Jump to content

గోపాలకృష్ణ ద్వివేది ఔట్


rajanani

Recommended Posts

ఇవి already chesinave, so antha excitement ledu... 

Peddadi, ఏదైనా pedda wicket కోసం waiting... 

Chusthante ఇక calm ga పని laginchettu వున్నారు Govt side నుంచి, SEC uncle ey edoti geliki small issue ki suspend cheyyali comedy గా.. 😅

Link to comment
Share on other sites

 

Edina  Nimmagadda  ni mecchukovacchu.  

LV subbu gaadila moosukoni pokunda ...    Jaggadini tokki nara teesadu. 

 

He did a great fight in all odds.  He shown us some light.

Jaggadini kottalante okate daari, continues gaa vaadito fight cheyyadame. 

 

Link to comment
Share on other sites

10 minutes ago, bharath_k said:

 

Edina  Nimmagadda  ni mecchukovacchu.  

LV subbu gaadila moosukoni pokunda ...    Jaggadini tokki nara teesadu. 

 

He did a great fight in all odds.  He shown us some light.

Jaggadini kottalante okate daari, continues gaa vaadito fight cheyyadame. 

 

Perfect 

Link to comment
Share on other sites

అమరావతి: సీనియర్‌ అధికారులు ద్వివేది, గిరిజా శంకర్‌లపై బదిలీ వేటు.. ఓటర్ల జాబితా రూపొందించడంలో నిర్లక్ష్యం వహించారు, ఇద్దరు విధులు నిర్వహించడానికి అనర్హులు-ఎస్‌ఈసీ

Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్‍ వ్యవహారం పై నిన్న సాయంత్రం నుంచి, అటు ప్రభుత్వానికి, ఇటు ఎలక్షన్ కమిషన్ కు మధ్య, వివాదం కొనసాగుతుంది. పంచాయతీ ఎన్నికల షెడ్యుల్ ప్రకటించిన తరువాత, రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్ళటం, మొదట అనుకూలంగా, తరువాత డివిజన్ బెంచ్ లో వ్యతిరేకంగా ప్రభుత్వానికి తీర్పు రావటం తెలిసిందే. అయితే ఈ సమయంలో ఎన్నికలకు సంబంధించి, 2021 ఓటర్ల జాబితాను, ఈ నెల 21న ప్రచురిస్తాం అని, ప్రభుత్వం తరుపున కోర్టుకు తెలిపారు. అఫిడవిట్ కూడా దాఖలు చేసారు. అయితే ఓటర్ల జాబితా మాత్రం బయటకు రాలేదు. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్‍ ఈ వ్యవహారంలో విఫలం చెందారని, ఎలక్షన్ కమీషనర్ ప్రకటించారు. అయితే ఈసి అనుమతి లేకుండా, నిన్న రాత్రి ప్రభుత్వం ఆ ఇద్దరినీ సస్పెండ్ చేసింది. అయితే, ఈ రోజు ఉదయం స్పందించిన ఎలక్షన్ కమిషన్, ఎన్నికలు జరుగుతున్న దశలో, ఏదైనా ఈసీకి చెప్పి చేయాలని, ప్రొసీజర్ ప్రకారం చేయాలనీ, ప్రభుత్వ ఉత్తర్వులు తిరస్కరించింది.


 

