Siddhugwotham Posted May 2, 2021 Share Posted May 2, 2021 విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కన్నుమూశారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. కరోనా బారిన పడిన ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లాలోని పెదపూడి మండలం పెద్దాడ. ఆవిర్భావం నుంచీ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ ఆవిర్భవించిన తొలి రోజుల్లోనే టీడీపీ తరఫున సామర్లకోట సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1984లో జిల్లా జడ్పీ ఛైర్మన్గా పని చేశారు. క్రమంగా ఎదిగారు. 1994, 1999 నాటి సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004, 2009లో టీడీపీ తరఫున పోటీ చేసినప్పటికీ.. ఓడిపోయారు. 2004లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు. ఆ తరువాత ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. పెద్దాపురం నియోజకవర్గం టికెట్ను మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు కేటాయించింది టీడీపీ. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తుంచుకుని శాసన మండలికి పంపించింది. Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted May 2, 2021 Share Posted May 2, 2021 RIP Link to comment Share on other sites More sharing options...
Rtn Posted May 2, 2021 Share Posted May 2, 2021 Rest in Peace B.B.R. Link to comment Share on other sites More sharing options...
Uravakonda Posted May 2, 2021 Share Posted May 2, 2021 Rest in peace Link to comment Share on other sites More sharing options...
PHANI_NTR Posted May 2, 2021 Share Posted May 2, 2021 6 minutes ago, Uravakonda said: Rest in peace Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.