kurnool NTR Posted January 25, 2020 Share Posted January 25, 2020 ఆకర్షణీయ నగరాల పోటీలో.. వినూత్న ఆలోచనగా విశాఖలోని తేలియాడే సౌర ప్లాంటు ఎంపిక ఉత్తమ స్మార్ట్ సిటీగా సూరత్ ఈనాడు, విశాఖపట్నం: జాతీయస్థాయి ఆకర్షణీయ నగరాల పోటీలో విశాఖకు రెండు, అమరావతికి ఒక అవార్డు దక్కింది. విశాఖ నగరంలోని ఓ హోటల్ లో శుక్రవారం ప్రారంభమైన స్మార్ట్ సిటీ నగరాల సమావేశాల్లో.. ఆకర్షణీయ ప్రాజెక్టు పనుల్లో పురోగతి, పనితీరు ఆధారంగా అమరావతి (సీఆర్ డీఏ) కమిషనర్ , స్మార్ట్ అమరావతి సీఈవో లక్ష్మీనరసింహం, విశాఖ జీవీఎంసీ కమిషనర్ సృజనలకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా, సంయుక్త కార్యదర్శి కునాల్ కుమార్ అవార్డుల్ని అందించారు. దేశంలోనే తొలిసారిగా విశాఖలోని ముడసర్లోవ జలాశయంపై ఏర్పాటు చేసిన 2 మెగావాట్ల తేలియాడే సౌరవిద్యుత్తు ప్లాంటుకు ‘వినూత్న ఆలోచన అవార్డు’ దక్కింది. జాతీయస్థాయిలో ఉత్తమ స్మార్ట్ సిటీగా సూరత్ ఎంపికైంది. వడోదర, ఇండోర్ , పుణె, కోయంబత్తూరు, వెల్లూర్ , ఈరోడ్ , సాగర్ , రాజ్ కోట్ , రాంచీ, కాన్పుర్ , అహ్మదాబాద్ నగరాలకు ఒక్కో అవార్డు, సూరత్ కు మొత్తంగా 3 అవార్డులు దక్కాయి. ఇక 20-20 పథకం స్మార్ట్ సిటీ నగరాల పురోభివృద్ధిలో భాగంగా 20-20 పథకాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా తెలిపారు. ఉన్నతంగా ఉన్న 20 నగరాలతో పాటు అధ్వానంగా ఉన్న 20 నగరాలకు అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పారు. జాతీయస్థాయిలో నిర్వహించే అన్ని పోటీల్లోనూ, అన్ని విభాగాల్లోనూ స్మార్ట్ నగరాలన్నీ పాల్గొనాలని.. లేనిపక్షంలో చర్యలుంటాయని తెలిపారు. ప్లీనరీ సమావేశాల్లో భాగంగా వాతావరణం, డేటా పరంగా నగరాలు ఎలా అభివృద్ధి చెందాలి? పౌర జీవనానికి అనువుగా ఎలా తీర్చిదిద్దాలన్న దానిపై ప్రతినిధులు చర్చలు జరిపారు. సదస్సులో పురపాలకశాఖ కార్యదర్శి శ్యామలారావు తదితరులు పాల్గొన్నారు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.