Jump to content

Kotappakonda


Recommended Posts

kotappakonda-ropeway-31052016.jpg

Very soon Kotappakonda is going to have a new feather in its cap. Andhra Pradesh Tourism Development Corporation (APTDC) has conducted a feasibility study and proposed to develop an aerial ropeway on Kotappakonda Hill. It has submitted a positive report to Andhra Pradesh government, that this project would be feasible. Once government approves, the tender’s would be called to start the works.

The present mode of transportation to the hill shrine is by road. If ropeway is laid, it will attract the visitors and tourism will also increase.

Also a new eco park is going to set up at Kotappakonda, which includes a huge aquarium, a toy train and bot riding. The mini zoo which is already there would also be expanded.

Link to comment
Share on other sites

Vijayawada kanaka durga temple ki oka rope way pettandi from APTDC park to hill.

 

Deni valla ropeway ekithe boating dagaraki velalli

Read somewhere that they are planning on same lines from Rajiv Gandhi Park to Durga Hill....

 

I doubt if it is feasible??

Link to comment
Share on other sites

  • 4 weeks later...
కోటప్పకొండలో రోప్ వే
 
నరసరావుపేట : కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయానికి రోప్‌వే నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రోప్‌వే నిర్మాణం కోసం ఢిల్లీకి చెందిన ఉషా బ్రేకో లిమిటెడ్‌ సంస్థ నాలుగు రోజులుగా కోటప్పకొండలో సర్వే చేస్తోంది. ఈ సంస్థ ప్రతినిధి సీ నాడియాల్‌ కొండ దిగువ ప్రాంతం, ఆలయ ప్రాంగణం, ప్రస్తుతం ఆలయం ఎగువ కొండ పై ఉన్న పాత కోటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఆదివారం పాత కోటేశ్వర స్వామి ఆలయ ప్రాంతంలో రోప్‌ వే నిర్మాణానికి ఆ ప్రాంతం అనువైనదో లేదో అనే అంశంపై వివరాలు సేకరించారు. ఆయన నాలుగు రోజులుగా కొండకు వస్తున్న యాత్రికుల నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు. రోప్‌ వే నిర్మాణం ఎలా ఉంటుంది?, టిక్కెట్‌ రేటు ఎంత ఉండాలి?, రోప్‌ వే నిర్మిస్తే ఈ మార్గం గుండా ఆలయానికి వస్తారా? అనే అంశాల పై యాత్రికుల నుంచి అభిప్రాయాలను సేకరించారు.
 
మూడు అంశాలపై సర్వే
ప్రతి రోజు ఎంత మంది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు, సోపాన మార్గం గుండా కొండ పైకి ఎంతమంది యాత్రికులు వస్తున్నారు, ఘాట్‌ రోడ్డులో స్వామి సన్నిధికి ఎంత మంది యాత్రికులు వస్తున్నారు ఈ మూడు అంశాల పై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఆలయ విశిష్టత గురించి యాత్రికులకు తెలియజేసే అంశంలో ప్రచార లోపం ఉన్నట్టుగా గుర్తించారు. విస్తృత ప్రచారం అవసరమని అభిప్రాయానికి వచ్చారు. దేవాలయం నిర్వహణ బాగుందని నాడియాల్‌ తెలిపారు. పరిశుభ్రత, పచ్చదనం నిర్వహణ బాగుందని చెప్పారు.
 
మొదట కింద నుంచి ఆలయ ప్రాంగణం వరకు..
మొదటి విడత కొండ కింద నుంచి ఆలయ ప్రాంగణం వరకు, తదుపరి ఆలయ ప్రాంగణం నుంచి పాత కోటేశ్వర స్వామి ఆల యం వరకు రోప్‌ వే నిర్మించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఆలయ ప్రాంగణం నుంచి పాత కోటేశ్వర స్వామి ఆలయం వరకు రోప్‌వేకి యాత్రికుల నుంచి మంచి స్పందన ఉంటుందని చెప్పారు. మొత్తం మీద రోప్‌వే ప్రాజెక్టుపై యాత్రికులు అనుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ రెండు విడతలలో నిర్మించే రోప్‌ వే నిర్మాణానికి సుమారు రూ.20 కోట్ల వరకు వ్యయం అవుతుందని తెలిపారు. హరిద్వార్‌లో, ఉత్తరాఖాండ్‌ మానసాదేవి, చండీదేవి ఆలయ ప్రాంతాలలో తమ సంస్థ రోప్‌వే నిర్మించి నిర్వహిస్తోందని తెలిపారు. కేరళలోని మలాంపుజ్‌ ప్రాంతంలో రోప్‌వే నిర్మిస్తున్నట్టు తెలిపారు. కోటప్పకొండ రోప్‌వే నిర్మాణానికి అన్ని విధాలా అనుకూలంగా ఉందని తెలిపారు. తమ ప్రాజెక్టు రిపోర్టును త్వరలో ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యుడు అనుమోలు వెంకయ్య చౌదరి, టీ సుధాకరరెడ్డి పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