అయితే ఇప్పుడు ఎన్నికల కమిషన్ వీరి పై సంచలన ఆదేశాలు ఇచ్చింది. వీరి పై అభిశంసన జారీ చేస్తూ, ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. "Guilty of serious offence" కింద ఈ ఆదేశాలు ఇచ్చినట్టు అర్ధం అవుతుంది. నిబంధనల ఉల్లంఘనలను సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అభిశంసన ఉత్తర్వులు జారీ చేస్తూ, ఈ ఉత్తర్వులను తమ వెబ్సైటులో ఉంచింది ఎన్నికల కమిషన్. అయితే ఈ ప్రొసీడింగ్స్ లో, వీళ్ళు ఇరువురు, ఆయా స్థానంలో ఉండటానికి అనర్హులని ప్రకటిస్తూ, వీరిని వేరే డిపార్టుమెంటు కు బాదిలీ చేయాలని, ఆదేశించింది. ఈ ఉత్తర్వుల్లో ఎందుకు వీరి పై ఈ చర్యలు తీసుకుంది, పూర్తి వివరాలు ఇచ్చారు. ముఖ్యంగా ఓటర్ లిస్టు రెడీ చేయలేదని, వీరు తగిన ఆదేశాలు ఇవ్వాలని ఈసి చెప్పినా, వీరు విఫలం అయ్యారని పేర్కొన్నారు. దీని వల్ల ఇప్పుడు 3.60 లక్షల మంది ఓటు హక్కు కోల్పోయారని, దీనికి వీరే బాధ్యులని ఈసి గతంలోనే తెలిపింది. ఒక పక్క ఓటర్ల జాబితా రెడీ చేయకపోవటం, ఈసి ఆదేశాలు పాటించకపోవటం, అలాగే కోర్టులో తాము 21న ప్రచురిస్తాం అని చెప్పి ఉల్లంఘించటం వల్ల, ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.

Link to comment
Share on other sites

ద్వివేదీ మెడకు చుట్టుకుంటున్న ఓటర్ల జాబితా వివాదం..!
చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా పని చేసిన ప్రస్తుత పంచాయతీరాజ్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ.. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారు. దీంతో తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కేవలం బదిలీతోనే సరిపెట్టలేదు. అంతకు మించి చర్యలు తీసుకుంటున్నారు. గోపాలకృష్ణ ద్వివేదీతో పాటు కమిషనర్ గిరిజాశంకర్‌లపై సెన్సూర్ ప్రొసీడింగ్స్‌ను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేశారు. గోపాలకృష్ణ ద్వివేదీపై ప్రధాన అభియోగం.. ఓటర్ల జాబితాను సిద్ధం చేయకపోవడం. హైకోర్టుకు మాట ఇచ్చి కూడా ఆయన 2021 జాబితా ప్రకారం.. ఓటర్ల లిస్ట్‌ను ప్రకటించలేదు. దీని వల్ల.. అర్హులైన యువ ఓటర్లకు ఓటు హక్కు లేకుండా పోయిందని… దీనికి బాధ్యత అంతా ద్వివేదీనేనని నిమ్మగడ్డ సెన్సూర్ ప్రొసీడింగ్స్‌లో స్పష్టం చేశారు. అందులో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తన ప్రొసీడింగ్స్.. గోపాలకృష్ణ ద్వివేదీ సర్వీస్ రికార్డుల్లో పొందు పరచాలని స్పష్టం చేశారు. అదే సమయంలో వారు ఎన్నికల విధులు నిర్వహంచడానికి అర్హులు కాదని స్పష్టం చేశారు.
ఒక్క నిమ్మగడ్డ మాత్రమే కాదు.. ద్వివేదీపై కోర్టు కూడా ధిక్కరణ చర్యలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 2019 ఓటర్ల జాబితా ఆధారంగా తనకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండాపోయిందని.. అఖిల అనే యువతి హైకోర్టులో పిటిషన్ వేసింది. దానిపై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ సమయంలో… పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ద్వివేదీ నిర్లక్ష్యాన్ని ప్రత్యేక అఫిడవిట్ రూపంలో ఎస్‌ఈసీ సమర్పించే అవకాశం ఉంది. అదే సమయంలో డివిజన్ బెంచ్ విచారణ సమయంలో.. ఎన్నికల జాబితా ప్రకటిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చారు. ప్రకటించలేదు. ఈ విచారణలో ఈ అంశం కూడా.. ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంటే.. ద్వివేదీకి చాలా కష్టకాలం ఎదురవనుంది. ఆయన ఉద్యోగ జీవితం ఇక్కట్లకు గురయ్యే అవకాశం ఉంది.


Read more at telugu360.com: ద్వివేదీ మెడకు చుట్టుకుంటున్న ఓటర్ల జాబితా వివాదం..! - https://www.telugu360.com/te/dwivedi-in-trouble-for-2021-voter-list/

Link to comment
Share on other sites

2 hours ago, r_sk said:

Jaffa compensation gettigaane isthaaduga... ade Vella Dheema...

