July 23, 20169 yr there's only so much a cm and a state govt can do within a federation like India. For a mega project like polavaram that has national implications ... that would cost thousands of crores ... and BJP central releases a grand 1500 crores and asks us to handle capital construction, hc construction ... and keep the change ... let me ask again ... what are we going to do with all that money. I am not so sure state govt is at fault here brother. ee rayapati batch ee teesukunna dabbulni vere panulaki vadukuni vuntundi. ee project meeda talaki minchina appulu chesaru. vaati vaddi kuda sariga kadutunnatlu leru
July 29, 20169 yr Author 2న పోలవరం అథారిటీ సమావేశం హైదరాబాద్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ప్రాజెక్టు అఽథారిటీ(పీపీఏ) సమావేశం జరగనుంది. ఆగస్టు 2న జరిగే ఈ సమావేశంలో పనుల ప్రగతి, డిజైన్లను పీపీఏ సమీక్షించనుంది. అయితే దీనికి పీపీఏ సీఈవో అమర్జిత సింగ్ హాజరయ్యే అవకాశం లేదని రాష్ట్ర జలవనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. పీపీఏ సభ్య కార్యదర్శి ఆర్.కె.గుప్త నేతృత్వంలోనే పీపీఏ సమావేశం జరుగుతుందని సమాచారం.
August 12, 20169 yr Author పోలవరం పనులకు ఓకే! ‘స్టాప్ వర్క్’కు ఏడాది సడలింపు హైదరాబాద్, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఇచ్చిన ‘పనుల నిలిపివేత’ ఆదేశాలను ఏడాదిపాటు సడలిస్తూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఉత్తర్వు జారీ చేసింది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో శరవేగంగా పనులు చేస్తున్నదంటూ కేంద్రానికి ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ లేఖ రాశారు. ‘స్టాప్ వర్క్’ ఆదేశాలకు రెండేళ్లపాటు సడలింపు ఇవ్వాలని ఈ లేఖలో కోరారు. దీనికిముందు ఢిల్లీలో ప్రధాని మోదీ, నాటి అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్లను సీఎం చంద్రబాబు ఇదే విషయమై కలిశారు. దీనిపై జవదేకర్ ఆదేశాల మేరకు శశిభూషణ్ కుమార్తో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి మాట్లాడి రెండేళ్లపాటు సడలింపునకు ఆమోదం తెలిపారు. ఇందుకు అనుగుణంగా జవదేకర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ మరునాడే ఆయన శాఖ మారింది. కేంద్ర అటవీ శాఖ మంత్రిగా అనిల్ మాధవ్ దవే బాధ్యతలు స్వీకరించారు. ఆయన దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లేలోగా పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంస్థలు దవేను కలిశాయి. రెండేళ్ల సడలింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించారు. స్టాప్ వర్క్ ఆదేశాలను ఏడాదిపాటు సడలిస్తూ ఉత్తర్వు జారీ చేశారు.
