Jump to content

హెరిటేజ్ టచ్ యాప్ ఆవిష్కరణ


OneAndOnlyMKC

Recommended Posts

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ అర్ధాంగి, హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ఆన్ లైన్ లో సరికొత్త యాప్ ను తీసుకువచ్చారు. ఈ యాప్ పేరు హెరిటేజ్ టచ్. తన అత్తగారైన నారా భువనేశ్వరితో కలిసి బ్రాహ్మణి ఇవాళ హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో యాప్ ను ఆవిష్కరించారు.

ఈ యాప్ సాయంతో వినియోగదారులు ఆన్ లైన్ లోనే హెరిటేజ్ పాలు, పాల పదార్థాలు కొనుగోలు చేయవచ్చు. కరోనా నేపథ్యంలో ప్రజల దృష్టి వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవడంపైకి మళ్లిన క్రమంలో, హెరిటేజ్ ఫుడ్స్ తులసి, పసుపు, అల్లం కలయికతో రోగ నిరోధకశక్తిని పెంచే పాలను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

యాప్ ను లాంచ్ చేసిన సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ, వినియోగదారులకు ఉపయుక్తంగా ఉండేలా హెరిటేజ్ టచ్ యాప్ తీసుకురావడం ఎంతో ఆనందం కలిగిస్తోందన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ ఎప్పుడూ వినియోగదారుల ఆరోగ్యం, సంతోషాన్నే కోరుకుంటుందని తెలిపారు. ఇమ్యూనిటీ పెంచే పాల ఉత్పత్తుల తయారీలో కొత్త మార్గాలను అన్వేషిస్తున్నామని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...