Jump to content

Kotappakonda


Recommended Posts

రోప్‌ వే.. అనుమతుల మెలిక!
12-10-2018 08:30:19
 
636749298206305349.jpg
  • కోటప్పకొండలో ముందడుగు పడని నిర్మాణం
  • అటవీ శాఖ నుంచి లభించని అనుమతి
  • టెండర్‌ ఖరారైనా ప్రారంభం కాని పనులు
  • పర్యాటక, అటవీ శాఖల మధ్య సమన్వయ లోపం
  • వచ్చే శివరాత్రి తిరునాళ్ళకు రోప్‌వే నిర్మాణం పూర్తయ్యేనా?
 
నరసరావుపేట: ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో తలపెట్టిన రోప్‌వే నిర్మాణం ముందడుగు పడటం లేదు. టెండర్‌ ఖరారైనా పనులు ప్రారంభించలేని పరిస్థితులు నెలకొన్నాయి. పర్యాటక శాఖ, అటవీ శాఖల మధ్య అనుమతుల విషయంలో సమన్వయం కొరవడింది. దీంతో అటవీ శాఖ నుంచి అనుమతుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. నిధులు ఉన్నా నిర్మాణం ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. వచ్చే మార్చిలో మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో జరిగే త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ళ నాటికి రోప్‌వే నిర్మాణం పూర్తయ్యేనా? అనే సందేహాలు నెలకొన్నాయి. అనుమతులు కోసం దరఖాస్తు చేయలేదని అటవీ శాఖ అధికారులు చెపుతున్నారు. రోప్‌వే నిర్మాణం కోసం కావాల్సిన స్థలాన్ని గుర్తించి సమగ్ర సర్వే నివేదికతో అటవీ శాఖకు అనుమతుల కోసం దరఖాస్తు చేశామని పర్యాటక శాఖ అధికారులు చెపుతున్నారు. ఇరు శాఖల మధ్య భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.
 
రూ.6.82 కోట్ల మంజూరు
కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి సన్నిది పుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా రాష్ట్రంలోని ప్రత్యేక గుర్తింపు ఉంది. భక్తులు, కొండకు తరలి వచ్చే యాత్రికుల కోసం రోప్‌వే సౌకర్యాన్ని కల్పించాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. దీని మంజూరు కోసం శాసన సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు విశేషంగా కృషి చేశారు. రోప్‌ వే నిర్మాణానికి పర్యాటక శాఖ రూ.6.82 కోట్లు మంజూరు చేసింది. టెండర్‌ ప్రక్రియ పూర్తి కాగా.. కోల్‌కత్తాకు సంబంధించిన నిర్మాణ రంగ సంస్థ రోప్‌వే పనులను దక్కించుకుంది. కాంట్రాక్టర్‌తో పర్యాటక శాఖ పనులకు సంబంధించి అగ్రిమెంట్‌ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. ఇదంతా జరిగి నెల రోజులు గడుస్తున్నా నేటికీ కోటప్పకొండలో రోప్‌వే నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఇందుకు కారణం అటవీ శాఖ అనుమతులు ఇవ్వక పోవటమే.
 
సర్వే సాఫ్ట్‌వేర్‌ లేదంటూ..
కొండ దిగువున ఉన్న పర్యాటక శాఖకు సంబంధించి ఉద్యాన వనం నుంచి కొండ ఎగువున ఉన్న అతిథి గృహం పక్కన వరకు రోప్‌వే నిర్మాణం చేస్తారు. 400 మీటర్ల పొడువు, 20 మీటర్ల వెడెల్పున నిర్మాణం కోసం స్థల సేకరణ జరగాల్సి ఉంది. కోటప్పకొండ అటవీ శాఖ పరిధిలో ఉండటంతో సదరు స్థలం కేటాయింపునకు పర్యాటక శాఖ అనుమతుల కోసం సర్వేతో కూడిన లేఖను అటవీ శాఖకు అందజేశారు. ఐతే సదరు సర్వే నివేదిక అటవీ శాఖ అంగీకరించటం లేదు. తమ శాఖ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ ప్రకారం సర్వే రిపోర్టు ఇవ్వాలని సూచిస్తున్నది. ఐతే ఆ సాఫ్ట్‌వేర్‌ పర్యాటక శాఖ వద్ద లేదు. ఇలా సర్వే చేయాలంటే అవసరమైన పరికరాలు లేవు. అటవీ శాఖ సర్వే చేయించినట్లయితే అందుకయ్యే వ్యయాన్ని భరిస్తామని సదరు అధికారులకు తెలియజేసినట్టు పర్యాటక శాఖ అధికారులు చెపుతున్నారు.
 
స్థలం ఎవరి పరిధిలో..
ఇదిలా ఉంటే రోప్‌వే నిర్మాణం కోసం పర్యాటక శాఖ ప్రతిపాదించిన స్థలం దేవస్థానం పరిధిలో ఉన్నట్టుగా సంబంధిత అధికారులు చెపుతున్నారు. అటవీ శాఖ, దేవాదాయ శాఖ ఈ ఇరు శాఖలకు సంబంధించి ఎవరి పరిధిలో రోప్‌వే నిర్మాణ స్థలం ఉందనేది తేలాల్సి ఉంది. అటవీ శాఖ మాత్రం తమ పరిధిలోనే ఉందని తేల్చి చెపుతున్నది. నిధులు సిద్ధంగా ఉన్నా పనులు ప్రారంభించలేని పరిస్థితిని పర్యాటక శాఖ ఎదుర్కొంటోంది. అటవీ శాఖ అనుమతుల విషయమై జిల్లా అటవీ శాఖ అధికారి కె.మోహన్‌ను గురువారం వివరణ అడగ్గా, ఆన్‌లైన్‌ విధానంలో అనుమతుల కోసం పర్యాటక శాఖ దరఖాస్తు చేయాల్సి ఉందని చెప్పారు. నేటి వరకు తమకు ఎటువంటి దరఖాస్తులు అందలేదని పేర్కొన్నారు.
 
అలాగే పర్యాటక శాఖ చెపుతున్న జీపీఎస్‌ సర్వే సమగ్రంగా లేదని ఆయన పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో పర్యాటక శాఖ స్థల అనుమతుల కోసం దరఖాస్తు చేస్తే వెను వెంటనే పరిశీలించటం జరుగుతుందని ఆయన చెప్పారు. కాగా.. పర్యాటక శాఖకు సంబంధించిన అధికారి సూరత్‌ బాలకృష్ణ వివరణ ఇస్తూ స్థలానికి సంబంధించిన పూర్తి స్థాయి సర్వే వివరాలను అటవీ శాఖకు అందజేసినట్లు పేర్కొన్నారు. ఇరు శాఖల ఉన్నతాధికారులు చొరవ తీసుకుంటే మినహా ఈ సమస్య పరిష్కారమయ్యే పరిస్థితులు లేవు. ఏదేమైనా రోప్‌వే నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని యాత్రికులు కోరుతున్నారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...