September 30, 20169 yr Author ఐటీ రంగంలో 7860 కోట్లు పెట్టుబడి ఐటీ రంగంలోనూ పలు సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. విప్రో రూ.375 కోట్లు, పై డేటా సెంటర్ రూ.650 కోట్లు, సమీర్ రూ.85 కోట్లు, ఫాక్స్కాన్ రూ.2500 కోట్లు, సెల్కాన్ రూ.2000 కోట్లు, సీకే టెలికాం రూ.250 కోట్లు, మొహం ఇన్ఫో సొల్యూషన్స్ రూ.2000 కోట్ల చొప్పున పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి
September 30, 20169 yr ఐటీ రంగంలో 7860 కోట్లు పెట్టుబడి ఐటీ రంగంలోనూ పలు సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. విప్రో రూ.375 కోట్లు, పై డేటా సెంటర్ రూ.650 కోట్లు, సమీర్ రూ.85 కోట్లు, ఫాక్స్కాన్ రూ.2500 కోట్లు, సెల్కాన్ రూ.2000 కోట్లు, సీకే టెలికాం రూ.250 కోట్లు, మొహం ఇన్ఫో సొల్యూషన్స్ రూ.2000 కోట్ల చొప్పున పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి wipro vadu already lands tesukoni 10 years ayina waste chesadu with no constructiona atleast and govt took lands again ani notice isthe data centre ani malli land aquition stopped.
October 9, 20169 yr Author ఐటీ రంగ పురోభివృద్ధికి విస్తృత అవకాశాలు పటమట (విజయవాడ), న్యూస్టుడే: విజయవాడలో ఐటీ రంగ పురోభివృద్ధికి ఎన్నో విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ అన్నారు. మహాత్మాగాంధీ రోడ్డులోని ఛాంబర్ హాలులో ఐటీ రంగ ఔత్సాహికులతో శనివారం సమావేశం నిర్వహించారు. మురళీకృష్ణ మాట్లాడుతూ రాజధానిగా విజయవాడ పరిసర ప్రాంతాలను ప్రభుత్వం వివిధ రకాలుగా అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో ఐటీ రంగం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఐటీ విభాగ ప్రధాన శాఖలు విజయవాడలో కార్యాలయాలు ఏర్పాటు చేశాయని చెప్పారు. ఇప్పటికే కీలక విభాగమైన ఎస్టీపీఐ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా కార్యాలయం ఏర్పాటైందని, ఇందులో పలు సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపారు. నిర్వహణ వ్యయం హైదరాబాద్, బెంగళూరు కంటే విజయవాడలో 20 నుంచి 30 శాతం తక్కువగా అవుతుందని పేర్కొన్నారు. ఛాంబర్ ప్రధాన కార్యదర్శి పొట్లూరి భాస్కరరావు మాట్లాడుతూ పది మంది ఉద్యోగులు ఉన్న చిన్న బీపీఓ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం పది లక్షలు ఇన్సెంటివ్స్ ప్రకటించిందని, ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ ప్రాంతానికి చెంది హైదరాబాద్లో ఉంటున్న పలువురు ఐటీ రంగ విద్యార్థులు, నిపుణులు, యువ పారిశ్రామికవేత్తలు సదస్సుకు హాజరయ్యారు. కార్యక్రమంలో చిన్నం రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
October 19, 20169 yr చంద్రబాబును కలిసిన మైక్రోసాఫ్ట్ వైస్ ప్రెసిడెంట్19-10-2016 21:20:32 విజయవాడ: సీఎం చంద్రబాబును మైక్రోసాఫ్ట్ వైస్ ప్రెసిడెంట్ టెల్లర్ హాస్ కలిశారు. అమరావతిలో మైక్రోసాఫ్ట్ సెంటర్ స్థాపన సాధ్యాసాధ్యాలపై ఇరువురు చర్చించారు.
