goldenstar Posted August 7, 2019 Share Posted August 7, 2019 సైబర్ చౌర్యం సొమ్ముతో ఆయుధాలు ఐరాస నివేదిక ఇంటర్నెట్డెస్క్: ఉత్తర కొరియా ఆయుధాల తయారీ వెనుక ఉన్న ఆర్థిక శక్తిని ఐరాస గుర్తించింది. ఆంక్షలు ఉన్నా విదేశీ కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయో తెలుసుకొని నోరెళ్లబెట్టింది. ఆ దేశ హ్యాకింగ్ నిపుణులు సైబర్ దాడులకు తెగబడి కొల్లగొట్టిన సొమ్మును ఆయుధాల ముడిపదార్థాల కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపులు చేసేందుకు ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది. ఐరాస మొత్తం 35 సైబర్ దాడులను పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించినట్లు ఓ ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. సైబర్ దాడులు చేసి దోచుకున్న మొత్తం 2 బిలియన్ డాలర్లను (దాదాపు రూ.14వేల కోట్ల)ను ఆయుధ అభివృద్ధి కార్యక్రమానికి వెచ్చించింది. ఈ మేరకు ఓ నివేదిక ఐరాస ఆంక్షల కమిటీకి చేరింది. ముఖ్యంగా ఆర్థిక సేవలు అందించే సంస్థలను, క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజిలను లక్ష్యంగా చేసుకొని ఉ.కొరియా సైబర్ నేరగాళ్లు దాడులకు తెగబడుతున్నట్లు పేర్కొంది. దీంతో పాటు అత్యంత శక్తివంతమైన కంప్యూటర్లను వినియోగించి సైబర్ మైనింగ్ నిర్వహించి వర్చువల్ కరెన్సీలను కూడా ఉ.కొరియా నిపుణులు సృష్టించి విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదిస్తున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీలపై సొమ్ము ఎటు వెళుతోందో గుర్తించలేకపోవడం, ప్రభుత్వ నియంత్రణ తక్కువగా ఉండటంతో వీటిని లక్ష్యంగా చేసుకొంది. ఈ నివేదికపై అమెరికా ప్రతినిధి మాట్లాడుతూ.. సభ్య దేశాలు ఉ.కొరియా సైబర్ దాడులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 2006లో తొలిసారి ఉత్తరకొరియాపై ఐరాస భద్రతా మండలి ఆంక్షలను విధించింది. వీటి ప్రకారం ఆ దేశం నుంచి బొగ్గు, ఇనుము, దుస్తులు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతిని నిషేధించింది. అదే సమయంలో పెట్రోలియం, ముడి చమురు దిగుమతులపై కూడా ఆంక్షలను విధించింది. రెండు వారాల వ్యవధిలో ఉత్తర కొరియా నాలుగు క్షిపణి పరీక్షలను నిర్వహించడంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖండాంతర క్షిపణులను పరీక్షంచనని కిమ్ హనోయ్ సమావేశం సందర్భంగా వెల్లడించారు. కానీ, ఆ తర్వాత నుంచి క్షిపణి పరీక్షలను మాములుగానే నిర్వహిస్తున్నారు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.