koushik_k Posted January 28, 2020 Share Posted January 28, 2020 క్యాబినెట్లో తీర్మానం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కడప(ఆంధ్రజ్యోతి): టీడీపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి గత ప్రభుత్వం కేటాయించిన భూ కేటాయింపును రద్దు చేస్తూ సోమవారం సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని కడప - కర్నూలు జాతీయ రహదారిలోని జాతీయ రహదారుల కార్యాలయం ఆవరణలో ఉన్న స్థలాన్ని టీడీపీ కార్యాలయ నిర్మాణానికి ఇవ్వాల్సిందిగా జిల్లా పార్టీ దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు అప్పటి ప్రభుత్వం ఆర్అండ్బీకి చెందిన అక్కాయపల్లె సర్వేనెంబరు 37/4లో ఉన్న రెండు ఎకరాల స్థలాన్ని పార్టీ కార్యాలయ నిర్మాణానికి కేటాయిస్తూ 33 ఏళ్ల పాటు లీజుకు ఇస్తూ 2019 జనవరి 24న జీవోఎంఎస్ నెంబరు 56ను జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లుగా సంవత్సరానికి రూ.వెయ్యి వంతు లీజు చెల్లించాలని మూడేళ్లలోపు నిర్మాణాలను చేపట్టాలంటూ పొజిషన్ ఇచ్చారు. రెండేళ్ల లీజును టీడీపీ నేతలు చెల్లించారు. అయితే ఆ స్థలాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం దుర్మార్గం: శ్రీనివాసరెడ్డి పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని సీఎం జగన్ సర్కారు రద్దు చేయడాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తప్పుబట్టారు. ఇది దుర్మార్గ ప్రభుత్వమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ అన్ని పార్టీల కార్యాలయాల నిర్మాణాలకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం 33 ఏళ్ల లీజుతో స్థలాలు కేటాయించిందన్నారు. ఇందులో భాగంగానే టీడీపీకి కూడా కేటాయించిందన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కడపలో కాంగ్రెస్ పార్టీకి స్థలం కేటాయించారని, ఇప్పుడు జగన్ సర్కారు కేటాయించిన స్థలాలను రద్దు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధానినే మార్చే వారికి స్థలాల రద్దు చేయడం పెద్ద విషయం కాదన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామన్నారు. Link to comment Share on other sites More sharing options...
Uravakonda Posted January 28, 2020 Share Posted January 28, 2020 Kadapa lo manaku party office endhuku? Akkarledhu saami. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.