Jump to content

AP IT sector


Recommended Posts

i have seen in news  that ap government has given lands to lepakshi knowledge hub in 2009 . lepakshi knowledge hub is at anantpur karnataka border . it is around 80 km from bangalore airport. is it possible for ap government for to take back those lands and setup itir?     ITIR bangalore is not started as the farmers in that area opposed land acquisition . if we can get itir it will transform total anantpur district . 

 

Edited by ravindras
Link to comment
Share on other sites

5 minutes ago, ravindras said:

i have seen in news  that ap government has given lands to lepakshi knowledge hub in 2009 . lepakshi knowledge hub is at anantpur karnataka border . it is around 80 km from bangalore airport. is it possible for ap government for to take back those lands and setup itir?     ITIR bangalore is not started as the farmers in that area opposed land acquisition . if we can get itir it will transform total anantpur district . 

 

decoit batch a lands petti bank loan 1000 crores teesukunnaru.....now they are not paying banks also.....so state has long fight.....

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 4 weeks later...
  • 2 weeks later...
  • 4 months later...
విశాఖలో క్లౌడ్‌ సిటీ 

 

1350 ఎకరాల కేటాయింపు 
అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన 
మిలీనియం టవర్‌ ప్రారంభోత్సవం,   పలు అభివృద్ధి పనులకూ శ్రీకారం 
ఈనాడు - విశాఖపట్నం

14ap-main3a_3.jpg

విశాఖ నగరంలోని కాపులుప్పాడలో 1350 ఎకరాల్ని డేటా రంగానికి చెందిన కంపెనీలకు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. దీనికి క్లౌడ్‌సిటీగా పేరుపెడుతున్నట్లు ప్రకటించారు. గురువారం కాపులుప్పాడలో ఏర్పాటుచేస్తున్న అదాని డేటా సెంటర్‌, టెక్నాలజీ పార్క్‌లకు  మంత్రులు నారా లోకేష్‌, గంటాశ్రీనివాసరావు, కిడారి శ్రావణ్‌కుమార్‌లతో కలిసి  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అదానీ సంస్థ ఇక్కడ రూ.70 వేల కోట్లు పెట్టుబడి పెడుతోందని, ఒప్పందం కుదుర్చుకున్న 35 రోజుల్లో పునాదిరాయి వేశామని తెలిపారు. అదాని గ్రూప్‌ను రప్పించే విషయంలో, తనపై ఒత్తిళ్లు వచ్చినా వాటికి తలొగ్గలేదని స్పష్టం చేశారు. భవిష్యత్తు డాటా ఆధారంగా నిర్ణయమవుతుందని, ఈ డేటా సెంటర్‌కు పునాదిరాయి పడటంతో మరెన్నో పరిశ్రమలు ఇక్కడికి తరలివచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తాను ఉత్తమ మార్కెటింగ్‌ మేనేజర్‌నని, ఏ అవసరం వచ్చినా తనని సంప్రదించాలని అదానీ సంస్థ ఎండీ రాజేష్‌ అదానీకి  చెప్పారు. గతంలో పాలన తీరుతెన్నులు గుర్తుచేసుకుంటూ.. ‘1984లో రికార్డులన్నీ కంప్యూటరీకరించేవాళ్లం. అప్పట్లో పెద్ద సర్వర్లు ఉండేవి. పార్టీ కార్యాలయానికి ఏసీ లేకున్నా సర్వర్ల కోసం ఏసీ పెట్టించేవాళ్లం. ఇప్పుడు సర్వర్లకు బదులు డేటా సెంటర్లు వస్తున్నాయి’ అంటూ చెప్పుకొచ్చారు. భోగాపురంలో విమానాశ్రయానికి శంకుస్థాపన చేసి తిరిగొస్తూ,  కాపులుప్పాడ పరిసరాలన్నీ చూశానని,  ఇక్కడున్న వనరులు చూస్తే సిలికాన్‌వ్యాలీ కన్నా బాగా మార్చవచ్చని అనిపిస్తోందని చెప్పారు. నార్తర్న్‌ వర్జీనియా దశాబ్దకాలంలో ఎంతో అభివృద్ధి సాధించని, అలాగే ఇక్కడ పచ్చదనాన్ని  పెంచడంతో పాటు పూర్తిగా విద్యుత్తు వాహనాలు నడిచేలా చేస్తామని తెలిపారు.

మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కాపులుప్పాడ సమీపంలోని కొండల్ని ఏ విధంగా వినియోగించుకోవచ్చో  ఓ ప్రపంచస్థాయి కన్సల్టెంటును పెట్టుకుని  మాస్టర్‌ప్లాన్‌ తయారు చేయమని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. ఈ ప్రాంతాన్ని సంస్థలతో పాటు గృహాలు, వాణిజ్యపరంగా కూడా వృద్ధి చేసేందుకు ప్రణాళికలు చేస్తామని తెలిపారు.

14ap-main3b_1.jpg

మిలీనియం టవర్స్‌ ప్రారంభోత్సవం 
ఐటీహిల్‌-3లోని మిలీనియం టవర్స్‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.  అలాగే అలీప్‌ ఇండియా ఆధ్వర్యంలో 55 ఎకరాల్లో ఏర్పాటుచేస్తున్న హరిత పారిశ్రామికవాడ, స్మార్ట్‌సిటీలో భాగంగా రూ.75.84కోట్లతో మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌పై 15మెగావాట్‌ తెలియాడే సోలారు ప్లాంటు, రూ.530కోట్లతో 33ఎంఎల్‌డీ వ్యర్థజలాల సేకరణ, శుద్ధి ప్లాంటు, ఆనందపురం మండలం గంగసాని గ్రామంలో ఏర్పాటుచేయబోయే అబ్దుల్‌కలామ్‌ ముస్లిం కల్చరల్‌ సెంటర్‌,  పాండ్రంగి బ్రిడ్జి, తాటితూరు కాజ్‌వేలకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కూడా  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

వచ్చే ఐదేళ్లలో 500శాతం డేటా అవసరం

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌ బావుందని,  అందుకే తాము ఇక్కడ డేటా కేంద్రాన్ని నెలకొల్పుతున్నామని అదానీ గ్రూపు ఎండీ రాజేష్‌ అదానీ తెలిపారు. ఇక్కడి విధానాలను ఇతర రాష్ట్రాలూ అనుసరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.. రానున్న ఐదేళ్లలో 500 శాతం డేటా అవసరమవుతుందని,  దీర్ఘకాలిక ప్రణాళికలతో తాము ఇక్కడికి వచ్చామని చెప్పారు.

ఇక ‘తెలుసుకునే’ టెక్నాలజీ

భవిష్యత్తులో ట్రాకింగ్‌ టెక్నాలజీ రాబోతోందని ముఖ్యమంత్రి  చెప్పారు. మనం ఏం తింటున్నాం, ఎలా జీవిస్తున్నాం.. వాటిలో ఎలాంటి పోషకాలున్నాయి.. ఇలా ప్రతీదీ లెక్కచూడగల  సాంకేతికత అవసరముందని చెప్పారు. భవిష్యత్తులో దీనిపై కూడా దృష్టిపెడతామని అన్నారు. రాష్ట్రప్రభుత్వంమీద ప్రజల్లో 80శాతం సంతృప్తి ఉందని, దీన్ని 90 శాతానికి చేరేలా కృషిచేస్తున్నామని, ఓటు బ్యాంకు కూడా 80శాతం ఉండేలా చూసుకోవడం తనకున్న కల అని తెలిపారు.

డేటా కేంద్రంతో 1 శాతం వృద్ధిరేటు 
అదానీ గ్రూప్‌ తమ డేటా కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేయడమే కాదు.. దాని విద్యుత్తు అవసరాల కోసం ఇక్కడే సోలార్‌ప్లాంట్‌ ఏర్పాటు నెలకొల్పుతుందని మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు.  ఈ గ్రూపు ఇక్కడ 28 వేల ఉద్యోగాలివ్వబోతోంది. డేటా కేంద్రాలపరంగా ఇదో సరికొత్త విప్లవమని పేర్కొన్నారు. రూ. 70 వేల కోట్ల భారీ పెట్టుబడి రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుంది. దీనివల్ల రాష్ట్ర వృద్ధిరేటు ఒక శాతం పెరుగుతుందని చెప్పారు. అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. డాటా సెంటర్‌ కోసం ఏపీనే ఎందుకు ఎంచుకున్నారని తాను ప్రశ్నించినప్పుడు, ఒక్క చంద్రబాబే అందుకు కారణమని ఆయన సమాధానమిచ్చారని చెప్పారు. అదానీ సంస్థ పనుల్ని 21 రోజుల్లో ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశించారని, కొంత ఆలస్యంగా 36 రోజుల్లో మొదలుపెట్టామని అన్నారు. ఐటీ మంత్రిగా ఇకపై జరిగే ఒప్పందాల్లో 21 రోజుల్లో పనులు మొదలయ్యేలా  చర్యలు తీసుకుంటానని చెప్పారు.

