జంఝావతి, పోలవరంలపై ఛత్తీస్‌గఢ్‌ న్యాయస్థానాల్లో కేసులు వేసినందున వారి నుంచి ఈ ఇబ్బందినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 
* పోలవరం నిర్మాణం తర్వాత పైడిపాకల నుంచి నీటిని ఎత్తిపోసి మళ్లించదలుచుకుంటే గోదావరిలో 75శాతం విశ్వసనీయతవద్ద 700 టీఎంసీల వరకూ నీటి లభ్యత ఉంటుందని పేర్కొంటున్నారు. ఇక్కడ శబరి నుంచి 300 టీఎంసీలు లభిస్తున్నందున ఇక్కడ నుంచి పెన్నా ఆ తర్వాత కావేరి వరకు మళ్లింపునకు ఇబ్బందులు ఉండవు.

Link to comment
Share on other sites

http://epaper.eenadu.net/index.php?rt=email/viewemail&a=MjAxNzEyMjlhXzAwMjEzNDAxMg==&V=SW1hZ2U=

telangana engineers suggested government to oppose akinepally proposal .one thing is clear telangana won't allow interlinking from its land. chattisgarh and maharashtra oppose inchampalli project . polavaram - penna - cauvery is only option available before central government

Edited by ravindras
Link to comment
Share on other sites

  • 2 weeks later...
అకినేపల్లిపై ఆచితూచి!
తెలంగాణ ప్రయోజనాలకు ఇబ్బంది లేకపోతే సానుకూలం
భాగస్వామ్య రాష్ట్రాలతో నేడు మంత్రి గడ్కరీ సమావేశం
ఈనాడు - హైదరాబాద్‌

గోదావరిపై అకినేపల్లి నుంచి నాగార్జునసాగర్‌కు నీటిని మళ్లించే అనుసంధానంపై తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించనుంది. తెలంగాణకు ఉన్న కేటాయింపులు, ప్రయోజనాలు దెబ్బతినకుండా చేపడితే తమకేమీ అభ్యంతరం లేదన్న అభిప్రాయాన్ని బుధవారం జలవనరుల మంత్రిత్వశాఖ వద్ద జరిగే సమావేశంలో వ్యక్తం చేయనున్నట్లు తెలిసింది.నదుల అనుసంధానంలో భాగంగా గోదావరిపై అకినేపల్లి వద్ద బ్యారేజి నిర్మించి నాగార్జునసాగర్‌-సోమశిల-గ్రాండ్‌ ఆనకట్ట అనుసంధానం ద్వారా 247 టీఎంసీల నీటిని వినియోగించుకొనేలా జాతీయ జల అభివృద్ధి సంస్థ కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. దీనిపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ భాగస్వామ్య రాష్ట్రాలతో బుధవారం దిల్లీలో సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, అంతర్‌ రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ నరసింహరావు హాజరుకానున్నారు. కేంద్ర ప్రతిపాదనపై ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా చర్చించినట్లు తెలిసింది. ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకించకుండా ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ట్రైబ్యునల్‌ ప్రకారం తెలంగాణకు గోదావరిలో 954 టీఎంసీల కేటాయింపు ఉంది. ఈ నీటి వినియోగానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా, దిగువన చేపట్టిన సీతారామ ఎత్తిపోతల తదితర పథకాలకు నష్టం లేకుండా అనుసంధానం చేపడితే అభ్యంతరం లేదన్న అభిప్రాయాన్ని దిల్లీ సమావేశంలో వ్యక్తం చేయనున్నట్లు సమాచారం. అదనంగా ఎంతో కొంత ప్రయోజనం కలిగేలా ఉండాలని, మిగులు జలాలు, నీటి లభ్యతపై జాతీయ జల అభివృద్ధి సంస్థ అధ్యయనంపై వాప్కోస్‌ లేదా మరో సంస్థతో పరిశీలింపచేయమని కోరనున్నట్లు తెలిసింది. అకినేపల్లి వద్ద నుంచి కాకుండా మరో ప్రత్యామ్నాయ స్థలం వద్ద నుంచి అనుసంధానం చేపట్టే అంశాన్ని కూడా పరిశీలించాలని కోరే అవకాశం ఉంది. ప్రతిపాదనను వ్యతిరేకించకుండానే రాష్ట్రం అభిప్రాయాలు చెప్పడం, అదనంగా ప్రయోజనం కలుగుతుందనుకుంటే సానుకూలంగా పరిశీలించడం అన్న పద్ధతిలో పోవాలన్నది ప్రభుత్వ అభిప్రాయంగా ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి.

