Jump to content

తెలుగు అప్పుడే సచ్చిపోయేది


Cyclist

Recommended Posts

తెలుగు అప్పుడే సచ్చిపోయేది 

ఉప్పుకప్పురంబు పద్యం తెలియని తెలుగు వాడు లేడు. అలాంటి పద్యాలు వేమన లాంటి మహా కవులు తాటాకుల మీద వ్రాసినా… చెదలు పట్టేవి. విజయనగర సామ్రాజ్య పతనం తరువాత, తమిళ రాజుల ప్రాభల్యంలో, తెలుగు ప్రాభవాన్ని కోల్పోయింది.

వసు చరిత్ర, మను చరిత్ర, వేమన శతకము లాంటివి మనకు ఈరోజు పుస్తకాలలో అందుతున్నాయి అంటే, సరిగ్గా రెండు వందల ఏళ్లకు ముందు, కడప కలెక్టర్ కు ఒక మహానుభావుడు అసిస్టెంట్ గా రాబట్టే.

ఆయన 30 ఏళ్లు చేసిన కృషి, అంతవరకు తెలుగు పరిశోధకులు, పాలకులు & పండితుల కంటే ఎక్కువ. ఎక్కడ మనుషులు పద్యాలు చెబుతుంటే అక్కడ వ్రాసుకొని మనకు అందించిన ఒక పండితుడు. ఆంగ్లేయుడైన సి పి బ్రౌన్. ఆయన లేకుంటే తెలుగు అప్పుడే సచ్చిపోయేది.

ఇప్పుడు అదే కడపలో పుట్టిన తెలుగు బిడ్డలకు తెలుగును చంపే అవకాశం వచ్చేది కాదు. #చాకిరేవు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...