 

Link to comment
Share on other sites

Naidu inaugurates Millennium Tower I in Vizag

author-deafault.png Special Correspondent
VISAKHAPATNAM, February 15, 2019 00:33 IST
Updated: February 15, 2019 00:33 IST
A landmark: A view of the Millennium Tower that was inaugurated by Chief Minister N. Chandrababu Naidu in Visakhapatnam on Thursday.

A landmark: A view of the Millennium Tower that was inaugurated by Chief Minister N. Chandrababu Naidu in Visakhapatnam on Thursday.   | Photo Credit: K_R_DEEPAK

 

Spread over four acres, the ₹145-crore facility has a built-up space of two lakh sft

Chief Minister N. Chandrababu Naidu on Thursday inaugurated the 10-floor Tower-1 of the Millennium Tower at Rushikonda in the city.

This is one of the major projects contemplated by the TDP to promote Visakhapatnam as a destination for investment in IT and ITES.

The Tower-1 was built in an area of four acres with an investment of ₹145 crore. It has a built-up space of two lakh sft and 1.5 lakh sft for parking. Four floors with an area of one lakh square ft of built-up space has been allotted to Conduent, a global leader in digital interactions with operations in 35 countries. For six months, the allotment will be free. It will be given the remaining four floors shortly.

Conduent operations

The tower will be given on payment of ₹30 per sft to Conduent after six months.

Conduent has been operating in two rented buildings at the Madhurawada IT Special Economic Zone for nearly one year. Construction of another tower with one lakh sft is under progress at a cost of ₹55 crore. It is likely to be ready by September.

Conduent wants to provide 5,000 jobs in two years to serve its global clients through its Indian arm in the spheres of technology, transportation, healthcare, public safety, HR, process automation and operational excellence. It focuses on diversified business process services with thrust on transaction processing, automation and analytics.

Link to comment
Share on other sites

35 minutes ago, surendra.g said:

Amaravati lo kooda vastunnaya IT companies?

 

Hcl n these iconic structures secretariat assembly tht bridge.. Etc అయ్యే కొద్ది momentum vuntadi, moreover crda is building IT park anukunta ga in core capital thn it will be big boost... 

Link to comment
Share on other sites

డేటా @ఏపీ
15-02-2019 01:43:51
 
636857918324745025.jpg
  • 70 వేల కోట్లతో అదానీ డేటా సెంటర్‌, టెక్నాలజీ పార్కు
  • 150 ఎకరాల విస్తీర్ణంలో 5 గిగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కూడా
  • ప్రపంచంలోనే మొదటి ఎకో ఫ్రెండ్లీ సెంటర్‌
  • అట్టహాసంగా రుషికొండలో భూమిపూజ
  • డేటా కోసం ఎవరైనా విశాఖ రావాల్సిందే
  • సైబరాబాద్‌ తరహాలో ‘క్లౌడ్‌ సిటీ’
  • ఏపీ మరో ఇన్నోవేషన్‌ వ్యాలీ: చంద్రబాబు
విశాఖపట్నం, ఫిబ్రవరి 14(ఆంద్రజ్యోతి): సమాచార సాంకేతిక రంగం మరింత విస్తరించనున్న నేపథ్యంలో భవిష్యత్‌లో సంపదకు ‘డేటా’ (సమస్త సమాచారం) కొలమానంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖలోని రుషికొండలో రూ.70వేల కోట్ల పెట్టుబడితో అదానీ గ్రూపు ఏర్పాటు చేయనున్న ‘అదానీ డేటా సెంటర్‌ అండ్‌ టెక్నాలజీ పార్కు’కు గురువారం సీఎం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అత్యంత సుందరమైన ప్రాంతంలో, 150 ఎకరాల విస్తీర్ణంలో 5 గిగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ సెంటర్‌ ప్రపంచంలోని మొదటి ఎకో ఫ్రెండ్లీ డేటా సెంటర్‌ కావడం మరింత సంతోషంగా ఉందన్నారు.
 
