హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పులిచింతల గేట్లను వెంటనే ఎత్తాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్రావును కోరారు. ఈ మేరకు మంత్రి హరీశ్రావు మంగళవారం ఉమా మహేశ్వర్రావుతో ఫోన్లో మాట్లాడారు. పులిచింతల ప్రాజెక్టు కింద నిర్వాసితులకు సహాయ, పునరావాస కార్యక్రమాలు ఇంకా పూర్తికాలేదని ఉమామహేశ్వర్రావుకు తెలిపారు. పులిచింతలకు వస్తున్న వరదనీటిపై మంత్రి హరీశ్రావు సమీక్షించి, నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్, ఈఎన్సీ ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు.