goldenstar Posted July 23, 2019 Share Posted July 23, 2019 హైదరాబాద్, హిమాయత్నగర్, (ఆంధ్రజ్యోతి): కేసుల దర్యాప్తులో ఉత్తమ పనితీరును కనబరుస్తున్న నారాయణగూడ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గురునాథ్ను రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి నగదు రివార్డుతో అభినందించారు. గత శనివారం నారాయణగూడ పీఎస్ ను విజిట్ చేసిన డీజీపీ స్టేషన్లో నమోదైన కేసులు, సెక్టార్లలో ఎస్ఐల పనితీరు, కేసుల దర్యాప్తు తదితర అంశాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్ఐలతో నేరుగా మాట్లాడారు. ఫిర్యాదుదారులతో వారు మాట్లాడే విధానం, కేసును దర్యాప్తు చేస్తున్న తీరుతెన్నులను ప్రశ్నించారు. ఈ సందర్భంలో గురునాథ్ పనితీరు, ఫిర్యాదులను అవగాహన చేసుకుంటున్న వైనం డీజీపీని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం డీజీపీ కార్యాలయానికి ఎస్ఐ గురునాథ్ను పిలిపించారు. ఆయనను అభినందించిన డీజీపీ రూ.వెయ్యి నగదు రివార్డును అందజేశారు. ఇదే పనితీరును కొనసాగించాలని సూచించారు. నగర సీపీ అంజనీకుమార్, సెంట్రల్జోన్ డీసీపీ విశ్వప్రసాద్, ఏసీపీ బిక్షంరెడ్డి, నారాయణగూడ సీఐ రమే్షకుమార్, సహచర ఎస్ఐలు కూడా రఘునాథ్కు శుభాకాంక్షలు చెప్పారు. Link to comment Share on other sites More sharing options...
akhil ch Posted July 23, 2019 Share Posted July 23, 2019 aadini ma kadapa pampinchi who killed babayi case appaginchachhu ga Link to comment Share on other sites More sharing options...
rajanani Posted July 23, 2019 Share Posted July 23, 2019 రూ.వెయ్యి నగదు very good Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.