‘డేటాతో అద్భుతాలు సృష్టించవచ్చు. విద్యార్థిదశ ఎవరికైనా కీలకం. ఆ సమయంలో వచ్చే ఆలోచనలను ఆచరణలో పెట్టగలిగితే అద్భుతాలను ఆవిష్కరించడం ఖాయం. నేటి యువతకు క్లౌడ్‌ కంప్యూటింగ్‌, బిగ్‌ డేటా అనాలసిస్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఐఓటీ వంటి వాటిపై లోతైన అవగాహన ఉండడం లేదు. ఈ డేటా సెంటర్‌ అందుబాటులోకి వస్తే అలాంటి వారికి కచ్చితమైన సమాచారం అందుతుంది. దీనివల్ల సరికొత్త ఆవిష్కరణలకు అవకాశం కలుగుతుంది. డేటా సెంటర్‌కు అదానీ గ్రూపు పెట్టే పెట్టుబడిలో రూ.30-40 కోట్లు సోలార్‌ విద్యుత్‌కే అవుతుంది. ఆ విద్యుత్‌ను వినియోగించుకుని నిరంతరం సెంటర్‌ నుంచి డేటా సేకరణ, పంపిణీ జరుగుతుంది’ అని సీఎం అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
 
 
రైతుకు ఆదాయం వచ్చేలా..!
‘డేటా పార్కును స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని 17 లక్షల విద్యుత్‌ పంపు సెట్లన్నింటినీ సోలార్‌ ఎనర్జీ పంపుసెట్లుగా మార్చాలని యోచిస్తున్నాం. మోటార్లను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసేందుకు వీలుగా 1.7 బిలియన్ల ఎనర్జీ మోటార్లను వచ్చే 3-4 ఏళ్లల్లో ఉత్పత్తి చేసేలా ఆసక్తిగల కంపెనీల కోసం అన్వేషిస్తున్నాము. ఎనర్జీ మోటార్ల నుంచి వచ్చే విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసి యూనిట్‌కు రూ.1.50 చొప్పున ప్రభుత్వమే తీసుకుని రైతులకు ఉచితంగా సరఫరా చేస్తాం. దీనివల్ల ప్రతి రైతుకీ నెలకు రూ.15-18వేలు ఆదాయం అదనంగా వస్తుంది. అదానీ గ్రూపు ఏర్పాటుచేస్తున్న డేటా పార్కు వల్ల దేశానికే ఏపీ డేటా హబ్‌గా మారుతుంది. ఇతర దేశాలు సైతం డేటా కోసం విశాఖ రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రోజును మనమంతా చూస్తాం. ఒక కంపెనీ రూ.70వేల కోట్లు ఒకేచోట పెట్టుబడి పెట్టడం ప్రపంచంలో ఇదే ప్రప్రథమం.
 
దీనికి ఆంధ్రప్రదేశ్‌ను ఎన్నుకున్నందుకు అదానీ గ్రూపు ఎండీ రాజేశ్‌ అదానీని అభినందిస్తున్నాను. అదానీ కంపెనీకి సుందరమైన ప్రాంతం కేటాయించడంపై విమర్శలు వచ్చినా నేను రాజీ పడలేదు. ఎంఓయూ జరిగిన 36 రోజుల్లో భూమి పూజ జరిగేలా కృషిచేసిన ఐటీ మంత్రి లోకేశ్‌, అదానీ గ్రూపు సభ్యులకు అభినందనలు. అద్భుతమైన భవనాలు నిర్మించి మార్కెటింగ్‌లో కూడా రాజేశ్‌ అదానీ దూసుకుపోవాలి. అందుకోసం నా అవసరముంటే ఏ పనైనా చేస్తాను. మార్కెటింగ్‌లో నేను అత్యుత్తమ ఎగ్జిక్యూటివ్‌ని. ఏపీ ఇన్నోవేషన్‌ వ్యాలీ అవుతుంది.’
 
 
పథకాలపై 90% సంతృప్తి లక్ష్యం
‘రాష్ట్రంలో పెద్దఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. వాటిపై ప్రజల్లో సంతృప్తి స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు డేటా సెంటర్‌ను వాడుకునే ఆలోచన ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలపై 80ు సంతృప్తి ఉంది. దానిని 90 శాతానికి తీసుకువెళ్లాలన్నది నా లక్ష్యం. అలాగే పార్టీపై 80ు సంతృప్తి, 85ు ఓటుబ్యాంక్‌ ఉండాలన్నది నా లక్ష్యం. అది కచ్చితంగా సాధిస్తాను. ఐటీ గురించి పెద్దగా తెలియని 1995లోనే నేను పార్టీ కార్యాలయంలోని నా గదిలో ఉండే రికార్డులన్నీ కంప్యూటరైజ్‌ చేశాను. భవిష్యత్‌ నాలెడ్జిదేనని గుర్తించడంవల్లే అప్పట్లో రాష్ట్రంలో కేవలం 25 ఇంజనీరింగ్‌ కాలేజీలుంటే వాటిని 250 నుంచి 300కి పెంచాను. దీనివల్ల మానవ వనరులను అభివృద్ధి చేయగలిగాము. ఉద్యోగావకాశాలను కల్పించాలి కాబట్టి విదే శాల్లో 16 రోజులపాటు తిరిగి ఐటీ కంపెనీలను రాష్ట్రానికి రప్పించాను.
 
