Jump to content

pattiseema


Recommended Posts

if the flow is for more days

we can draw more than 100 tmc

vastae manchidae... inka krishna lo asalu no water antae 100 tmc aitadi imean in prakasam barriage. Rainy sesasons lo oka 20 to 30 days barriage degara flow untadi.. aaa time lo elagu vadam..... esari from day 1 nundi 8k cuses vadultaru... full pleged ga canals lo chivari polam varuku ravali antae 11k cusescs varuku water kavali... full water flow capacity entha after dam opening ...
Link to comment
Share on other sites

Krishna guntur and west lo metta prantalaki krishna river meeda dependency ni oka rakamga poorthiga tolaginchina project pattiseema! Next two seasons chala important for tdp....

 

Kind of test match lantidi adutunnadu CBN.... day 4 and day 5 kosam wait chesinattu....

 

Next two seasons kanaka krishna and guntur ki june lo water ivvatam start cheyyagaligithey..... and when krishna has some water in september, if we can divert to seema.... tdp sankalpam success ayyinattle.....

Link to comment
Share on other sites

 

 


Next two seasons kanaka krishna and guntur ki june lo water ivvatam start cheyyagaligithey

 

May not be possible until dam is done. Godari delta ki kastam avtondi June lo water ivvadam 

 

Coffer dam complete cheste chance undochhu

Link to comment
Share on other sites

Polavaram ki Ippati varaku manaki deisgn ke 100% permissions raledu so Pattiseema katti CBN manchi pani chesadu

Also manaki Environment case+forestation+tribal cases kuda nadustunnai so POlavaram 10 years pattuddi.

yup, even if we have 32k crores cash in bank today, there is no way decent amount of water can be stored at polavaram before 2024-2026. I don't know why CBN and co keep repeating 2018, 2019 type deadlines. earlier CBN used to mention "Phase 1". No body defined what is phase 1. Now a days that word is gone totally from vocabulary.

Link to comment
Share on other sites

Godavari lo flow undi, manam pumping mid june lo start chesthey, gravity tho krishna and guntur farmers ki water andataniki 10-15 pattinaa.... that will set a new benchmark for krishna delta farmers.... every year july first week ki naatlu modalaithey(generally farmers will plan to transplant crop by the time they get first water).... this whole chapter will go with golden letters in history books!

Link to comment
Share on other sites

నదుల అనుసంధానానికి ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు పెద్ద సమస్య. అందుకే ఇతర రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో అంతర్గత నదుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా దృష్టి సారించింది. ఈ అంశంపై ఇప్పుడు కేంద్ర జలసంఘం ప్రత్యేకంగా కసరత్తు చేస్తోంది. ఇందుకు పట్టిసీమ ఎత్తిపోతలను నమూనాగా ఎంచుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో పట్టిసీమ ఎత్తిపోతల నిర్మించి గోదావరి నుంచి 80 టీఎంసీల వరద జలాలను కృష్ణమ్మకు మళ్లించే ప్రణాళిక సాకారమయింది. ఇది ఏ ఇతర రాష్ట్రంతోనూ సంబంధం లేనిది. పట్టిసీమ తరహాలోనే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అంతర్గత అనుసంధానంపై తొలుత దృష్టి సారిస్తే కొంత ఫలితం వస్తుందని కేంద్ర జలసంఘం, కేంద్ర జలవనరులశాఖ భావిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర జలసంఘానికి చెందిన ఒక అధికారి పట్టిసీమ సందర్శించి పరిశీలించి వెళ్లారు. వచ్చే నెలలో లేదా ఆ తర్వాత కేంద్ర జలసంఘానికి చెందిన ఒక బృందం ఈ కసరత్తులో భాగంగా పట్టిసీమ ఎత్తిపోతలను సందర్శించనుంది.

రోజుకు 8,500 క్యూసెక్కుల చొప్పున మొత్తం గోదావరి 120 రోజుల వరద కాలంలో 80 టీఎంసీల నీటిని మళ్లించే ఉద్దేశంతో పట్టిసీమ ఎత్తిపోతల నిర్మించారు. ఈ ఏడాది ఇప్పటికే 50 టీఎంసీలు ఎత్తిపోశారు. ఒక నదీ పరీవాహక ప్రాంతం నుంచి మరో నదీ పరీవాహకానికి ఇంత మొత్తంలో నీటిని మళ్లించడం దేశంలోనే ఇదే తొలిసారని జలవనరులశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

15219991_1484822398198013_75863915185053

Link to comment
Share on other sites

డెల్టాకు ‘జీవధార’ పట్టిసీమ!
 
