Jump to content

జీఎస్‌టీ పెరగనుందా..?


KING007

Recommended Posts

జీఎస్‌టీ పెరగనుందా..?

జీఎస్‌టీ పెరగనుందా..?

దిల్లీ: రెవెన్యూ లోటుతో సతమతమవుతున్న కేంద్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేందుకు మార్గాలు అన్వేషిస్తున్నట్లు కన్పిస్తోంది. ఇందులో భాగంగానే జీఎస్‌టీని పునర్‌వ్యవస్థీకరించి పన్ను రేటును పెంచాలనే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతమున్న 5శాతం శ్లాబును 6శాతానికి పెంచే అవకాశమున్నట్లు కొన్ని జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. 

2017 జులై 1న జీఎస్‌టీని అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం వస్తువుల, సేవలపై 5, 12, 18, 28శాతం.. ఇలా నాలుగు శ్లాబుల్లో పన్నులు విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశాల్లో 28శాతం శ్లాబులో ఉన్న చాలా వస్తువులపై పన్ను తగ్గించి వాటిని  కింది శ్లాబుల్లోకి మార్చారు. ప్రస్తుతం నిత్యావసరాలకు సంబంధించిన చాలా వస్తువులు 5శాతం శ్లాబులోనే ఉన్నాయి. జీఎస్‌టీ వసూళ్లలో దాదాపు 5శాతం ఆదాయం ఈ శ్లాబు ద్వారానే వస్తోంది. 

అయితే పన్ను తగ్గింపు కారణంగా ఇటీవల జీఎస్‌టీ వసూళ్లు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో రెవెన్యూను పెంచుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ నెల 18న జరిగే జీఎస్‌టీ ప్యానల్‌ సమావేశంలో వసూళ్లను పెంచుకునేందుకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జీఎస్‌టీ శ్లాబు రేటు పెంపు చర్చకు వచ్చే అవకాశముంది. ప్రస్తుతమున్న 5శాతం శ్లాబును 6శాతానికి పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇలా పెంచితే ప్రభుత్వానికి నెలకు రూ. 1000 కోట్ల అదనపు ఆదాయం రానుంది. 

గత కొన్ని నెలలుగా తగ్గుతూ వస్తున్న జీఎస్టీ వసూళ్లు నవంబరులో మాత్రం కాస్త పెరిగాయి. గత నెలలో వసూళ్లు రూ. లక్ష కోట్లు దాటి రూ. 1.03లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...