August 24, 20169 yr పోల‘వరం’ వాపస్! 24-08-2016 01:27:20 రాష్ట్రంపైనే నాబార్డు రుణ భారం ఎఫ్ఆర్బీఎంకి లోబడే రుణం ఏపీ సర్కార్కు కేంద్రం ప్రతిపాదన వడ్డీతోసహా తీర్చాల్సింది రాష్ట్రమే కేంద్రం ప్రతిపాదనకు ఏపీ నో హైదరాబాద్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా తుంగలోకి తొక్కుతున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా పోలవరానికీ ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. విభజన చట్టంలోని హామీ మేరకు పోలవరానికి జాతీయ హోదా ప్రకటించిన కేంద్రం, ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను నాబార్డు నుంచి రుణంగా అందిస్తామని చెబుతూ వచ్చింది. తాజాగా నాబార్డు రుణంలోనూ ‘ఎఫ్ఆర్బీఎంకి లోబడి’ అంటూ మెలిక పెట్టింది. దీంతో వడ్డీతోసహా రుణాన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుంది. జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టుకు కేంద్రమే పూర్తిగా నిధులు భరించాల్సి ఉండగా ఈ కొత్త మెలిక ఏమిటంటూ ఏపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జాతీయ హోదా ఇచ్చినా నిధులు అరకొరే పోలవరం జాతీయ హోదా ప్రాజెక్టు కావడంతో భూసేకరణ, ప్రధాన ప్రాజెక్టు పనులు, కాంక్రీట్ పనులకు నిధులను కేంద్రమే భరించాలి. కానీ ఇప్పటి వరకు నామమాత్రపు నిధులే కేటాయిస్తూ వచ్చింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఏర్పాటు చేసి ప్రాజెక్టుపై పెత్తనం చేసేందుకు సిద్ధమైందే తప్ప మిగిలిన అంశాలను విస్మరించింది. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రమ్ వాల్, ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ వంటి నిర్మాణాల డిజైన్లను కేంద్ర జల సంఘం ఆమోదించేలా చర్యలు తీసుకోవడంలోనూ విఫలమైంది. తాజాగా ప్రాజెక్టు భారమంతా రాష్ట్రంపై వేసేందుకు సిద్ధమైంది. పోలవరం నిర్మాణానికి అవసరమైన నిధులను నాబార్డు నుంచి రుణం రూపంలో అందిస్తామని కేంద్ర జలవనరుల శాఖ ఏపీ సర్కార్కు ప్రతిపాదించింది. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ (ఎఫ్ఆర్బీఎం) పరిధికి లోబడి రుణాన్ని అందించేలా నాబార్డును ఒప్పిస్తామని చెప్పింది. అంటే.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నాబార్డు నుంచి తీసుకునే రుణాన్ని వడ్డీతోసహా ఏపీ సర్కార్ చెల్లించాలి. ఇది ఆర్థిక లోటుతో కునారిల్లుతున్న ఏపీకి భారంగా మారుతుంది. ఈ ప్రతిపాదనను లిఖిత పూర్వకంగా ఏపీకి తెలపడమే కాకుండా కేంద్రం నుంచి కార్యదర్శి స్థాయి అధికారి ఒకరు ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కలిసి వివరించారు. నాబార్డు నుంచి ఎఫ్ఆర్ఎంబీ చట్టానికి లోబడి రుణాన్ని ఇప్పిస్తామని చెప్పారు. దీంతో జలవనరుల శాఖ, ఆర్థికశాఖ అధికారులు ఖిన్నులయ్యారు. ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడి రుణం తీసుకోవాలంటే కేంద్రం అనుమతి ఎందుకని ప్రశ్నించారు. పోలవరానికి జాతీయ హోదా ప్రకటించినందుకు మొత్తం వ్యయాన్ని కేంద్రమే భరించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అయినా కేంద్రం ‘నాబార్డు రుణం పాట’ పాడటం ఆపలేదు. దీంతో కేంద్రం ప్రతిపాదనను ఏపీ తిరస్కరించింది. కేంద్రం తీరుపై సీఎం ఆగ్రహం ఇటీవల సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో పోలవరంపై కేంద్రం తీరును ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాం వివరించారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున కేంద్రమే మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని భరించాలని, మధ్యలో రుణం ప్రతిపాదన ఏమిటంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కీలకమైన పోలవరం ప్రాజెక్టును 2018లోగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నాం. ఇలాంటి తరుణంలో నిధుల విడుదలకు ముందుకు రావాల్సిన కేంద్రం అందుకు విరుద్ధంగా లోటులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని మోపేలా నాబార్డు రుణాన్ని ఇప్పిస్తామనడం ఏమిటి’ అని మండిపడినట్లు సమాచారం.షేెఇచీహా
August 24, 20169 yr Indukenemo mana rastram chala pratyekamainadi ani prakatanalu istunaru pushpam gallu...
August 24, 20169 yr Andari kante ekkuva istamu ane dialouge malli... Ekkuva ante appulu istaranamata ippude ardamaindi
August 24, 20169 yr loan tecchukovalanta, FRBM limit pencharanta. monthly salaries pay cheyyatanike FRBM limit reach avutunnamu. inka polavaram ki loan ela tecchukuntam? It is like throwing in the deep water with hands tied in the back.
