Jump to content

రాజధాని పోరులో నేనూ పాల్గొంటా:నారా రోహిత్‌


kurnool NTR

Recommended Posts

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిదని సినీనటుడు నారా రోహిత్ అన్నారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో ఆయన పోస్ట్ చేశారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ జీవచ్ఛవంలా మారిందని.. అలాంటి రాష్ట్రానికి ప్రాణ సమానమైన భూములను త్యాగం చేసిన రైతులు అమరావతి రూపంలో ప్రాణం పోశారని కొనియాడారు. వారి ఔదార్యంతోనే అమరావతిలో పాలనకు బాటలు పడ్డాయన్నారు. రైతుల త్యాగం వృథాగా పోకుండా 23 రోజులుగా వారు చేస్తున్న న్యాయమైన పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ‘‘రైతుల ఉద్యమానికి సంకెళ్లు పడుతున్నా.. అలసిన గుండెలు మూగబోతున్నా.. మొక్కవోని దీక్షతో రైతులు ముందడుగు వేస్తున్నారు. వారి పోరాటం వృథా కాదు. త్వరలోనే రైతులతో కలిసి పోరాటంలో పాలు పంచుకుంటాను’’ అని నారా రోహిత్ ఫేస్ బుక్ లో పేర్కొన్నారు.

Only man from Telugu film industry. Most of the Telugu heroes are trapped in an image and they are afraid to make any statements. Of course they only have to worry about movies but not politics. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...