సానుకూలంగా ఆంధ్రప్రదేశ్‌
అకినేపల్లి బ్యారేజీ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌ సానుకూలంగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన దుమ్ముగూడెం-నాగార్జునసాగర్‌ టేల్‌పాండ్‌కు తాజా ప్రతిపాదన ప్రత్యామ్నాయంగానే ఏపీ భావిస్తోంది. టేల్‌పాండ్‌ పథకంలో 165 టీఎంసీలు మళ్లిస్తే, ప్రస్తుతం 247 టీఎంసీలను మళ్లించేలా ప్రతిపాదించారు.పెరిగిన నీటిని తమిళనాడుకు మళ్లిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి అంతర్‌ రాష్ట్ర జలవనరుల విభాగం సాంకేతిక సలహాదారు రామకృష్ణ, చీఫ్‌ ఇంజినీర్‌ నాగేశ్వరరావు, హైడ్రాలజీ విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ కుమార్‌ దిల్లీ సదస్సుకు హాజరుకానున్నారు. నదుల అనుసంధానంపై గతంలో జరిగిన సమావేశాల్లో కూడా ఏపీ సానుకూలత వ్యక్తం చేసింది.

Link to comment
Share on other sites

కృష్ణా నీటి లభ్యత తగ్గింది.. గోదావరే దిక్కు: హరీశ్‌

 

దిల్లీ: గోదావరి- కావేరిని తొలి విడతలో,  మహానది - గోదావరిని రెండో విడతలో అనుసంధానం చేస్తామని కేంద్ర ప్రభుత్వం  ప్రతిపాదించిందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బుధవారం ఆయన దిల్లీలో జరిగిన నదుల అనుసంధానం సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాల్గొని తన అభిప్రాయాలు వెల్లడించినట్టు ఆయన వివరించారు. గోదావరి, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు, కావేరి నదుల అనుసంధానంపై సమావేశంలో చర్చ జరిగినట్టు చెప్పారు. నదుల అనుసంధానంపై తాము నాలుగు అభ్యంతరాలు తెలిపామన్నారు. కేంద్రం లెక్క ప్రకారం 3వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుందని అంచనా ఉందని, అదే నిజమైతే నదుల అనుసంధానానికి తెలంగాణ అనుకూలమేనని హరీశ్‌రావు స్పష్టంచేశారు. కృష్ణా నదిలో నీటిలభ్యత తగ్గడంతో, తెలంగాణకు గోదావరే దిక్కు అవుతుందని హరీశ్‌ అన్నారు. గోదావరిలో తెలంగాణకు 954 టీఎంసీల నీటి హక్కు ఉందని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు 100 టీఎంసీలతో వరంగల్‌ను సస్యశ్యామలం చేయబోతున్నట్టు వెల్లడించారు. అంతర్‌ రాష్ట్ర నదుల అనుసంధానానికి సీతారామ ప్రాజెక్టే నిదర్శనంగా నిలుస్తోందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మంలోని కృష్ణా ఆయకట్టుకు కూడా నీరందుతుందని చెప్పారు. రాష్ట్రానికి అవసరమైన 1600 టీఎంసీలు కేటాయించి.. మిగిలిన నీటిని అనుసంధానం చేసుకోవచ్చని తెలిపారు. అక్కనపల్లిలో నీటిని మళ్లిస్తే సీతారామ ప్రాజెక్టుకు ఇబ్బంది కలుగుతుందన్నారు. కాళేశ్వరం, కంతనపల్లి అనుమతికి 40 ఏళ్ల సరాసరిని సీడబ్ల్యూసీ పరిశీలించిందని మంత్రి తెలిపారు. నదుల అనుసంధానానికి 110 ఏళ్ల సరాసరి తీసుకోవడం సరికాదన్నారు. నీటి లభ్యతపై సీడబ్ల్యూఎన్‌, ఎన్‌డబ్ల్యూడీఏ, రాష్ట్ర అధికారులతో కమిటీ వేయాలని కోరారు.
 
