rajanani Posted March 18, 2020 Share Posted March 18, 2020 ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను కొనసాగించాలని, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది రాష్ట్ర ఎన్నికల సంఘానిదే తుదినిర్ణయమని స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎన్నిక కోడ్ ఎత్తివేయాలని సూచించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఇప్పటికే అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను కొనసాగించేందుకు అనుమతిచ్చిన ధర్మాసనం..కొత్త పథకాలు, ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలు చేపట్టరాదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఆరువారాల తర్వాత కరోనా పరిస్థితిని అంచనావేసి, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ పిటిషన్పై విచారణ ముగించింది. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.