No 1 feeling shame about bad remarks....

 

Edi history lo record avvuddi kada, repu veedu retire aiyyina kaani evado okadu veedini reference chestoo vuntaru 

- more over ee dwivedi gaadu bayapaddadu 

- lekapote nimmagadda vetu veyyakamunde transfer cheyinchukone vaadu kaadu 

- ante, veediki emi jaruguddo munde telusu. 

 

Okka jagga tappa, future lo ee GOVT veedini daggaraku ranivvaru  ( including any other state, central ) 

 

Link to comment
Share on other sites

గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజాశంకర్ లాంటి వారు.. అభిశంసనకు గురయ్యారు. ఎవరైనా ఐఏఎస్ అధికారి రాజ్యాంగ వ్యవస్థ చేతిలో అభిశంసనకు గురయ్యారంటే… అంతకంటే అవమానం ఉండదు. భవిష్యత్‌లో వారికి ఎలాంటి అవకాశాలు రావు.

ద్వివేదీ, గిరిజాశంకర్‌లను అభిశంసస్తూ… ఎస్‌ఈసీ సర్వీస్ రికార్డుల్లో నమోదు చేయించిన వివరాలు చిన్నవి కావు. సివిల్ సర్వీస్ అధికారి హోదాలో ఉండి.. భారత ప్రజస్వామ్యాన్ని బలహీనం చేసేలా…ఉద్దేశపూర్వకంగా ఓటర్ల జాబితాను ప్రచురించలేదని ఆయన చెబుతున్నారు. దీన్ని ఎవరూ తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. 

తప్పుడు పనులు చేయించి.. తాము అండగా ఉన్నామని.. ఎన్నికలైపోయిన తర్వాత ఎస్‌ఈసీ నిర్ణయాలను సమీక్షిస్తామని… మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స అధికారులకు హామీ ఇస్తున్నారు. కానీ.. వారికి తెలియని విషయం ఏమిటంటే.. రాజ్యాంగ వ్యవస్థలు చేసిన నిర్ణయాలను వారు ఎప్పటికీ సమీక్షించలేరు. ఎస్‌ఈసీ తీసుకున్న అభిశంసన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడం సాధ్యం కాదు. తర్వాత ప్రభుత్వం నియమించే ఎస్‌ఈసీ కూడా ఉపసంహరించుకోలేరు. న్యాయస్థానాలు ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటే వాటిని అమలు చేయాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందేమో కానీ.. చర్యలు మాత్రం ఖాయం. కానీ మంత్రులు ఇలాంటి ప్రకటనల ద్వారా ఐఏఎస్ అధికారుల ద్వారా లేని పోని లబ్దిని రాజకీయంగా పొంది.. వారిని బలిపశువులు చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా స్పష్టంగానే తెలుస్తోంది.

Read more at telugu360.com: పాపం ఆఫీసర్స్..! నాడు కేసులు.. ఇప్పుడు అంతకంటే..! - https://www.telugu360.com/te/ap-civil-service-officers-worry/

Link to comment
Share on other sites

*అమరావతి:*

ఐఎఎస్ అధికారులు గిరిజా శంకర్, గోపాల కృష్ణ ద్వివేదిల పై జారీ చేసిన సెన్సుర్ ప్రొసీడింగ్స్ ను తిప్పి ఎస్ ఈసీకి పంపిన ప్రభుత్వం

ఐఎఎస్ లపై ప్రొసీడింగ్స్ ను జారీ చేసే అధికారం ఎస్ ఈసీకి లేదన్న సీఎస్ షేఫి

అధికారుల నుంచి వివరణ కోరేలా నోటీసు కూడా జారీ చేయకుండా సెన్సూర్ ప్రొసీడింగ్స్ ను ఎవరూ జారీ చేయలేరని పేర్కొన్న ప్రభుత్వం

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ ప్రొసీడింగ్స్ జారీ చేసిన ఎస్ఈసీ

సర్వీసు రికార్డుల్లో రిమార్కులు నమోదు చేయాలని ఎస్ఈసీ ఆదేశాలు

కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు సెన్సూర్ ప్రొసీడింగ్స్ పంపిన ఎస్ఈసీ

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...