Jump to content

కడప: కరోనాకు ఒకే కుటుంబంలో ముగ్గురు బలి.. అనాథలైన ఇద్దరు పిల్లలు


Npower

Recommended Posts

చంద్రబాబు తల్లి లక్షమ్మ ఈ నెల 9న కరోనాతో చనిపోయింది. ఆమె అంత్యక్రియలకు చంద్రబాబు వెళ్లడంతో.. ఆయనకు కరోనా సోకి ఈ నెల 19న చనిపోయాడు. ఈ క్రమంలో చంద్రబాబు భార్య లక్ష్మీదేవికి కూడా వైరస్ సోకింది. ఈ నెల 22న రిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూసింది.

 
samayam-telugu.jpg
కుటుంబంలో విషాదం నింపిన కరోనా
కడప జిల్లాలో దారుణం జరిగింది. కరోనాకు ఒకే కుటుంబంలో ముగ్గురు బలయ్యారు. సిద్దవటం మండలం లింగంపల్లికి చెందిన జింకా చంద్రబాబు తల్లి లక్షమ్మ ఈ నెల 9న కరోనాతో చనిపోయింది. ఆమె అంత్యక్రియలకు చంద్రబాబు వెళ్లడంతో.. ఆయనకు కరోనా సోకింది. అతడు రిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ ఈ నెల 19న చనిపోయాడు. ఈ క్రమంలో చంద్రబాబు భార్య లక్ష్మీదేవికి కూడా వైరస్ సోకింది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ నెల 22న రిమ్స్ ఆస్పత్రిలో చనిపోయింది. చంద్రబాబు తండ్రి చంద్రాయుడుకు కూడా ఈ నెల 19న పాజిటివ్ తేలగా.. రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.


చంద్రబాబు, లక్ష్మీదేవిలకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లకు వివాహాలయ్యాయి. మూడవ కుమార్తె దివ్య కడప ప్రభుత్వ బాలికల కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది.. కుమారుడు భగీరధ్ 6వ తరగతి చదువుతున్నాడు. కరోనా కారణంగా తండ్రి చంద్రబాబు, తల్లి లక్ష్మీదేవి, నాయనమ్మ చనిపోవడంతో పిల్లలు చివరి చూపుకు కూడా నోచుకోలేదు. వారి మరణంతో పిల్లలు అనాథలుగా మిగిలారు. చంద్రబాబుకు ఉన్న 2 ఎకరాల భూమిని అప్పులు తీర్చేందుకు అమ్ముకున్నాడు. పిల్లలకు ఏ ఆధారం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరుతున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...