కాళేశ్వరం పనులపై గడ్కరీ ప్రశంస
అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు పనితీరును కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రశంసించారని మంత్రి తెలిపారు. కాళేశ్వరం పనులు పరిశీలనకు కేంద్రమంత్రి, జలవనరుల శాఖ కార్యదర్శిని ఆహ్వానించినట్టు హరీశ్‌రావు తెలిపారు. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు గడ్కరీ వస్తానని తనతో చెప్పినట్టు హరీశ్‌రావు వెల్లడించారు. మిషన్‌ కాకతీయ పథకానికి ట్రిపుల్‌ ఆర్‌లో నిధులు మంజూరు చేయాలని కోరినట్టు చెప్పారు.
Link to comment
Share on other sites

రెండు మార్గాల్లో సంధానం
18-01-2018 01:47:41
 
636518368629202998.jpg
  • తొలి దశలో గోదావరి-కావేరీ సంగమం
  • ఆ తర్వాత మహానది-గోదావరి కలయిక
  • ఖమ్మం జిల్లా అకినేపల్లి వద్ద డ్యామ్‌.. అక్కడి నుంచి సాగర్‌, పెన్నా ద్వారా కావేరికి
  • గడ్కరీ ప్రతిపాదన.. తమకు 1500 టీఎంసీలు ఇస్తే సరేనన్న తెలంగాణ
  • సీఎంలతో భేటీ అనంతరం తదుపరి నిర్ణయం.. సంధాన స్ఫూర్తి బాబుదే: గడ్కరీ
న్యూఢిల్లీ/అమరావతి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ‘‘గోదావరి-కృష్ణా సంగమం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నదుల అనుసంధానానికి ప్రధాన స్ఫూర్తిగా నిలిచారు. ఇదే స్ఫూర్తితో .. దేశంలోని ఇతర నదుల అనుసంధాన ప్రక్రియకు రాష్ట్రాలన్నీ సహకరించాలి’’ అని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కోరారు. బుధవారం ఢిల్లీలో జరిగిన నదీ జలాల అనుసంధాన పథకం 14వ సమావేశానికి
 
 
ఆయన అధ్యక్షత వహించారు. తన ప్రారంభోపన్యాసంలోనే.. గోదావరి - కృష్ణా నదులను పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా అనుసంధానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిద్వారా 13 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించారన్నారు. చంద్రబాబు దూరదృష్టికి ఇది నిదర్శనమని తెలిపారు. దేశ వ్యాప్తంగా నదుల అనుసంధానం చేయాలనే లక్ష్యంలో భాగంగా మహానది నుంచి కావేరి వరకు నదులను అనుసంధానించాలని కేంద్రం భావిస్తోందన్నారు. అయితే... ఇందుకు ఒడిసా ప్రభుత్వం సహకరించనందున ప్రత్యామ్నాయ కార్యాచరణను సిద్ధం చేశామని గడ్కరీ తెలిపారు. మొదటి దశలో గోదావరి-కావేరి అనుసంధానం చేపట్టి... ఆ తర్వాత రెండో దశలో మహానది-గోదావరి అనుసంధానం చేయాలనే ప్రతిపాదన ఉందని వివరించారు. తొలిదశలో భాగంగా గోదావరిపై ఖమ్మం జిల్లా అకినేపల్లి దగ్గర ప్రాజెక్టు నిర్మించి 170 టీఎంసీల మిగులు జలాలను నాగార్జున సాగర్‌ టెయిల్‌పాండ్‌కు అనుసంధానించాలని ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు.
 
 
నాగార్జున సాగర్‌ నుంచి సోమశిల రిజర్వాయరులోని పెన్నా బేసిన్‌లోకి.. అక్కడి నుంచి కావేరీ గ్రాండ్‌ ఆనకట్ట దాకా జలాల తరలింపు జరుగుతుందన్నారు. రెండో దశలో... పోలవరం డ్యామ్‌ నుంచి పెన్నా పరీవాహకంలోకి నీటిని తరలించి... ఆ తర్వాత కావేరీలోకి జలాలను తరలించాలన్న ప్రతిపాదన కూడా ఉందని గడ్కరీ పేర్కొన్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ సుముఖంగా ఉందని... మీ అభిప్రాయం కూడా చెప్పాలని ఈ సమావేశానికి హాజరైన తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి హరీశ్‌ను గడ్కరీ కోరారు.
 