August 24, 20169 yr Author నాబార్డు నుంచి ఎఫ్ఆర్ఎంబీ చట్టానికి లోబడి రుణాన్ని ఇప్పిస్తామని చెప్పారు. దీంతో జలవనరుల శాఖ, ఆర్థికశాఖ అధికారులు ఖిన్నులయ్యారు. ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడి రుణం తీసుకోవాలంటే కేంద్రం అనుమతి ఎందుకని ప్రశ్నించారు.
August 25, 20169 yr Author ‘పోలవరం’ను కేంద్రానికి అప్పగించేందుకు సిద్ధం : చంద్రబాబు విజయవాడ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కేంద్రానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురువారం దుర్గా ఘాట్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి డ్రోన్ల ద్వారా పోలవరం పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... వచ్చే నెలకల్లా పోలవరం ప్రాజెక్టు సైట్ వరకు ఫైబర్ గ్రిడ్, సర్వైలెన్స్, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే రూ.10.49 కోట్ల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 4.02 కోట్ల క్యూబిక్ మీటర్ల పని పూర్తయిందన్నారు. ప్రతి రోజు 2.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ చేయాల్సి ఉందని, డయాఫ్రాం వాల్ నిర్మాణానికి పనులు వేగవంతం చేశామని, ఎల్అండ్టీ, బావర్ సంస్థలు భారీ యంత్రాలను తెప్పించాయని, వారానికోసారి పోలవరం ప్రాజెక్టుపై వర్చువల్ ఇన్స్పెక్షన్ చేస్తానని సీఎం పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన చేపడతామని, అలాగే ఇకపై ప్రతి నెల ప్రాజెక్టు పనులు పరిశీలిస్తానని, స్పిల్ వే పనులు కూడా వేగంగా పూర్తి చేసేందుకు ఆదేశాలిచ్చానని, ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.1700 కోట్లు ఇవ్వాలన్నారు. పోలవరం నిర్మాణ పనులు కేంద్రానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని, పోలవరం పనులకు వైసీపీ, కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుపడుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రాజెక్టు కట్టకుండా కాలువలు తవ్వి కమీషన్లు తీసుకున్న వైసీపీ, కాంగ్రెస్కు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదని చంద్రబాబు పేర్కొన్నారు.
August 25, 20169 yr Author Godavari water 1800 tmc wasted into sea from june to till date. Krishna lo water unna srisailam full kaledu, ilanti position change avali ante Polavaram complete ayithe annintiki one solution will come. Approach channel, Spill channel --> to divert water. 18lakhs cubic metres works cheyali, per day target 5500 cubic metres work cheyali. 11 Months lo we can complete work. Earth work:- 10.49 crores cubic metres works need to be done, till now 4.02crores cubic metres work done. 6.47crores cubic metres work needs to be done. Per day 2.42 lakhs work kavali. Earth-cum-rockfill dam works can only done when water is less. Works needs to be done 1.2 lakhs cubic metres works cheyali. November to june lo pu complete cheyali. 95lakhs cubic metres works need to done in 12 months. Per month 25000 cubic metres works cheyali. Spill channels concrete--> 15 lakhs cubic metres concrete works must be completed in 16 months. Plan chestunaru govt. Every month minimum 300 crores+ state govt is spending minimum. From November plan ready chestunaru if water levels are less then start all works this time CBN taking it as challenge. 300crores*12 months = 3600 crores in 2016-17 3600 crores in 2017-18 3600 crores in 2018-19 Almost main dam+spillway+left canal oka 70-80% works ki saripotayi ee money. If at all 2019 elections ki dam ni oka shape vasthe chalu it will be major asset for Tdp. I Appreciate CBN on his commitment
