Personal experience: came for a visit to India. I bought a new car for my parents and taken special number and selected number though aprta.citizen.epragathi website bidding process got number in one day. What a smooth process no agent no money.
భూసేకరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం సామాజిక మదింపు లేకుండానే సేకరణకు అవకాశం కొన్ని అంశాల్లో ప్రజాభిప్రాయం అవసరం ఉండదు
ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్ భూసేకరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం ఆమోదముద్ర వేశారు. కేంద్ర ప్రభుత్వం 2013లో చేసిన ‘ద రైట్ టు ఫెయిర్ కాంపెన్షేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్’లోని నిబంధనలు భూసేకరణకు ఇబ్బందిగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్లో 12 సవరణలతో కొత్త బిల్లును ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. పలు శాఖల అభిప్రాయం తీసుకున్న తర్వాత కేంద్రహోంశాఖ రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. వెంటనే ఆయన దానికి ఆమోదముద్ర వేశారు. ఈ కొత్త బిల్లువల్ల అభివృద్ధి కార్యక్రమాల కోసం మరింత సులభతరంగా భూమి సేకరించుకొనే వెసలుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి లభిస్తుంది. పరిహారంపై కలెక్టర్లకు అధికారం: జాతీయ భద్రత, రక్షణ, సాగునీరు, అత్యవసరమైన మౌలికవసతుల కల్పనకోసం
భూమి సేకరించినప్పుడు సామాజిక ప్రభావ మధింపు, ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిన అవసరం ఉండదు. * భూసేకరణతో ముడిపడిన వ్యక్తుల అనుమతి తీసుకున్న తర్వాత పరిహారంపై నిర్ణయం తీసుకొనే అధికారం కలెక్టర్కు దక్కుతుంది. * రైతులు స్వచ్ఛందంగా భూమి ఇవ్వడానికి ఇష్టపడితే ఇరువర్గాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఎక్కువ పరిహారం ఇవ్వడానికి వీలవుతుంది. * పరస్పర ఒప్పందం ద్వారా ఏ ప్రజాప్రయోజనం కోసమైనా భూసేకరణచేయడానికి ప్రభుత్వానికి వెసలుబాటు లభిస్తుంది. * సహాయ, పునరావాస కార్యక్రమానికి ఒకేసారి పూర్తిమొత్తం ఇవ్వడం ద్వారా నిర్దిష్టమైన ప్రాజెక్టులకోసం భూసేకరణ జరుపుకోవడానికి వీలవుతుంది.
ఐదేళ్ల నిబంధన అప్పుడు.. వర్తించదు 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ అవార్డు ప్రకటించిన అయిదేళ్లలోపు సదరు భూమిని స్వాధీనం చేసుకోవాలి. పరిహారం కూడా ఆలోపే చెల్లించలి. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరణ ప్రకారం ఏదైనా భూసేకరణ వ్యవహారం కోర్టు కేసుల్లో ఇరుక్కుపోతే ఆ కాలానికి అయిదేళ్ల నిబంధన వర్తించదు. బిల్లుకు రాష్ట్రపతి ముద్ర వేసినట్లు కేంద్ర హోంశాఖ మంగళవారం ఆంధ్రప్రదేశ్ శాసనవ్యవహారాల కార్యదర్శి ఎం.విజయరాజుకు వర్తమానం పంపింది.
2013 చట్టప్రకారం అయితే.. 2013నాటి చట్టం ప్రకారం ఏ కార్యక్రమం కోసమైనా భూసేకరణ చేయాలంటే తప్పనిసరిగా సామాజిక ప్రభావ మధింపు చేయాల్సి ఉంది. దాంతోపాటు ఆహారభద్రతను దృష్టిలో పెట్టుకోవాలి. భూసేకరణ అవార్డుతోపాటే బాధితులకు అధిక పరిహారం, సహాయ, పునరావసానికి సంబంధించిన అవార్డు ప్రకటించాల్సి ఉంటుంది. రైతులనుంచి విచక్షణారహితంగా భూమి తీసుకోకూడదు.
సవరణలు ప్రధానంగా ఎందుకోసమంటే.. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. జాతీయరహదారులు, రైల్వేలైన్లు, పోర్టుల నిర్మాణానికి పెద్దఎత్తున శ్రీకారం చుట్టారు. వీటన్నింటికీ తక్షణం భూమి అందుబాటులోకి తేవాల్సి ఉంది. లేదంటే వాటి అంచనా వ్యయాలు భారీగా పెరగడంతోపాటు ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందడంలో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2013 చట్టానికి సవరణలు ప్రతిపాదించింది.
తొలగనున్న భూసేకరణ ఇబ్బందులు ప్రస్తుతం ఈ బిల్లు చట్టరూపం దాల్చడంవల్ల రాజధాని ప్రాంతంలో సహా, వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకోసం చేపడుతున్న భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురవుతున్న ఇబ్బందులు కొంతమేర తగ్గుతాయి. ప్రభుత్వం, రైతులకు ఆమోదయోగ్యమైన రీతిలో భూసేకరణ చేసుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది.
Achanta Raja @achantaraja 8m8 minutes ago
ఇంత బఫూన్ గాళ్ళు ఎంటిరా ?
2 replies 5 retweets 3 likes
Achanta Raja @achantaraja 28m28 minutes ago
Achanta Raja Retweeted Apurva Singh
పాపా అపూర్వ.. మీ డాం మాధవ్ చెప్పాడా ఏంటి, జంతలూరు అనే జిల్లా ఉందని ? కర్నాటకలో దిగిన ఫేక్ బ్యాచ్ అంతా, ఇటు డైవర్ట్ అయ్యినట్టు ఉన్నారు,,, ఇక్కడ చింతలబస్తీ, బీహార్ బ్యాచ్ తోనే చస్తున్నాం...
Achanta Raja added,
Apurva Singh @iSinghApurva
The Cabinet today approved the setting up of a central university in Janthaluru district of Andhra Pradesh. #Modi4AndhraDevelopment @narendramodi https://www.thehindubusinessline.com/news/education/cabinet-nod-to-central-university-in-janthaluru-district-of-andhra-pradesh/article23903893.ece …
1 reply 5 retweets 4 likes