Jump to content

Who is Andhra CM?


RKumar

Recommended Posts

బ్రేకింగ్: చంద్రబాబుకు కేంద్ర మంత్రి లేఖ

02152020212251n10.jpg

 

అమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రి జైశంకర్‌ లేఖ రాశారు. చైనా వూహాన్‌లో ఉన్న అన్నెం జ్యోతి, టి.సత్యసాయి కృష్ణను స్వదేశానికి తీసుకురావాలని జైశంకర్‌కు చంద్రబాబు లేఖ రాశారు. ఇందుకు స్పందించిన కేంద్ర మంత్రి.. జ్యోతి, సత్యసాయి ఆరోగ్య పరిస్థితిపై కేంద్రం, బీజింగ్‌లోని భారత రాయబార అధికారులు తెలుసుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇద్దరికి తీవ్రమైన జ్వరం ఉందని అధికారులు తెలిపారన్నారు.

 

జ్యోతి, సాయికృష్ణ, కుటుంబసభ్యులు, వూహాన్‌లో ఉన్న వైద్యులతో ఎంబసీ అధికారులు టచ్‌లో ఉన్నారని లేఖలో తెలిపారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులకు సూచించామన్నారు.  జ్యోతి, సత్యసాయి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేస్తూ ఉంటామని చంద్రబాబుకు రాసిన లేఖలో జైశంకర్‌ వివరించారు.

02152020214303n76.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...