Jump to content

సమీకరణాలు మార్చిన ‘కారు’ ప్రయాణం


koushik_k

Recommended Posts

అక్టోబరు 24... మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెల్లడైన వేళ... ఆ రోజు సాయంత్రం ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ నిశ్శబ్దంగా బయటికొచ్చి ఓ ప్రాంతానికి బయలుదేరారు. కారులో ఆయన సెక్యూరిటీ సిబ్బంది గానీ, కార్యదర్శి గానీ లేరు. కేవలం డ్రైవరు, పవార్‌ మాత్రమే ఉన్నారు. కారు కొంత దూరం వెళ్లాక.. శివసేన ఎంపీ, సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు. ఆయనను వెంటనే పవార్‌ తన కారులో ఎక్కించుకుని డ్రైవర్‌ను పోనివ్వమన్నారు. దాదాపు 45 నిమిషాల సేపు కార్లోనే పవార్‌, రౌత్‌ మంత్రాంగం సాగింది. కారు ఎక్కడా ఆగలేదు. ఏ గమ్యానికీ చేరలేదు. ఆ తరువాత ఓ చోట రౌత్‌ను దింపేసి పవార్‌ వెళ్లిపోయారు. పవార్‌ కదలికలను ఎప్పటికప్పుడు పసికట్టే నిఘా యంత్రాంగాన్ని బీజేపీ ఏర్పాటుచేసినప్పటికీ ఈ మీటింగ్‌ జరుగుతుందని, ఇలా కార్లో కలుస్తారని ఊహించలేదు. కొన్ని రోజుల దాకా అసలు ఈ కారు ప్రయాణం సంగతి బీజేపీకి తెలియనే తెలియదు. ఫలితాలు వెల్లడైన వెంటనే- అంటే 24వ తేదీ మధ్యాహ్నమే ఉద్ధవ్‌ ఠాక్రే 50:50 ఫార్ములాను వినిపించడం మొదలెట్టిన సంగతి తెలిసిందే! రౌత్‌ను పిలిపించుకుని పవార్‌ రాజకీయం నడిపారు. ఒకవేళ బీజేపీ మంకుపట్టు పడితే ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ బాసటగా నిలుస్తాయని ఆనాడే ఆయన రౌత్‌కు హామీ ఇచ్చినట్లు వెల్లడవుతోంది. ఈ చాణక్యం ద్వారా అమిత్‌ షా మంత్రాంగాన్ని పవార్‌ నిర్వీర్యం చేసేశారు.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...