మైక్రోసాఫ్ట్‌ తొలిసారిగా అమెరికా దాటి హైదరాబాద్‌లో బ్రాంచి ప్రారంభించడమే నా కృషికి నిదర్శనం. వచ్చిన కంపెనీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి కాబట్టి సైబరాబాద్‌ను సృష్టించాను. అప్పటి ప్రధాని వాజ్‌పేయికి ఐటీ ఆవశ్యకతను వివరిస్తే నన్ను, అప్పటి ఆర్థిక శాఖ మంత్రిని కలిపి కమిటీగా వేశారు. మేమిచ్చిన ప్రతిపాదనల వల్లే బీఎ్‌సఎన్‌ఎల్‌ ఏకఛత్రాధిపత్యానికి బ్రేక్‌ పడింది. ఐటీ అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయంటే కారణం నా ముందు చూపే.’
 
 
నాలెడ్జి సిటీగా విశాఖ
‘సైబరాబాద్‌ను సృష్టించినట్టే విశాఖ శివారులో పచ్చనికొండలు, విశాలమైన రోడ్లు, సముద్ర తీరం కలిగిన 1,350 ఎకరాల్లో ‘క్లౌడ్‌ సిటీ’ పేరుతో కొత్త నగరాన్ని నిర్మించాలని నిర్ణయించాం. భోగాపురం విమానాశ్రయంలో విమానం సముద్రం మీదుగా ల్యాండ్‌ కావాల్సి ఉంటుంది. అలాంటి ఎయిర్‌పోర్టు దేశంలో ఇదొక్కటే కావడం ప్రపంచ గుర్తింపు లభిస్తుంది. విశాఖ నుంచి భోగాపురం వరకూ ప్రత్యేకంగా మరొక నగరాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. దానికి ఏ పేరు పెట్టాలో విద్యార్థులే సూచించాలి. భవిష్యత్‌లో విశాఖను మరో కొత్తనగరంగా మనమంతా చూస్తాం. పదేళ్లలో నాలెడ్జి సిటీగా మారబోతుంది. అందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
 
 
చంద్రబాబే బ్రాండ్‌ అంబాసిడర్‌:లోకేశ్‌
‘రాష్ట్రానికి సీఎం చంద్రబాబే బ్రాండ్‌ అంబాసిడర్‌, ఆయన చరిష్మాను చూసే భారీ పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. డేటా సెంటర్‌ ఏర్పాటుకు జనవరి 9న ఎంఓయూ జరిగింది. 21 రోజుల్లోనే అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం చెప్పారు. మేము 36 రోజుల్లో ఏర్పాటు చేశాం. ఈ సెంటర్‌తో విశాఖలో సుమారు 28 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 85 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి’ అని మంత్రి లోకేశ్‌ తెలిపారు.
 
 
2vizag02885.jpg 
 
ఏపీ సహకారం భేష్‌: రాజేశ్‌ అదానీ
పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యుత్తమమైన సహకారం అందిస్తోందని అదానీ గ్రూపు ఎండీ రాజేశ్‌ అదానీ అన్నారు. రూ.70వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్‌, టెక్నాలజీ పార్కు ఏర్పాటుకు భూమిపూజ చేసిన రోజు తమకు ఎంతో ముఖ్యమైనదన్నారు. ‘మా ఆలోచనలను మంత్రి లోకేశ్‌కు చెప్పగానే ఆయనతోపాటు సీఎం చంద్రబాబు, ఐటీ అధికారులు ఎంతో సహకరించారు. మా సందేహాలన్నింటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలుస్తోంది. దీనివల్ల పెట్టుబడిదారులకు ఎంతో శ్రమ తప్పుతుంది’ అని రాజేశ్‌ అదానీ పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

  • 1 month later...
5 ఏళ్లు.. ఐటీ 10 రెట్లు

‘లక్ష’ణంగా ఐటీ ఉపాధి!
2012-13లో రూ.1630 కోట్ల టర్నోవర్‌
2017-18లో రూ.17,500 కోట్లు
ఏపీలో ప్రత్యక్షంగా 50 వేలు, పరోక్షంగా మరో 2 లక్షల మందికి ఉపాధి
రాబోయే అయిదేళ్లలో మరో లక్ష మందికి ఉద్యోగాలే లక్ష్యం
కాకుమాను అమర్‌కుమార్‌