October 21, 20169 yr Author మైక్రోసాఫ్ట్ వస్తోంది త్వరలో డెవల్పమెంట్ సెంటర్.. స్టార్టప్స్ సెంటర్గా ఆంధ్రప్రదేశ్ ఇచ్ఛాపురం నుంచి తడ వరకు సిలికాన్ వ్యాలీ తరహా వృద్ధి: సీఎం విశాఖలో 8 ఐటీ కంపెనీలకు శ్రీకారం.. త్వరలో మరో 32 5 వేల సర్కారీ బడుల్లో డిజిటల్ పాఠాలు.. తొలి దశలో 1212 టెక్నాలజీతో టీచర్ పోస్టులకు ముప్పు రాదు: ముఖ్యమంత్రి విశాఖపట్నం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ఇన్ఫర్మేషన టెక్నాలజీ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆంధ్రప్రదేశలో డెవల్పమెంట్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. విశాఖపట్నంలో ఎనిమిది అమెరికన్ ఐటీ కంపెనీల అనుబంధ సంస్థలను గురువారం మధ్యాహ్నం సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు ఇటీవల రాష్ట్రంలోని కేఎల్, నాగార్జున యూనివర్సిటీలను సందర్శించారని, ఆయా వర్సిటీల్లో ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారని హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. ఆ విద్యార్థుల కోసం ఏపీలో డెవల్పమెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని సీఎం వెల్లడించారు. ఇది మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయనున్న 11వ డెవల్పమెంట్ సెంటర్ అని తెలిపారు. ఐటీలో ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ప్రతిభ చూపుతున్నారని, ముఖ్యంగా ఆంధ్రులు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారన్నారు. ఐటీలో ఆంధ్రప్రదేశ ట్రెండ్ సెట్టర్ అని సీఎం వ్యాఖ్యానించారు. అమెరికాలో ఐటీ సర్వర్ పేరుతో 500 కంపెనీలు ఒక సమూహంగా ఏర్పడి మల్టీనేషనల్ కంపెనీలకు సొల్యూషన్స అందిస్తూ రెండు బిలియన డాలర్ల వ్యాపారం చేస్తున్నాయన్నారు. వీరంతా విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో ఎంఓయూలు చేసుకున్నారని, అందులో తొలి విడతగా 8 కంపెనీలు ఈ రోజున తమ కేంద్రాలను విశాఖలో ఏర్పాటు చేశాయన్నారు. వీటి ద్వారా 500 మందికి ఉపాధి లభించిందన్నారు. మిగిలిన 32 కంపెనీలు త్వరలోనే విశాఖలో తమ కార్యాలయాలు ఏర్పాటు చేస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ-ప్రగతిలో దూసుకువెళుతోందని, వాటికి సంబంధించిన పనులు ఈ కంపెనీలకు అప్పగిస్తామని సీఎం హామీ ఇచ్చా రు. విశాఖ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని, ప్రతి విద్యాసంస్థలో ఇన్నోవేటివ్ సొసైటీలు, ప్రతి కార్యాలయంలో ఇన్నోవేషన చాప్టర్లు, యూనివర్సిటీల్లో ఇంక్యుబేషన సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాటి ద్వారా ఫలితాలు వచ్చే వరకు పరిశోధనలు నిర్వహించాలని సూచించారు. ఏపీని స్టార్టప్స్ సెంటర్గా మార్చాలనేదే తన ధ్యేయమన్నారు. ఐటీకి సిలికాన వ్యాలీ పేరొందిందని ఏపీలో ఇచ్ఛాపురం నుంచి తడ వరకు సిలికాన వ్యాలీ తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఐటీ సంస్థలకు రాయితీలు కల్పిస్తామన్నారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన కంపెనీలకు ఒక్కో ఉద్యోగానికి రూ.50 వేలు రాయితీ ఇస్తున్నామన్నారు. అదే ఎంఎ్సఎంఈ అయితే రూ.1.5 లక్షలు ఇస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ చక్కటి ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలతో ఐటీ స్పేస్ అందించిందని వుడా వీసీ బాబూరావునాయుడును అభినందించారు. రిలయన్స్ జియో సహకారంతో రాష్ట్రంలోని అన్ని వర్సిటీలు, విద్యాలయాలకు ఉచితంగా వైఫై అందిస్తామన్నారు. అమెరికా కంటే విశాఖలోనే నైట్ లైఫ్ బాగుందని సీఎం ప్రశంసించారు.యువత ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి యువత ఉద్యోగాల కోసం అన్వేషించకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగడానికి ప్రయత్నించాలని సీఎం పిలుపునిచ్చారు. ఆస్తుల కంటే విజ్ఞానమే గొప్పదని, దాన్ని సాధించేందుకు యువత శ్రమించాలన్నారు. విద్యార్థులందరికీ ట్యాబ్లు ఇస్తే, వారు తరగతి గదుల్లోనే కాకుండా చెట్లు కింద కూడా కూర్చొని నచ్చినప్పుడు చదువుకోవచ్చన్నారు. ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలే... కొన్నాళ్లకు ఏపీని ఉన్నత స్థాయిలో నిలుపుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
