sonykongara Posted May 20, 2016 Share Posted May 20, 2016 పొలాల్లోకే పంపు సెట్లు! ఈఈఎస్ఎల్కి మోటార్ల బిగింపు బాధ్యత అధికారులతో రంగనాథం భేటీ హైదరాబాద్, మే 19(ఆంధ్రజ్యోతి): అత్యున్నత సామర్థ్యతో పాటు.. పొదుపును ఇచ్చే 5 స్టార్ రేటింగ్ కలిగిన వ్యవసాయ పంప్ సెట్లను రైతుల పొలాల్లో బిగించే బాధ్యత ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్)దేనని డిస్కమ్లు స్పష్టం చేశాయి. రైతుల వద్ద ఉన్న వ్యవసాయ పంపుసెట్లను మార్పిడి చేసే పథకంపై విజయవాడలో సీఎం చంద్రబాబు సమక్షంలోఈఈఎస్ఎల్, డిస్కమ్లు అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలోని 15 లక్షల వ్యవసాయ పంపుసెట్లను మార్పిడి చేసేందుకు అవగాహన కుదరింది. ఈ పథకం అమలు కోసం చేసుకున్న అవగాహనా ఒప్పందంలో.. ఈఈఎస్ఎల్ ఏర్పాటు చేసే డిపోల నుంచి రైతులు మోటార్లను సేకరించాలని, అదేవిధంగా పాత మోటార్లను అందజేయాలని పేర్కొన్నారు. దీనిపై డిస్కమ్లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీనివల్ల పాత వ్యవసాయ మోటార్లను ఎక్కడ నుంచి తీసుకువచ్చారో.. ఎక్కడ బిగిస్తున్నారో తెలియని అయోమయం నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశాయి. పైగా.. బిగించిన ఈ పంప్సెట్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో గమనించే వ్యవస్థ ఉండదని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో గురువారం విద్యుత్తు సౌధలో ఈఈఎ్సఎల్ అధికారులతో ప్రభుత్వ ఇంధన సలహాదారు రంగనాథం, ఏపీ ఇంధన సంరక్షణ సమితి సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డిస్కమ్లు లేవనెత్తిన అభ్యంతరంపై సమీక్షించారు. రైతుల పొలాల్లో పంపుసెట్లను బిగించి.. పాత మోటార్లను సేకరించే బాధ్యత ఈఈఎస్ఎల్ తీసుకోవాలన్న ప్రతిపాదనకు ఆ సంస్థ దాదాపు అంగీకరించింది. అయితే, కేంద్రంతో చర్చిస్తామని చెప్పింది. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.