ఈనాడు వాణిజ్య విభాగం

7election13e_1.jpg

చంద్రబాబు.. ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలను ఆకర్షించే పేరిది. కంపెనీల స్థాపనకు సానుకూల ప్రభుత్వ విధానాలు అమలు చేస్తూ, భూముల కేటాయింపుతో పాటు విద్యుత్తు, అధికవేగం బ్రాడ్‌బ్యాండ్‌ వంటి మౌలిక వసతులు, మెరుగైన సామాజిక వసతులు కల్పించడమే ఇందుకు కారణం. హైదరాబాద్‌లో ఐటీ రంగంలో దాదాపు 4 లక్షల మంది ఉపాధి పొందుతూ, ఏటా రూ.వేల కోట్ల సంపద సృష్టిస్తున్నారంటే, చంద్రబాబు వేసిన పునాదులే కారణం. 2014లో హైదరాబాద్‌ లేకుండా నవ్యాంధ్ర ఏర్పడినపుడు, మనకు ఐటీ ఉద్యోగాలు ఎలా అని యువత బెంబేలు పడటం వాస్తవం. వారికి భరోసా ఇస్తూ ‘జాబు రావాలంటే, బాబు రావాలి’ అనే నినాదంతో నాడు ఎన్నికలకు వచ్చిన చంద్రబాబుకు యువత జేజేలు పలికింది. ఈ అయిదేళ్లలో ఐటీ టర్నోవర్‌ను 10 రెట్లు పెంచడంతో పాటు, ఐటీ ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయగలిగింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికే ఏర్పాటైన వసతులు, ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీల భరోసాతో తదుపరి అయిదేళ్లలో మరో లక్ష మందికి ఐటీ రంగమే ఉపాధి కల్పించేలా ‘మీ భవిష్యత్తు నా బాధ్యత’  అంటూ చంద్రబాబు ముందుకొస్తున్నారు.

‘సాఫ్ట్‌వేర్‌ రంగంలో నవ్యాంధ్ర పాత్ర నామమాత్రం.. అక్కడ కాల్‌సెంటర్లు మాత్రమే ఉన్నాయ్‌..’ అంటూ ఎద్దేవా చేస్తున్న వారే ఆశ్చర్యపడేలా గత అయిదేళ్లలో ఐటీ రంగం పురోగమించింది.

7election13a.jpg

ఇక్కడి చదువుకున్న యువత ఉద్యోగం కోసం హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు పరుగులు తీయాల్సిన అవసరాన్ని తప్పిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఐటీ కంపెనీల స్థాపనకు ప్రభుత్వం చాలా వేగంగా చర్యలు తీసుకుంది. తక్కువ నైపుణ్యం సరిపోయే ప్రారంభస్థాయి ఉద్యోగాలతో పాటు, అనుభవజ్ఞులకూ ఉపాధి లభించే కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. విశాఖపట్నం, అమరావతి (విజయవాడ-గుంటూరు)తో పాటు కాకినాడ, తిరుపతి వంటి పెట్టుబడిదార్లకు ఆసక్తి ఉన్న మరిన్ని ప్రాంతాల్లోనూ ఐటీ కంపెనీలను సమాంతరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ సంస్థలు కృత్రిమమేధ, డిజైనింగ్‌, అనలిటిక్స్‌, పరిశోధన-అభివృద్ధికి అవసరమైన వారిని ఎక్కువగా నియమించుకుంటున్నందున, గత అయిదేళ్లలో వీటిపైనే దృష్టి కేంద్రీకరించారు. ఏర్పాటవుతున్న సంస్థల్లో  20 శాతం బిజినెస్‌ ప్రాసెసింగ్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు కాగా 80 శాతం ప్రాసెసింగ్‌, విశ్లేషణా విధులు నిర్వహించే కంపెనీలే. ఈ కుటంబాలకు అవసరమైన విద్యా, వైద్య, వినోద సంస్థలతో భారీగా ఉద్యోగావకాశాలు, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోంది. దేశ, విదేశాల్లోని పేరొందిన విద్యా-వైద్యసంస్థలు తరలి వస్తున్నాయి.