October 21, 20169 yr మైక్రోసాఫ్ట్ వస్తోంది Superb. Babu gariki Bill Gates bamardi lekka anukunta ga. BABU Garu adagatame aalasyam emo త్వరలో డెవల్పమెంట్ సెంటర్.. స్టార్టప్స్ సెంటర్గా ఆంధ్రప్రదేశ్ ఇచ్ఛాపురం నుంచి తడ వరకు సిలికాన్ వ్యాలీ తరహా వృద్ధి: సీఎం విశాఖలో 8 ఐటీ కంపెనీలకు శ్రీకారం.. త్వరలో మరో 32 5 వేల సర్కారీ బడుల్లో డిజిటల్ పాఠాలు.. తొలి దశలో 1212 టెక్నాలజీతో టీచర్ పోస్టులకు ముప్పు రాదు: ముఖ్యమంత్రి విశాఖపట్నం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ఇన్ఫర్మేషన టెక్నాలజీ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆంధ్రప్రదేశలో డెవల్పమెంట్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. విశాఖపట్నంలో ఎనిమిది అమెరికన్ ఐటీ కంపెనీల అనుబంధ సంస్థలను గురువారం మధ్యాహ్నం సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు ఇటీవల రాష్ట్రంలోని కేఎల్, నాగార్జున యూనివర్సిటీలను సందర్శించారని, ఆయా వర్సిటీల్లో ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారని హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. ఆ విద్యార్థుల కోసం ఏపీలో డెవల్పమెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని సీఎం వెల్లడించారు. ఇది మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయనున్న 11వ డెవల్పమెంట్ సెంటర్ అని తెలిపారు. ఐటీలో ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ప్రతిభ చూపుతున్నారని, ముఖ్యంగా ఆంధ్రులు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారన్నారు. ఐటీలో ఆంధ్రప్రదేశ ట్రెండ్ సెట్టర్ అని సీఎం వ్యాఖ్యానించారు. అమెరికాలో ఐటీ సర్వర్ పేరుతో 500 కంపెనీలు ఒక సమూహంగా ఏర్పడి మల్టీనేషనల్ కంపెనీలకు సొల్యూషన్స అందిస్తూ రెండు బిలియన డాలర్ల వ్యాపారం చేస్తున్నాయన్నారు. వీరంతా విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో ఎంఓయూలు చేసుకున్నారని, అందులో తొలి విడతగా 8 కంపెనీలు ఈ రోజున తమ కేంద్రాలను విశాఖలో ఏర్పాటు చేశాయన్నారు. వీటి ద్వారా 500 మందికి ఉపాధి లభించిందన్నారు. మిగిలిన 32 కంపెనీలు త్వరలోనే విశాఖలో తమ కార్యాలయాలు ఏర్పాటు చేస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ-ప్రగతిలో దూసుకువెళుతోందని, వాటికి సంబంధించిన పనులు ఈ కంపెనీలకు అప్పగిస్తామని సీఎం హామీ ఇచ్చా రు. విశాఖ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని, ప్రతి విద్యాసంస్థలో ఇన్నోవేటివ్ సొసైటీలు, ప్రతి కార్యాలయంలో ఇన్నోవేషన చాప్టర్లు, యూనివర్సిటీల్లో ఇంక్యుబేషన సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాటి ద్వారా ఫలితాలు వచ్చే వరకు పరిశోధనలు నిర్వహించాలని సూచించారు. ఏపీని స్టార్టప్స్ సెంటర్గా మార్చాలనేదే తన ధ్యేయమన్నారు. ఐటీకి సిలికాన వ్యాలీ పేరొందిందని ఏపీలో ఇచ్ఛాపురం నుంచి తడ వరకు సిలికాన వ్యాలీ తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఐటీ సంస్థలకు రాయితీలు కల్పిస్తామన్నారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన కంపెనీలకు ఒక్కో ఉద్యోగానికి రూ.50 వేలు రాయితీ ఇస్తున్నామన్నారు. అదే ఎంఎ్సఎంఈ అయితే రూ.1.5 లక్షలు ఇస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ చక్కటి ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలతో ఐటీ స్పేస్ అందించిందని వుడా వీసీ బాబూరావునాయుడును అభినందించారు. రిలయన్స్ జియో సహకారంతో రాష్ట్రంలోని అన్ని వర్సిటీలు, విద్యాలయాలకు ఉచితంగా వైఫై అందిస్తామన్నారు. అమెరికా కంటే విశాఖలోనే నైట్ లైఫ్ బాగుందని సీఎం ప్రశంసించారు. యువత ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి యువత ఉద్యోగాల కోసం అన్వేషించకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగడానికి ప్రయత్నించాలని సీఎం పిలుపునిచ్చారు. ఆస్తుల కంటే విజ్ఞానమే గొప్పదని, దాన్ని సాధించేందుకు యువత శ్రమించాలన్నారు. విద్యార్థులందరికీ ట్యాబ్లు ఇస్తే, వారు తరగతి గదుల్లోనే కాకుండా చెట్లు కింద కూడా కూర్చొని నచ్చినప్పుడు చదువుకోవచ్చన్నారు. ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలే... కొన్నాళ్లకు ఏపీని ఉన్నత స్థాయిలో నిలుపుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.</p>
