Jump to content

Cbn convoy meeda stones


Siddhugwotham

Recommended Posts

శంకుస్థాపన స్థలం వద్ద ప్రణమిల్లిన బాబు 

శంకుస్థాపన స్థలం వద్ద ప్రణమిల్లిన బాబు

గుంటూరు: ఏపీ రాజధాని అమరావతి పర్యటనలో ఉన్న చంద్రబాబు..ఉద్దండరాయుడిపాలెం వద్ద గతంలో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. స్థానిక రైతులు, మహిళలు పూలు జల్లుతూ ఆయనకు స్వాగతం పలికారు. ప్రపంచం గర్వించే రాజధాని నిర్మాణం కొనసాగించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. రాజధాని నిర్మాణం ఆపడం అంటే.. 33వేల ఎకరాల భూమిని త్యాగం చేసిన రైతులను అవమానించడమే అని వారు పేర్కొన్నారు. అనంతరం వారందరితో కలిసి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశానికి వెళ్లి.. అక్కడ చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు. 

ఈ పర్యటన అందుకే: బాబు

5 కోట్ల ఆంధ్రుల కోసం చేపట్టిన రాజధాని నిర్మాణాన్ని కుట్రపూరితంగానే వైకాపా సర్కారు నిలిపివేసిందని చంద్రబాబు ఆరోపించారు. వైకాపా దురుద్దేశం తప్ప.. ఇక్కడ పనులు ఆపడానికి కారణాలేమీ కనిపించడం లేదన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన కట్టడాలను అర్ధాంతరంగా ఎలా ఆపివేశారో?దీనిపై వైకాపా కుట్రలేంటో చాటేందుకే అమరావతిలో పర్యటిస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

అ'హల్య

'మ'నిషిగా మారడానికి

'రా'యిలా వేచి

'వ'నవాసంలో రాముడి కాలు తగిలి

'తి'రిగి అహల్య అయినట్టు

అమరావతి అమరావతిగానే మారుతుంది

అది నాయుడి రాకకోసం వేచి చూస్తుంది. అమరావతి నుండి దొంగలా వచ్చిన ఇంద్రుడి నిందతో శాశ్వతంగా అహల్య రాయిగానే పడివుండలేదు.
from Twitter 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...