 
అకినేపల్లి వద్ద రిజర్వాయరు నిర్మాణంతో తెలంగాణకు నష్టం జరుగుతుందని హరీశ్‌ పేర్కొన్నారు. చివరికి... తెలంగాణ అవసరాలకు 1500 టీఎంసీలు కేటాయిస్తూ లిఖిత పూర్వక హామీ ఇచ్చి మిగిలిన నీళ్లు అనుసంధానం పేరుతో తరలించినా తమకు అభ్యంతరం లేదని హరీశ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, కార్యదర్శులతో సమావేశాన్ని ఏర్పాటు చేశాక దీనిపై తుది నిర్ణయం తీసుకుందామని గడ్కరీ స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

త్వరలో గోదావరి-పెన్నా తొలిదశ
రూ.20వేల కోట్లతో ప్రణాళిక సిద్ధం
ఇందులో భాగంగానే ప్రకాశం ఎత్తిపోతల
గోదావరి-పెన్నా అనుసంధాన దిశలోనే తొలిదశ నిర్మాణం
రెండు మూడు నెలల్లోనే ప్రారంభించేలా ఏర్పాట్లు
ఈనాడు - అమరావతి
19ap-main6a.jpg

నాగార్జునసాగర్‌ కుడి కాలువ ఆయకట్టుకు గోదావరి నీళ్లు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక బృహత్తర పథకానికి శ్రీకారం చుడుతోంది. గోదావరి-పెన్నా అనుసంధాన తొలిదశగా అతి త్వరలోనే దీన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పోలవరం కుడి కాలువ నుంచే పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల ద్వారా దాదాపు 14 వేల క్యూసెక్కుల వరకు ప్రకాశం బ్యారేజికి తీసుకొస్తారు. ఆ అదనపు నీటిని ప్రకాశం బ్యారేజి ఎగువ నుంచి ఎత్తిపోసి సాగర్‌ కుడి కాలువకు చేరుస్తారు. గోదావరి-పెన్నా అనుసంధాన ప్రణాళికలో భాగంగా...ఆ ప్రాజెక్టు ఏ ఎలైన్‌మెంట్‌లో చేపడుతున్నారో ఆ దిశలోనే ఈ పనులుంటాయి. ఇప్పుడు చేసే పనులు ఆ అనుసంధాన పనులకు ఉపయోగించుకునేందుకు అనువుగా ఉంటాయి. రాబోయే రెండు మూడు నెలల్లో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.20 వేల కోట్లు ఖర్చు కానుంది. ఎంత మేర నీటిని ఎత్తిపోయాలి, తొలిదశలో ఎంత మేర ఖర్చు తగ్గించుకోవచ్చో అనే అంశంపై జలవనరులశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తుది ప్రణాళిక రూపుదిద్దుకోవాల్సి ఉంది.

ఈ ప్రాజెక్టు ఎలా....
ప్రస్తుతం పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి వరద కాలంలో పోలవరం కుడి కాలువ నుంచి 80 టీఎంసీలకు పైగా నీటిని ప్రకాశం బ్యారేజికి మళ్లిస్తున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా ఆ కాలంలో రోజూ 8000 క్యూసెక్కులు మళ్లిస్తున్నారు. పోలవరం కుడి కాలువ 17000 క్యూసెక్కుల ప్రవాహానికి వీలుగా నిర్మించారు. ఈ కాలువలో పట్టిసీమ నుంచి అదనంగా వచ్చే నీటి కన్నా ఎక్కువగా మళ్లించే ఏర్పాటు ఇప్పటికే పూర్తయింది. మరో వైపు పట్టిసీమ సమీపంలో గోదావరిపై చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే ఖరీఫ్‌ కాలానికల్లా పూర్తి చేసేలా ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయి. అయితే చింతలపూడి కాలువలు, ఇతరత్రా పనులు ఆలస్యమయ్యే పరిస్థితి
కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చింతలపూడి నుంచి  6000 క్యూసెక్కుల వరకు పోలవరం కుడి కాలువకు మళ్లించి మొత్తం ప్రకాశం బ్యారేజికి రమారమి 14000 క్యూసెక్కుల వరకు మళ్లించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.  ఇందుకు  కుడి కాలువలో ఎక్కడైనా కాలువ కట్ట ఎత్తు పెంచాల్సి ఉంటే ఆ మేరకు పనులు చేసుకుని గోదావరి నీటిని అదనంగా ప్రకాశం బ్యారేజికి మళ్లిస్తారు. ఆ నీరు ప్రకాశం బ్యారేజిలో చేరితే దాదాపు వైకుంఠపురం వరకు  నీరుంటుంది. వైకుంఠపురం బ్యారేజి నిర్మాణం చేపట్టకముందే అక్కడి నుంచి నీటిని ఎత్తిపోసుకోవచ్చు.

120 రోజుల్లో మొత్తం 73 టీఎంసీలు మళ్లించాలని...
* 120 రోజుల్లో మొత్తం 73 టీఎంసీలు మళ్లించాలని ప్రాథమిక భావన. రోజుకు 7000 క్యూసెక్కుల మళ్లింపు.