August 26, 20169 yr డిజైన్లు ఆమోదిస్తేనే పోలవరం ముందుకు! 26-08-2016 02:39:21 తాత్సారం చేస్తున్న కేంద్ర జల సంఘం... పనుల్లో జాప్యం తప్పదంటున్న కాంట్రాక్టర్లు హైదరాబాద్, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి నిధులు మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్రం.. నిర్మాణానికి అవసరమయ్యే డిజైన్లకు ఆమోదం తెలపడంలోనూ తాత్సారం చేస్తున్నది. పోలవరం ప్రాజెక్టు హెడ్వర్క్స్ పనులు చేపట్టాలంటే కేంద్ర జల సంఘం ఆమోదం తప్పనిసరి. రోజూవారీగా రియల్ టైమ్లో పోలవరం పనుల తీరును సమీక్షించేందుకు సీఎం సిద్ధమైనప్పటికీ ప్రధాన పనుల డిజైన్లకు కేంద్ర జల సంఘం ఆమోదం లేకుంటే ఫలితం లేదని జల వనరుల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏడు ప్రధాన డిజైన్లకు కేంద్ర జల సంఘం ఆమోదం లభించాల్సి ఉంది. ఇందులో ముఖ్యమైన టైల్ వాటర్ లెవల్ డిజైన్ను కేంద్ర జల సంఘం ఆమోదించాల్సి ఉంది. అదేవిధంగా స్పిల్వే క్రాస్ సెక్షన్ స్టేబిలిటీ అనాలిసి్సకు సంబంధించిన డిజైన్లను ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్సా్ట్రయ్ సమర్పించింది. ఈ డిజైన్లకూ కేంద్ర జల సంఘం ఆమోదం లభించలేదు. కాంక్రీట్ డిజైన్ మిక్స్కు సంబంధించి న్యూఢిల్లీలోని సీఎ్సఎంఆర్ఎస్ ఆమోదం తెలపాల్సి ఉంది. తుది డిజైన్ ఆమోదం కోసం కాంట్రాక్టు సంస్థ ఎదురుచూస్తున్నది. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన కాంక్రీట్ కూలింగ్ స్టడీస్పై ఐఐటీ చెన్నయ్ నుంచి సమాచారం రావాల్సి ఉంది. 2డి మోడల్ స్టడీస్పై సీడబ్ల్యుసీఆర్ఎస్ నుంచి ఆమోదం లభించాల్సి ఉంది.
August 27, 20169 yr Yes, naa chinnappati nundi ammesina pantalaki 2016 rates prakram naaku govt reimburse cheyyali anthe
August 27, 20169 yr If CBN concentrates on Polavaram every day 10 min chusthe chalu using drones work speed will increase 100 times more. Just work ekada tavvutunaru entha avutundi, today akada entha avutundi reports real time monitoring chesthe chalu. Even better flood lights, roads vesi all flood lights ki cameras fix chesi how many trucks, proklanors, men at work,... chusthe every day 10 min is more then enough. It is better to give power connection to polavaram from all sides and trucks,... night time 3 shifts works cheyisthe emana use, Hourly updates cheyisthe chalu super speed avutundi. Better sept last ki works start ayee time ki sand lifting ki 3rd party ki ichi 3 companies ki ichi per shift each company must dig 1lakhs cusecs ani target pedithe chalu per day 3 lakhs cusecs sand lifting. In 100 days 3 crores sand lifting cheyochu. Till now inka 6+ crores tavvali ila 3 companies ni dimpithe 200-300 days lo motham complete cheyochu. Better use this year september to may next year. If 1 year lo complete chesthe we can concentrate on Spillway and spill channel works speed up cheyochu one by one. Elago Baver and L&T will take care of Rockfilldam
August 27, 20169 yr Girijans ni thanda lo vadileste, govt not providing roads, piped water, drains, schools, hospitals ani edustaaru Avanni accessible gaa unde towns ki rammante, kudaradu antaru Leftist naxals rock amma
August 27, 20169 yr Girijans ni thanda lo vadileste, govt not providing roads, piped water, drains, schools, hospitals ani edustaaru Avanni accessible gaa unde towns ki rammante, kudaradu antaru Leftist naxals rock amma Now Govt will move only few villages which are mainly required for dam constructions only. Ippudu major key is dam construction ki konni villages ni move chesthe chalu. If per month 300 crores karchu chesthe in 3 years lo 80-90% dam will gets completed. Then once dam is constructed and in last 20% unnapudu unna villages re-habitation gurinchi think cheyochu. If telanagana nunchi vache money lo 50% vachina that money polavaram ki allocate chesina chalu 2 years lo dam ki oka shape vastundi. If we had money 1000 times speed cheyochu works
Create an account or sign in to comment