పొత్తు వికసిస్తుందా? వికటిస్తుందా?
పొత్తు నేరం ఘోరం అసమర్థత కాదు
పొత్తు ఒక రాజకీయ వ్యూహం
కొన్నిసార్లు వికసిస్తుంది
కొన్నిసార్లు వికటిస్తుంది
రాజకీయాల్లో 1+1=2 అవ్వొచ్చు
సున్నా కూడా అవ్వొచ్చు
2009 లో టిఆర్ఎస్ తో &
2018 లో కాంగ్రెస్ తో టిడిపి పొత్తు వికటించింది
2004 లో తెరాసతో కాంగ్రెస్ పొత్తు వికసించింది
1999 & 2014 లో భాజపాతో
టిడిపి పొత్తు వికసించింది
2024 లో?? ఏమవుతుంది?
భావసారూప్యతతో పాటు కార్యకర్తల మధ్య సఖ్యత
పొత్తు ఫలితంపై ఆధారపడి ఉంటుంది
మన రాష్ట్రంలో బాబు వైఖరి ఇక్కడ ముఖ్యం
రాష్ట్రంలో టిడిపికి ప్రధాన ప్రత్యర్థి
2014 ముందు కాంగ్రెస్ 2014 తర్వాత వైకాపా
ఆ పార్టీ &/ అధినేతపై మాత్రమే ఫోకస్ చేయకుండా
2004 లో కేసిఆర్పై 2009 లో చిరంజీవిపై
2014 లో సోనియాపై 2019 లో మోదీపై
అవసరం లేని నేతలపై అధిక ఫోకస్ చేసి
వారిపై కార్యకర్తల్లో విపరీతమైన ద్వేషం
పెంచేలా చేసింది బాబు
బాబు మళ్ళీ అదే పార్టీ(ల)తో పొత్తు
కార్యకర్తలు ఆ ట్రాన్స్ లో నుండి బయటకు రాలేదు
ఫలితంగా ఓటు బదలాయింపు జరగలేదు
2009 లో తెరాస టిడిపి మధ్య
2018 లో కాంగ్రెస్ టిడిపి మధ్య
ఓటు బదలాయింపు జరగలేదు
టిడిపి ఓటమికి కారణం అయింది
ఈ ప్రయత్నంలో
2009లో టిఆర్ఎస్ని తమ్ముళ్లు
2019లో భాజపాను బాబు
చంపేసి తాము ఓడిపోయారు
2014లో మాత్రం కాంగ్రెస్ని చంపి
వైకాపాకు జీవం పోశారు
2024 లో మళ్లీ భాజపాతో పొత్తు
బాబు పెంచిన ద్వేషం నుంచి
కార్యకర్తలు బయటకు రాలేదు
ఇక్కడ పరిస్థితి భిన్నం
ఇక్కడ గమనించాల్సిన అంశాలు రెండు
2009 లో తెరాసకు కార్యకర్తలు ఉన్నారు
వారితో టిడిపి కార్యకర్తలకు మధ్య విభేదాలు ఉన్నాయి
అపుడు 44 సీట్లు ఇచ్చారు గెలిచింది కేవలం 10
2024 లో భాజపాతో పొత్తు లో ఆ పరిస్థితి లేదు
భాజపాకు కనీస స్థాయిలో కార్యకర్తలే లేరు
వారితో తమ్ముళ్ళ విభేదాలు అనే మాటే రాదు
పైగా ఇచ్చిన సీట్లు తక్కువ
ఇచ్చినవి కూడా మెజారిటీ ఓడిపోయేవి
తమ అనుకూలురకు ఎక్కువ
బాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు
అయినా ఎందుకో తమ్ముళ్లు
అనవసరంగా భాజపాపై ఫోకస్
గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కులం మతం ప్రాంతం అనే భావాలు జనం విడనాడాలి అని నీతులు చెబుతూ తమ్ముళ్లు మాత్రం తమ ఈగోను మాత్రం పక్కన పెట్టలేక పోతున్నారు ఇది తగని పని
బాబు మోడీ కలిస్తే లాభం అనే
బాబు పాజిటివ్ ఎత్తుగడను జనంలోకి పంపకుండా
తమ సొంత పైత్యం ద్వారా
పొత్తులో సఖ్యత లేదు అనే నెగటివ్ ఇమేజిని
జనంలోకి పంపుతూ
ఒక ప్రతికూల వాతావరణం సృష్టిస్తున్నారు
దీనివలన గెలిచే పార్టీకి ఓటు వేయాలి
అనుకునే వారు కూడా ఓటు వేయకుండా
వ్యవహరిస్తోంది తమ్ముళ్లు మాత్రమే
ఫలితం అనుభవించేది తమ్ముళ్లు మాత్రమే కాదు
రాష్ట్ర ప్రజానీకం కూడా!
తమ్ముళ్ళు సాధ్యమైనంత త్వరగా
తమ ఈగో పక్కన పెట్టకపోతే
దుష్ఫలితం తప్పదు