* ఆరుదశల్లో ఎత్తిపోతల సాగుతుంది. మొత్తం 16.58 కిలోమీటర్ల మేర పైపులైను ఏర్పాటు చేస్తారు.

* 50.72 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాలువ నిర్మిస్తారు.

* 15 మీటర్ల వద్ద కృష్ణా నది నుంచి నీటిని ఎత్తిపోసి... +140 మీటర్ల వద్ద సాగర్‌ కుడి కాలువలో పోస్తారు. దాదాపు కారంపూడి వద్ద కాలువలో నీళ్లు కలుస్తాయి.

* 28.20 మెగావాట్ల విద్యుత్తు అవసరమవుతుంది.

Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:
త్వరలో గోదావరి-పెన్నా తొలిదశ
రూ.20వేల కోట్లతో ప్రణాళిక సిద్ధం
ఇందులో భాగంగానే ప్రకాశం ఎత్తిపోతల
గోదావరి-పెన్నా అనుసంధాన దిశలోనే తొలిదశ నిర్మాణం
రెండు మూడు నెలల్లోనే ప్రారంభించేలా ఏర్పాట్లు
ఈనాడు - అమరావతి
19ap-main6a.jpg

నాగార్జునసాగర్‌ కుడి కాలువ ఆయకట్టుకు గోదావరి నీళ్లు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక బృహత్తర పథకానికి శ్రీకారం చుడుతోంది. గోదావరి-పెన్నా అనుసంధాన తొలిదశగా అతి త్వరలోనే దీన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పోలవరం కుడి కాలువ నుంచే పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల ద్వారా దాదాపు 14 వేల క్యూసెక్కుల వరకు ప్రకాశం బ్యారేజికి తీసుకొస్తారు. ఆ అదనపు నీటిని ప్రకాశం బ్యారేజి ఎగువ నుంచి ఎత్తిపోసి సాగర్‌ కుడి కాలువకు చేరుస్తారు. గోదావరి-పెన్నా అనుసంధాన ప్రణాళికలో భాగంగా...ఆ ప్రాజెక్టు ఏ ఎలైన్‌మెంట్‌లో చేపడుతున్నారో ఆ దిశలోనే ఈ పనులుంటాయి. ఇప్పుడు చేసే పనులు ఆ అనుసంధాన పనులకు ఉపయోగించుకునేందుకు అనువుగా ఉంటాయి. రాబోయే రెండు మూడు నెలల్లో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.20 వేల కోట్లు ఖర్చు కానుంది. ఎంత మేర నీటిని ఎత్తిపోయాలి, తొలిదశలో ఎంత మేర ఖర్చు తగ్గించుకోవచ్చో అనే అంశంపై జలవనరులశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తుది ప్రణాళిక రూపుదిద్దుకోవాల్సి ఉంది.

ఈ ప్రాజెక్టు ఎలా....
ప్రస్తుతం పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి వరద కాలంలో పోలవరం కుడి కాలువ నుంచి 80 టీఎంసీలకు పైగా నీటిని ప్రకాశం బ్యారేజికి మళ్లిస్తున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా ఆ కాలంలో రోజూ 8000 క్యూసెక్కులు మళ్లిస్తున్నారు. పోలవరం కుడి కాలువ 17000 క్యూసెక్కుల ప్రవాహానికి వీలుగా నిర్మించారు. ఈ కాలువలో పట్టిసీమ నుంచి అదనంగా వచ్చే నీటి కన్నా ఎక్కువగా మళ్లించే ఏర్పాటు ఇప్పటికే పూర్తయింది. మరో వైపు పట్టిసీమ సమీపంలో గోదావరిపై చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే ఖరీఫ్‌ కాలానికల్లా పూర్తి చేసేలా ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయి. అయితే చింతలపూడి కాలువలు, ఇతరత్రా పనులు ఆలస్యమయ్యే పరిస్థితి
కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చింతలపూడి నుంచి  6000 క్యూసెక్కుల వరకు పోలవరం కుడి కాలువకు మళ్లించి మొత్తం ప్రకాశం బ్యారేజికి రమారమి 14000 క్యూసెక్కుల వరకు మళ్లించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.  ఇందుకు  కుడి కాలువలో ఎక్కడైనా కాలువ కట్ట ఎత్తు పెంచాల్సి ఉంటే ఆ మేరకు పనులు చేసుకుని గోదావరి నీటిని అదనంగా ప్రకాశం బ్యారేజికి మళ్లిస్తారు. ఆ నీరు ప్రకాశం బ్యారేజిలో చేరితే దాదాపు వైకుంఠపురం వరకు  నీరుంటుంది. వైకుంఠపురం బ్యారేజి నిర్మాణం చేపట్టకముందే అక్కడి నుంచి నీటిని ఎత్తిపోసుకోవచ్చు.

