RamaSiddhu J Posted August 13, 2019 Share Posted August 13, 2019 హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు టెండర్ల రద్దుపై పోలవరం అథారిటీ స్పందించింది. హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్ సమీపంలోని ఏసీ గార్డ్స్లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ జరిగిన అత్యవసర సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. సమావేశం అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఛైర్మన్ ఆర్.కె.జైన్ మీడియాతో మాట్లాడారు. రివర్స్ టెండరింగ్తో ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని.. నిర్మాణంలో జాప్యం జరిగే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. పోలవరం గుత్తేదారు పనితీరు సంతృప్తికరంగా ఉందని చెప్పారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఎంత వ్యయం పెరుగుతుందనేది ఇప్పుడే అంచనా వేయలేమని జైన్ తెలిపారు. సుమారు ఐదు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా పోలవరం టెండర్ల రద్దుపై చర్చ జరిగింది. ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణం ఎలా కొనసాగింది? ఆర్ అండ్ ఆర్ అమలు తీరు.. తదితర అంశాలపై సమీక్షించారు. పనులు ఆపేయాలంటూ గుత్తేదారుకు ఏపీ ప్రభుత్వం నోటీసు ఇవ్వడం.. రివర్స్ టెండరింగ్కు వెళ్లడంలో ఉండే లాభనష్టాలపై సుదీర్ఘంగా చర్చించారు. పోలవరం ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక అందించాలని నీటి పారుదల శాఖ అధికారులను అథారిటీ ఆదేశించింది. ఈ సమావేశానికి కేంద్ర జల సంఘం అధికారులు, ఏపీ నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. Tags : Polavaram PPA Ap News Link to comment Share on other sites More sharing options...
surendra.g Posted August 13, 2019 Share Posted August 13, 2019 Is center going to reinforce navayuga to Polavaram? Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.