636160823792501623.jpg
  •  11లక్షల ఎకరాలకు సాగునీరు 
  • నాలుగు జిల్లాల రైతుల హర్షాతిరేకాలు 
  •  చేతికొస్తున్న పంటలు 
  •  ఇప్పటివరకు 52 టీఎంసీల నీరు డెల్టాకు 
నాలుగునెలలుగా ఉవ్వెత్తున ఎగిసివస్తున్న గోదారి జలాలు నాలుగు జిల్లాల రైతులకు సాగునీరు అందిస్తోంది. దీంతో డెల్టా పునర్‌వైభవం సంతరించుకోంటోంది. పట్టిసీమ నీటితో పండించిన బంగారు పంటలు చేతికి రావటంతో.. రైతులంతా పంటలను కోసే పనిలో నిమగ్నమయ్యారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) :
కృష్ణాడెల్టా పరిధిలో మొత్తం 13లక్షల ఎనిమిదివేల ఎకరాలు సాగుభూమి ఉంది. కృష్ణా జిల్లాలో 6.79లక్షల ఎకరాలు, గుంటూరు జిల్లాలో 4,99,231 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 72,120 ఎకరాలు, పశ్చిమగోదావరి జిల్లాలో 58వేల ఎకరాల సాగుభూమి ఉంది. మొత్తం ఈ 13లక్షలకు పైగా ఎకరాల్లో.. దాదాపు 11లక్షలకు పైగా ఎకరాల్లో ఏటా వరి సాగుచేస్తుంటారు. మిగిలిన పొలాల్లో వాణిజ్య పంటలను సాగుచేస్తుంటారు. కొన్నేళ్లుగా వాతావరణ పరిస్థితులతో వరి సాగు విస్తీర్ణం తగ్గింది. రెండుశాతం మంది బోర్ల ద్వారా వ్యవసాయం సాగించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు డెల్టా రైతులను ఆదుకునేందుకు చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు మహాసంకల్పం.. డెల్టా రైతుల పాలిట వరప్రదాయినిగా మారింది. డెల్టా ప్రాంతంలో ఉన్న పదమూడున్నర లక్షల ఎకరాల సాగుకు ఖరీఫ్‌ సీజనలో 120టీఎంసీల నీరు అవసరమవుతుంది. నాగార్జునసాగర్‌ నుంచి నీరు వస్తేనే డెల్టాలో పంటలు వేసే అవకాశం ఉంటుంది. కొన్నేళ్లుగా సాగర్‌ నుంచి నీరు వస్తున్న పరిస్థితులు లేవు. అయినప్పటికీ కేవలం పట్టిసీమ వల్ల ఈ ఏడాది కృష్ణాడెల్టాలో పంటల సాగుబడి బాగుంది. ఇప్పటివరకు కృష్ణాడెల్టాలోని పంటపొలాలకు 106టీఎంసీల నీటిని ఇవ్వగా.. వాటిలో 44టీఎంసీల నీరు పట్టిసీమ ప్రాజెక్టు నుంచి వచ్చినదే. పులిచింతల నుంచి ఇచ్చిన 30టీఎంసీలు, క్యాచమెంట్‌ ఏరియా నుంచి వచ్చిన 34టీఎంసీలతోపాటు, పట్టిసీమ నీరును కూడా వ్యవసాయ, తాగునీటి అవసరాలకు ఇచ్చారు. డెల్టాలో ఉన్న మొత్తం ఒకలక్షా 57వేల చేపల చెరువులకు ఇప్పటివరకు నీటిని అందించారు. ఆగస్టు నెల నుంచి నిరంతరంగా పట్టిసీమ ప్రాజెక్టు నుంచి జీవజలాన్ని కృష్ణానదికి తరలిస్తున్నారు. ప్రాజెక్టు ప్రారంభించిన మొదట్లో ఆరు పంపుల ద్వారా 1500ల నుంచి 2వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే పంపింగ్‌ చేశారు. అనంతరం పంపింగ్‌ కేపాసిటీ పెంచారు. రోజుకు నాలుగు వేలనుంచి ఆరు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తర్వాత కనీసం 18పంపులకు తగ్గకుండా పోలవరం కుడి కాలువ ద్వారా నీటిని డెల్టాకు పంపింగ్‌ చేస్తున్నారు. వీటిద్వారా రోజూ ఆరువేల నుంచి ఎనిమిది వేల క్యూసెక్కుల నీరు కృష్ణానదికి వస్తోంది. నవంబర్‌, అక్టోబర్‌ నెలలో పట్టిసీమకు ఉన్న 24పంపుల ద్వారా అవసరాల మేరకు నీటిని పంపింగ్‌ చేశారు. ఇలా ఇప్పటివరకు మొత్తం 52టీఎంసీల నీటిని పట్టిసీమ ప్రాజెక్టు నుంచి డెల్టాకు తరలించారు. వీటిలో రెండు నుంచి మూడు టీఎంసీల 180కిలోమీటర్లకు పైగా ప్రవహిస్తున్న కాలువలో ఉండగా.. మిగిలి నీరు వివిధ రూపాల్లో ఆవిరైంది. ఇంకా డిసెంబర్‌ 10వరకు పట్టిసీమ నుంచి నీళ్లను ఇచ్చేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలో మరో ఆరేడు టీఎంసీల నీరు కృష్ణాకు వచ్చే అవకాశం ఉంది.
చేతికొచ్చిన పంటలు
డెల్టా పంటలకు ఒండ్రుమట్టితో కూడిన సారవంతమైన గోదావరి జలాలు ప్రాణం పోశాయి. పట్టిసీమ జలాలలో డెల్టాప్రాంతంలోని పొలాలు కోతదశకు చేరుకున్నాయి. ఇప్పటికే డెల్టాలోని పలు ప్రాంతాల్లో అడపాదడపా వరికోతలను మొదలుపెట్టారు. మరో వారం పదిరోజుల్లో డెల్టా ప్రాంతాల్లో వరికోతలు ముమ్మరంగా సాగనున్నాయి. వచ్చేసంవత్సరం మరింత ఎక్కువుగా పట్టిసీమ జలాలను తీసుకొస్తామని, ఈ సంవత్సరం మొత్తం 60టీఎంసీల పట్టిసీమ జలాలను తెస్తున్నామని ఇరిగేషన ఎస్‌ఈ సుగుణరావు తెలిపారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...