120 రోజుల్లో మొత్తం 73 టీఎంసీలు మళ్లించాలని...
* 120 రోజుల్లో మొత్తం 73 టీఎంసీలు మళ్లించాలని ప్రాథమిక భావన. రోజుకు 7000 క్యూసెక్కుల మళ్లింపు.

* ఆరుదశల్లో ఎత్తిపోతల సాగుతుంది. మొత్తం 16.58 కిలోమీటర్ల మేర పైపులైను ఏర్పాటు చేస్తారు.

* 50.72 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాలువ నిర్మిస్తారు.

* 15 మీటర్ల వద్ద కృష్ణా నది నుంచి నీటిని ఎత్తిపోసి... +140 మీటర్ల వద్ద సాగర్‌ కుడి కాలువలో పోస్తారు. దాదాపు కారంపూడి వద్ద కాలువలో నీళ్లు కలుస్తాయి.

* 28.20 మెగావాట్ల విద్యుత్తు అవసరమవుతుంది.

Good at least 1 pump complete cheyali before elections appudu use tdp ki

Link to comment
Share on other sites

రూ.80వేల కోట్లు
గోదావరి-పెన్నా అనుసంధానంపై వ్యాప్కోస్‌ వ్యయ అంచనా
తొలుత 3.5 ఆనక 4.9 టీఎంసీలు
ఇది రోజుకి మళ్లించే నీరు
బొల్లంపల్లితో పాటు మరో నాలుగు జలాశయాలకు   నీటి మళ్లింపు
ఈనాడు - అమరావతి
20ap-main5a.jpg

గోదావరి పెన్నా అనుసంధానంలో భాగంగా తొలుత రోజుకు 3.5 టీఎంసీలు మళ్లించేలా, ఆ తర్వాత రోజుల్లో క్రమంగా రోజుకు 4.9 టీఎంసీల వరద జలాలు మళ్లించేలా నిర్మాణ ప్రక్రియను పెంచుకుంటూ వెళ్లడమే ఉత్తమమని వ్యాప్కోస్‌ సిఫార్సు చేసింది. వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రావిటీ కాలువ విషయంలో మాత్రం ముందే 4.9 టీఎంసీల సామర్ధ్యానికి అనువుగా నిర్మించుకుంటే బాగుంటుందని పేర్కొంది. పంపింగు వ్యవస్థ, టన్నెళ్లు, అక్విడక్టు నిర్మాణాలకు సంబంధించిన వ్యవస్థ మాత్రం క్రమంగా అవసరాలకు అనుగుణంగా పెంచుకుంటూ వెళ్లవచ్చంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టుకు అయ్యే మొత్తం వ్యయం రూ.80వేల కోట్లని వివరించింది.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అధ్యయన బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే. వారు ఇటీవలే లైడార్‌ సర్వే, హైడ్రో గ్రాఫిక్‌ సర్వే పూర్తి చేసి జియోటెక్నికల్‌ పరిశోధన ప్రారంభించారు. అధ్యయన అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. రెండు దశల్లో ఈ ప్రాజెక్టు చేపట్టాలని, ప్రాజెక్టు రూపుదిద్దడానికి దాదాపు రెండు దశాబ్దాలు పడుతుందని వ్యాప్కోస్‌ పేర్కొంది.

వ్యాప్కోస్‌ సూచిస్తున్న తాజా ఎలైన్‌మెంట్‌
ప్రతిపాదన ఇదీ...
* తొలుత పోలవరం జలాశయం నుంచి +45 మీటర్ల స్థాయి నుంచి నీటిని +80 మీటర్లకు ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి  187 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాలువ ద్వారా +65 మీటర్లకు తీసుకువెళ్తారు. అక్కడ 1.3 కిలోమీటర్ల మేర టన్నెల్‌ నిర్మించాలి. తిరిగి గ్రావిటీలో +55 మీటర్లకు తరలిస్తారు. మరో టన్నెల్‌ నిర్మించి అక్కడి నుంచి కృష్ణా నది వరకు గ్రావిటీ కాలువ ద్వారా నీటిని పంపిస్తారు.