 

కోటప్పకొండలో రోప్ వే

 

నరసరావుపేట : కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయానికి రోప్‌వే నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రోప్‌వే నిర్మాణం కోసం ఢిల్లీకి చెందిన ఉషా బ్రేకో లిమిటెడ్‌ సంస్థ నాలుగు రోజులుగా కోటప్పకొండలో సర్వే చేస్తోంది. ఈ సంస్థ ప్రతినిధి సీ నాడియాల్‌ కొండ దిగువ ప్రాంతం, ఆలయ ప్రాంగణం, ప్రస్తుతం ఆలయం ఎగువ కొండ పై ఉన్న పాత కోటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఆదివారం పాత కోటేశ్వర స్వామి ఆలయ ప్రాంతంలో రోప్‌ వే నిర్మాణానికి ఆ ప్రాంతం అనువైనదో లేదో అనే అంశంపై వివరాలు సేకరించారు. ఆయన నాలుగు రోజులుగా కొండకు వస్తున్న యాత్రికుల నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు. రోప్‌ వే నిర్మాణం ఎలా ఉంటుంది?, టిక్కెట్‌ రేటు ఎంత ఉండాలి?, రోప్‌ వే నిర్మిస్తే ఈ మార్గం గుండా ఆలయానికి వస్తారా? అనే అంశాల పై యాత్రికుల నుంచి అభిప్రాయాలను సేకరించారు.
 
మూడు అంశాలపై సర్వే

ప్రతి రోజు ఎంత మంది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు, సోపాన మార్గం గుండా కొండ పైకి ఎంతమంది యాత్రికులు వస్తున్నారు, ఘాట్‌ రోడ్డులో స్వామి సన్నిధికి ఎంత మంది యాత్రికులు వస్తున్నారు ఈ మూడు అంశాల పై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఆలయ విశిష్టత గురించి యాత్రికులకు తెలియజేసే అంశంలో ప్రచార లోపం ఉన్నట్టుగా గుర్తించారు. విస్తృత ప్రచారం అవసరమని అభిప్రాయానికి వచ్చారు. దేవాలయం నిర్వహణ బాగుందని నాడియాల్‌ తెలిపారు. పరిశుభ్రత, పచ్చదనం నిర్వహణ బాగుందని చెప్పారు.
 
మొదట కింద నుంచి ఆలయ ప్రాంగణం వరకు..

మొదటి విడత కొండ కింద నుంచి ఆలయ ప్రాంగణం వరకు, తదుపరి ఆలయ ప్రాంగణం నుంచి పాత కోటేశ్వర స్వామి ఆల యం వరకు రోప్‌ వే నిర్మించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఆలయ ప్రాంగణం నుంచి పాత కోటేశ్వర స్వామి ఆలయం వరకు రోప్‌వేకి యాత్రికుల నుంచి మంచి స్పందన ఉంటుందని చెప్పారు. మొత్తం మీద రోప్‌వే ప్రాజెక్టుపై యాత్రికులు అనుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ రెండు విడతలలో నిర్మించే రోప్‌ వే నిర్మాణానికి సుమారు రూ.20 కోట్ల వరకు వ్యయం అవుతుందని తెలిపారు. హరిద్వార్‌లో, ఉత్తరాఖాండ్‌ మానసాదేవి, చండీదేవి ఆలయ ప్రాంతాలలో తమ సంస్థ రోప్‌వే నిర్మించి నిర్వహిస్తోందని తెలిపారు. కేరళలోని మలాంపుజ్‌ ప్రాంతంలో రోప్‌వే నిర్మిస్తున్నట్టు తెలిపారు. కోటప్పకొండ రోప్‌వే నిర్మాణానికి అన్ని విధాలా అనుకూలంగా ఉందని తెలిపారు. తమ ప్రాజెక్టు రిపోర్టును త్వరలో ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యుడు అనుమోలు వెంకయ్య చౌదరి, టీ సుధాకరరెడ్డి పాల్గొన్నారు.