7election13b.jpg

మౌలిక సదుపాయాలు, నిపుణుల లభ్యతే ఆంధ్రాకు వరం

ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ), భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం (ఏఐయూ), భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వంటి దిగ్గజాలు రూపొందించిన  ‘భారత్‌ నైపుణ్యాల నివేదిక 2019’ ప్రకారం.. ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణుల్లో ఉద్యోగ సామర్థ్యం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో 2018లో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానానికి దూసుకెళ్లింది. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, అగ్రశ్రేణి కార్పొరేట్‌ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని, సంబంధిత నిపుణులతో 2-3 అంచెల పట్టణాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులకు శిక్షణ ఇప్పించే ‘కాలేజ్‌ కనెక్ట్‌’ పథకాన్ని ముఖ్యమంత్రి ఐటీ సలహాదారు జేఏ చౌదరి ఆధ్వర్యంలో అమలు చేయడం కలిసొచ్చింది.

* డిగ్రీ/ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులు విదేశాల్లో పీజీ చేసేందుకు ఏటా కాపు కులాల్లోని 1500 మందికి, బీసీల్లో 1500 మంది.. ఒక్కొక్కరికీ.15 లక్షల చొప్పున, ముస్లింలు 500 మందికి ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున ఆర్థికసాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.. కంపెనీలు స్థాపించే సత్తా కలిగిన యువనిపుణుల ఆవిర్భావానికి ఇది దోహద పడనుంది.

* విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాల వల్ల సింగపూర్‌, దుబాయ్‌ వంటి ప్రాంతాలకు నేరుగా విమాన సదుపాయం అందుబాటులోకి  రావడంతో విదేశీ ఖాతాదార్ల రాకపోకలు సులువయ్యాయి.

ఐదేళ్ల ప్రగతికి ఈ గణాంకాలే సాక్ష్యం

2012-13
* 2012-13లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఐటీ పరిశ్రమ టర్నోవర్‌ రూ.64,354 కోట్లు. అందులో విశాఖ-తిరుపతి-కాకినాడ-విజయవాడల్లోని కంపెనీల నుంచి జరిగిన వ్యాపారం రూ.1629 కోట్లే.

* అప్పట్లో హైదరాబాద్‌లో 3.20 లక్షల మంది ఉపాధి పొందుతుంటే, కోస్తా ప్రాంతాల్లో 223 సంస్థల్లో 22,000 మంది ప్రారంభస్థాయి ఉద్యోగాలు చేసేవారు.

2017-18
* 2017-18లో ఆంధ్రప్రదేశ్‌ ఐటీ పరిశ్రమ వ్యాపారం రూ.17,500 కోట్లకు పెరిగింది. అంటే అయిదేళ్లలో 10 రెట్లకు పైగా అభివృద్ధి సాధించింది. కొత్తగా ఏర్పాటైన 219 సంస్థల్లో మరో 25,000 మంది ఉద్యోగాలు పొందారు. ఇందువల్ల పరోక్షంగా మరో 2 లక్షల మందికి ఉపాధి లభించిందని అంచనా.

* కేంద్రప్రభుత్వ ఆధీనంలోని ఎస్‌టీపీఐ (సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్క్‌ ఆఫ్‌ ఇండియా) ప్రకారమే చూసినా, 2017-18 ఆర్థిక సంవత్సర ఐటీ ఎగుమతులే రూ.750 కోట్లు దాకా ఉన్నాయి.

* రాబోయే 5 ఏళ్లలో మరో లక్షమందికి ఐటీ ఉద్యోగాలు కల్పించాలన్నది చంద్రబాబు లక్ష్యం. అది సాకారమైతే పరోక్షంగా మరో 4 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది.

7election13f.jpg

స్థిర విధానాలతోనే కంపెనీలు వస్తాయ్‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన నిర్విరామ కృషితో 1998లో హైదరాబాద్‌లో అద్దె కార్యాలయంలో అమెరికా దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కార్యకలాపాలు ప్రారంభించింది. చంద్రబాబు 1999లో రెండోసారి అధికారంలోకి వచ్చి, విధానాలు స్థిరంగా ఉంటాయనే నమ్మాకే, 2002లో  సొంత యూనిట్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. తదుపరి అనేక ఇతర ఐటీ కంపెనీలు వెల్లువలా తరలి వచ్చాయి. ఇప్పుడు నవ్యాంధ్ర పరిస్థితీ ఇంతే.. చంద్రబాబు తొలి అయిదేళ్ల పాలనలో రూపొందించిన ఐటీ విధానాలు, కల్పిస్తున్న మౌలిక వసతులను కంపెనీలు అధ్యయనం చేశాక, ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. అమరావతితో పాటు మరిన్ని పట్టణాలు నవీన నగరాలుగా మారే క్రమంలో డిజిటల్‌ వ్యవస్థలకు ఎంత గిరాకీ ఉంటుందో అంచనా వేసుకున్న సిస్కో వంటి సంస్థలు ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి.