* కృష్ణా నదిలో ఈ నీటిని పోయరు. నదిపై 4.6 కిలోమీటర్ల పొడవునా అక్విడక్టు నిర్మించి నది ఆవల +50 మీటర్ల స్థాయికి ఆ నీరు మళ్లిస్తారు.

* అక్కడి నుంచి తిరిగి పంపుహౌస్‌ ఏర్పాటు చేసి నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. అక్విడక్టు దాటిన తర్వాత +120 మీటర్ల స్థాయికి నీటిని ఎత్తిపోస్తారు. తిరిగి గ్రావిటీ ద్వారా 115 మీటర్లకు తీసుకొస్తారు.

* పంపింగు వ్యవస్థ ద్వారా కొత్తగా గుంటూరు జిల్లా బొల్లాపల్లి వద్ద నిర్మించనున్న జలాశయంలో నింపుతారు. అది +240 మీటర్ల స్థాయిలో ఉంటుంది. ఆ జలాశయంలో +160 మీటర్ల స్థాయి నుంచి నీటిని తిరిగి గ్రావిటీ కాలువ ద్వారా తీసుకొస్తారు. సోమశిల జలాశయానికి తీసుకెళ్లే లోపు మధ్యలో ఇప్పటికే సిద్ధమై ఉన్న గుండ్లకమ్మ, ముప్పవరం, చిన్నిపాడు, ఉప్పులూరు జలాశయాలకు ఈ గ్రావిటీ కాలువ నుంచి నాలుగు చోట్ల మళ్లీ విడివిడిగా వేర్వేరు మార్గాల్లో కాలువలు తవ్వి కొంత నీటిని నింపుతారు.

* బొల్లాపల్లి జలాశయంలో ఇంతకుముందే చెప్పిన +160మీటర్ల స్థాయి నుంచి 288 కిలోమీటర్లకు పైగా గ్రావిటీ ద్వారా నీటిని తీసుకొచ్చి +100 మీటర్లకు చేరుస్తారు. అక్కడ కిలోమీటరుమేర టన్నెల్‌ తవ్వి ఆ నీటిని సోమశిల జలాశయానికి చేరుస్తారు.

20ap-main5b.jpg

నీటి మళ్లింపు...
నిల్వపై భిన్న కోణాల్లో పరిశీలన...
1. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా రోజుకు 3.5 టీఎంసీల చొప్పున మొత్తం 400 టీఎంసీలు మళ్లించడం... 75శాతం విశ్వసనీయత వద్ద మొత్తం మళ్లింపు లక్ష్యంలో 40శాతం మేర అంటే 160 టీఎంసీలు నిల్వ చేసే జలాశయం నిర్మాణం.

2. నిర్మాణంలో ఉన్న రాష్ట్రంలోని ప్రాజెక్టుల అవసరాలకు తగ్గట్టుగా రోజుకు 4.35 టీఎంసీల చొప్పున 400 టీఎంసీల మళ్లింపు. ఇందులో 50శాతం అంటే 200 టీఎంసీలు 75శాతం విశ్వసనీయత వద్ద నిల్వ చేసుకోవడం.

3. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో గోదావరిలో లభ్యతఉన్న నీటిని అవసరాల మేరకు పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు.. రోజుకు 4.9 టీఎంసీల చొప్పునమళ్లింపు. ఇందులో 60శాతం మేర అంటే 240 టీఎంసీలు నిల్వ చేయడం. 50శాతం విశ్వసనీయత వద్ద 400 టీఎంసీల వినియోగం. 75శాతం విశ్వసనీయత వద్ద 360 టీఎంసీలు వినియోగించుకోవడం.

ఇదొక మార్గం...
ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం పోలవరం కుడి కాలువ, నాగార్జునసాగర్‌ కుడి కాలువలను వినియోగించుకోవాలి. తొలుత కాలువలపై ఎలాంటి ఖర్చు పెట్టకుండా పంపుహౌస్‌లతో నీటి మళ్లింపుపై దృష్టిపెట్టాలి. ఆ తర్వాతదశల్లో గోదావరిపెన్నా అనుసంధానం నిమిత్తం విడిగా కాలువలు నిర్మించుకుంటూ పెద్ద స్థాయిలో నీటినిమళ్లించేలా ముందుకు వెళ్లడమే మంచిది. ఇలాచేయడంతో నిధుల వ్యయానికి సంబంధించి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లడమూ సాధ్యం.