 

 

 

Good it  will boost APTDC 

 

Akada APTDC rooms kattali

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 1 month later...

Vijayawada kanaka durga temple ki oka rope way pettandi from APTDC park to hill.

 

Deni valla ropeway ekithe boating dagaraki velalli

Kotappakonda lanti places lo special attraction ga ropeway pettochhu. Vijayawada area ki Durgamma Temple ki anyway heavy floating vuntindhi. so vijayawada ki antha benefit vundadhu

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
పర్యాటక కేంద్రంగా కోటప్పకొండ
 
636124564031279716.jpg
నరసరావుపేట రూరల్‌: కోటప్పకొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు శాసన సభాపతి డాక్టర్‌ కోడెల శివ ప్రసాదరావు అన్నారు. కోటప్పకొండలో మంగళవారం ఆయన పర్యటించి అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో స్పీకర్‌ మాట్లాడుతూ వేసవిలో కూడా కోటప్పకొండ పచ్చదనాన్ని కాపాడేలా రెయినగన్స ఉపయోగిస్తున్నా మన్నారు. కొండపై అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొండ పైకి రోప్‌వే ఏర్పాటుచేస్తున్నామని, కింద భాగంగా సౌండ్‌ అండ్‌ లైటింగ్‌ ఏర్పాటవు తుందన్నారు.
కోటప్పకొండకు గిరి ప్రదక్షణ ప్రధాన ఆకర్షణగా వుంటుందన్నారు. కోటప్పకొండ అభివృద్ధికి నిధులు కొరత వుండదన్నారు. స్వాగతద్వారం వద్ద ఫుడ్‌ కోర్టు, యోగా, ధ్యాన కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శివరాత్రి నాటికి రూ.కోటితో పర్యాటక కేంద్రం అభివృద్ధి చేస్తున్నామని, త్రికోటేశ్వరుని ఆలయ ఆవరణ రూ.3.50 కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. పర్యాటక కేంద్రంలోని మయూరవనం, విహాంగం, కిల కిల, చిన్నారుల సీమ తదితర ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. కార్య క్రమంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ కడియాల రమేష్‌ బాబు, ప్రిన్సిపల్‌ సీసీఎఫ్‌ కె.రమేష్‌, వైల్డ్‌ లైఫ్‌ సీసీఎఫ్‌ రమణారెడ్డి, అడిషనల్‌ పీసీసీఎఫ్‌ బిపిన్‌ చౌదరి, సీకే మిశ్రా, కౌసిక్‌, డీఎఫ్‌వో భీమయ్య, మోహనరావు, టీసీఎఫ్‌ వై.రమేష్‌, ఆర్టీసీ డీవీఎం సీహెచ్‌ వెంకటేశ్వర్లు, పాలక మండలి సభ్యులు బెల్లంకొండ పిచ్చయ్య, అనుమోలు వెంకయ్య చౌదరి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

  • 1 month later...

.

కోటప్పకొండకు రోప్‌వే..!
గుంటూరు జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రంగా ఉన్న కోటప్పకొండకు రోప్‌వే ఏర్పాటు చేసేందుకు పర్యాటక అభివృద్ధి సంస్థ ముందుకు వచ్చింది. దీన్ని పీపీపీ విధానంలో ఏర్పాటకు టెండరు జారీ చేసింది. దీనిలో ఆసక్తి ఉన్న సంస్థలు రోప్‌వే ఆకృతులు, అధ్యయునం, నిర్మాణం చేయాల్సి ఉంటుంది. కోటప్ప కొండకు ప్రతిఏడాది జరిగే ఉత్సవానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. కార్తీకమాసం భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. దేవాలయానికి వెళ్లాలంటే సుమారు 3 కిలో మీటర్లు ఎత్తు ఉన్న కొండ ఎక్కాల్సి ఉంటుంది. గత కొంతకాలంగా ఇక్కడ రోప్‌వే ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు ఆసక్తి చూపి ఇక్కడ రోప్‌వే ఏర్పాటు చేయాలని పర్యాటక సంస్థను ఆదేశించారు. ఆమేరకు దీనికి పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కోటప్పకొండ పైన జింకలపార్కు, ఇతర పిల్లల పార్కు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న శివాలయానికి మంచి పేరు ఉంది. దీనికి దాదాపు రూ.కోటి పైనే వెచ్చించనున్నారు. రోప్‌వే ఏర్పాటు చేస్తే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

Link to comment
Share on other sites

  • 2 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...