విశాఖలో

* విశాఖలో జిరాక్స్‌ కంపెనీకి చెందిన కాండ్యుయెంట్‌ (1600 మంది సిబ్బంది), ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌తో పాటు పేటీఎం వంటి సంస్థలు కొత్తగా ఏర్పాటయ్యాయి. హెచ్‌ఎస్‌బీసీ, ఐబీఎం, విప్రో, టెక్‌ మహీంద్రా వంటి సంస్థలు విస్తరించనున్నాయి. కాకినాడలో సైయెంట్‌ కూడా వృద్ధి చెందుతోంది.

విజయవాడలో

* విజయవాడలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అతిపెద్ద యూనిట్‌ ప్రారంభించింది. దీని అనుబంధ ఆర్థిక సేవల సంస్థ అయిన స్టేట్‌స్ట్రీట్‌ మేధ టవర్స్‌లో 1600 మందితో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మరో 650 సీట్లకు దరఖాస్తు చేశారు.

గుంటూరులో

* సెమీ కండక్టర్‌ డిజైన్‌ సంస్థ ఇన్‌వీకస్‌ అత్యంత ప్రధానం కానుంది. హైఎండ్‌ నిపుణులు 200 మందితో ప్రస్తుతం గుంటూరులో కార్యకలాపాలు సాగిస్తోంది. నీరుకొండలో చిప్‌ డిజైనింగ్‌ కోసం ప్రత్యేక  పార్క్‌ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇంటెల్‌, క్వాల్‌కామ్‌, ఏఎండీ, గ్లోబల్‌ఫౌండ్రీస్‌ వంటి సంస్థలకూ ఈ పార్క్‌లో చోటు కల్పించాలన్నది లక్ష్యం.

అవగాహనా ఒప్పందాలు జరిగాయి కూడా.

* స్పెయిన్‌కు చెందిన గ్రూపో ఎంటర్‌లీన్‌ ఆటోమోటివ్‌ ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో ప్రపంచ అగ్రగామి సంస్థ. హైఎండ్‌ నిపుణులు 150 మందితో శ్రీకారం చుట్టింది.
* 3డీ యానిమేషన్‌, డిజైనింగ్‌ సంస్థ వీఎఫ్‌ఎక్స్‌ హాలీవుడ్‌ 500 మందితో సేవలు అందిస్తోంది. మరో 650 మందిని నియమిస్తామని ప్రకటించింది.

ఎన్నికలలో చంద్రబాబు గెలిస్తే ఇవన్నీ
రవి వేమూరి, ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ ఛైర్మన్‌

7election13c.jpgఅమెరికా సహా ప్రపంచంలోని అగ్రగామి ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న తెలుగు వారిలో గుంటూరు, కృష్ణా వాసులు ఎక్కువగానే ఉన్నారు. చంద్రబాబు విధానాలపై నమ్మకంతోనే వీరు తమ ప్రాంతంలో కంపెనీలు స్థాపిస్తున్నారు. మా సొసైటీ ఆధ్వర్యంలో అమరావతి  (గుంటూరు-విజయవాడ)లో 65, విశాఖపట్నంలో 25, తిరుపతిలో 5, నెల్లూరులో 2, అనంతపురంలో 1 కంపెనీ ఏర్పాటయ్యాయి. వీటిద్వారా 10,000 ఉద్యోగాలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన మల్టీ సర్వీసెస్‌ సేవల సంస్థ యూఎస్‌టీ గ్లోబల్‌, వర్చువైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ వీఎం వేర్‌ రానున్నాయి. సోనీ కూడా 50 శాతం వీఎఫ్‌ఎక్స్‌ పనిని స్థానికంగా కేటాయించేందుకు అంగీకరించింది. మేధా టవర్స్‌ రెండోదశలో హ్యూలెట్‌ ప్యాకార్డ్‌కు చెందిన ప్రాసెసింగ్‌ సేవల సంస్థ డీఎక్స్‌సీ రానుంది. చంద్రబాబు ఈ ఎన్నికలలో విజయం సాధించగానే, వచ్చే ఏడాదిలో దిగ్గజ కంపెనీలన్నీ యూనిట్లు స్థాపిస్తాయ్‌.
7election13d.jpg
 
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...