రాష్ట్ర ప్రభుత్వ తాజా ఆలోచన ఇదీ...!
గోదావరి పెన్నా అనుసంధానం తక్షణమే పూర్తి స్థాయిలో చేపట్టేందుకు అవసరమైన వనరులు ప్రభుత్వం వద్ద లేవు. కొద్ది కాలంగా 14 లక్షల ఎకరాల సాగర్‌ కుడి కాలువ ఆయకట్టు నీళ్లు లేక.. కృష్ణా నీళ్లు రాక తల్లడిల్లుతోంది. ఈ కాలువ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాలు తాగునీరూ లేక అల్లాడుతున్నాయి. పూర్తి స్థాయిలో గోదావరి పెన్నా అనుసంధానం చేపట్టే లోపు ఉన్న కాలువలు, నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాలను వినియోగించుకుని సాగర్‌ కుడి కాలువ ఆయకట్టుకు వీలైనంత తొందరగా నీరు మళ్లించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని వినియోగించుకుని పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాల ద్వారా ప్రకాశం బ్యారేజికి అదనంగా నీటిని తీసుకురావాలని భావిస్తోంది. కృష్ణాలో అందుబాటులో ఉన్న నీటిని కొంత జత చేసి వైకుంఠపురం సమీప ప్రాంతం నుంచి ప్రకాశం బ్యారేజిలో నిల్వ ఉన్న నీటిని ఆరుదశల్లో ఎత్తిపోసి సాగర్‌ కుడి కాలువకు నీరందించాలని చూస్తోంది. ప్రస్తుత వ్యాప్కోస్‌ ప్రతిపాదిత గోదావరి-పెన్నా పూర్తిస్థాయి ప్రణాళిక అమల్లో ఇది చిన్న భాగం మాత్రమే. దీన్ని గోదావరి పెన్నా తొలిదశగా చేపట్టబోతున్నారు.

కేంద్ర ప్రణాళిక ఏమిటి...?
గోదావరి నీళ్లను కావేరి వరకు తీసుకువెళ్లేందుకు జాతీయ జల అభివృద్ధి సంస్థ ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. తెలంగాణలోని ఖమ్మంజిల్లా అకినేపల్లి నుంచి దాదాపు 240 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్‌కు మళ్లించాలి. సోమశిలకు పాలార్‌కు అక్కడి నుంచి గ్రాండ్‌ ఆనకట్టకు తరలించాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులకు కొంత ప్రయోజనం కల్పించడం దీని ఉద్దేశం. దిల్లీ సమావేశంలో ఈ ప్రతిపాదననను తెలంగాణ మంత్రి హరీశ్‌రావు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అదే సమయంలో రాష్ట్రాల ఏకాభిప్రాయంతోనే ఈ ప్రతిపాదనపై ముందుకెళ్తామని కేంద్రం ప్రకటించింది. తెలంగాణ వ్యతిరేకించిన పరిస్థితుల్లో ఆ ప్రతిపాదన ముందుకు సాగడం ప్రశ్నార్థకమే. ఈ సమయంలో పోలవరం నుంచి పెన్నా వరకు నీటి మళ్లింపుపై ఆంధ్రప్రదేశ్‌ కసరత్తు గురించి కేంద్రమంత్రి గడ్కరీకి తెలియజేయనున్నారు. రాష్ట్ర అవసరాలు తీరాక గోదావరి జలాలు ఇతర రాష్ట్రాలకూ ఇస్తామని ముఖ్యమంత్రి అంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమూ ఈ ప్రతిపాదనపై దృష్టి సారించే అవకాశం ఉందని రాష్ట్ర జలవనరులశాఖ ఆశాభావంగా ఉంది.

Link to comment
Share on other sites

telagana after completing current projects at most they can utilize 6 tmc per day. if they utilize for 150 days, they need 900 tmc . but they want 1500-1600 tmc. 

godavari flows are good from july to october(120 days), how can they utilize 1500 to 1600 tmc . they simply obstructing the project.

 

Edited by ravindras
Link to comment
Share on other sites

34 minutes ago, ravindras said:

telagana after completing current projects at most they can utilize 6 tmc per day. if they utilize for 150 days, they need 900 tmc . but they want 1500-1600 tmc. 

godavari flows are good from july to october(120 days), how can they utilize 1500 to 1600 tmc . they simply obstructing the project.

 

 andhra ki eekkada nillu antaremo ane bhayam.. so 1500 kaadhu next time 2000 antaru

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...