October 22, 20169 yr Author సింగపూర్తో ఏపీ అవగాహన ఒప్పందం అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్ మోనిటరీ అథారిటీతో ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మోనిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఫిన్టెక్ సెక్టార్లో కలిసి పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మోనిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ అంగీకారం కుదుర్చుకున్నాయి. విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటుకు మోనిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ సమ్మతి తెలిపింది. సింగపూర్ ఫిన్టెక్ స్టార్టప్స్కు విశాఖలో ఎక్స్లెన్స్ సెంటర్ చేయూత ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ సంస్థకు మౌలిక సదుపాయాలు కల్పించటానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. డిజిటల్, మొబైల్ పేమెంట్స్, బ్లాక్ చెయిన్, డిస్టిబ్యూటెడ్ల్జెర్స్, బిగ్డేటా, ప్లెక్సిబుల్ ప్లాట్ఫారమ్స్ అంశాల్లో జాయింట్ ఇన్నోవేషన్ ప్రాజెక్టులు ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో మోనిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ చేయూత ఇస్తుంది. సాంకేతికతకు పెద్దపీట అత్యాధునిక సాంకేతికతకు తెదేపా ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. మోనిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్తో ఒప్పందం కదుర్చుకున్నామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచానికి దశ, దిశ నిర్దేశించే శక్తి సింగపూర్ ఫిన్టెక్ స్టార్టప్స్కు ఉందన్నారు. విశాఖలో అన్ని రకాల వనరులు, మౌలిక సదుపాయాలు ఉన్నాయని, సైబర్ టెక్నాలజీలో అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు అంగీకారం కుదిరందని వెల్లడించారు. రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 6లక్షల మంది విద్యార్థులు ఉన్నారని మంత్రి వివరించారు.
October 23, 20169 yr HCL and Wipro are coming to Medha towers, opposite to Gannavaram airport, in January/February 2017. Internal news. Don't ask for links.
November 15, 20169 yr Indian State Andhra Pradesh to Launch Blockchain Institute, Aims to Lead Asian Market The Andhra Pradesh (AP) Government, a branch of the federal government of India which rules the state of Andhra Pradesh, is collaborating with leading technology and Blockchain startups in Singapore and the University of California to establish a Blockchain technology institute. JA Chowdary, IT advisor at the AP government, stated in an interview that local government officials have completed several preliminary discussions with the University of California (UC). IT advisors and researchers at the AP government will design the Blockchain Institute of Technology based on the agreements between UC and the government. Chowdary noted that upon its completion, the Blockchain Institute of Technology will assist government agencies, major financial firms and corporations in approaching the Blockchain technology and strategizing various implementations. Specifically, the AP government believes that the Blockchain technology will be widely integrated into existing government systems, in areas such as e-office, e-cabinet and procurement portals. Researchers at the AP government explain that the Blockchain technology and its decentralized nature will secure sensitive government information from hackers and security breaches. Initiative to lead the Asian Blockchain market Chowdary also stated that the establishment of a Blockchain research institution will allow the state of Andhra Pradesh to lead the Indian Blockchain market as well as the Asian FinTech industry. Considering the surging demand for Blockchain talents, developers, and platforms, Chowdary adds that the Visakhapatnam-based Blockchain Institute of Technology will garner talents and train individuals to comprehend the Blockchain technology and explore its potential in non-financial markets.
Create an account or sign in to comment