Jump to content

Fidel Front ki Avamanam


Recommended Posts

మోడీ, అమిత్ షా ప్లాన్ ప్రకారం, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ మూడు నెలల క్రిందట హడావిడి చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భగంగా, చంద్రబాబు దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేసే కార్యక్రమాన్ని భగ్నం చేసే ప్లాన్ వేసారు. దీని కోసం కేసీఆర్ రంగంలోకి దిగి మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, నవీన్ పట్నాయక్ ను కలిసి హడావిడ్ చేసారు. వాళ్ళని చంద్రబాబు వైపు వెళ్ళకుండా ప్లాన్ వేసారు. అయతే కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమిని ఓడించేందుకు ఎన్నికలకు ముందే ప్రజాకూటమిగా ఏర్పడాలనే నిర్ణయానికి 21 పార్టీలు వచ్చాయి, ఎన్నికల్లో పోరాడుతున్నాయి. ఇప్పుడు 23న ఫలితాలు వస్తున్న తరుణంలో, మళ్ళీ కేసీఆర్ ను ఆక్టివేట్ చేసారు మోడీ, షా. విపక్షాల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేసారు.

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మరో రెండు దశల పోలింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో ఈ టాస్క్ పూర్తి చెయ్యటానికి స్పీడ్ పెంచిన కేసీఆర్ రాష్ట్రాల బాట పట్టారు. సోమవారం నాడు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటీ అయిన కూటమిపై నిశితంగా చర్చించారు. అయితే ఈనెల 13న కాంగ్రెస్‌తో కలసి పని చేస్తున్న డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ కావాలని ఫిక్స్ అయ్యారు. అంతేకాదు స్టాలిన్‌కు ఫోన్ భేటీ గురించి కేసీఆర్ ఇప్పటికే మాట్లాడారు. అయితే కేసీఆర్‌తో స్టాలిన్ సమావేశం జరగకపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ బిజీగా ఉండటంతో కేసీఆర్‌, స్టాలిన్‌ భేటీపై అనుమానమేనని తెలుస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ వేస్తున్న కుప్పిగంతులు చూస్తున్న స్టాలిన్, ఈ తరుణంలో కేసీఆర్ తో భేటీకి విముఖత చూపించారు.

 

ఇదిలా ఉంటే.. సీఎం కేసీఆర్‌తో సోమవారం జరిగిన భేటీలో ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించామని అంతే తప్ప ప్రధాని అభ్యర్థిపై చర్చ జరగలేదలేదని కేరళ సీఎం పినరయి విజయన్‌ మీడియాకు వివరించారు. కేసీఆర్‌తో చాలా ప్రాముఖ్యతగల సమావేశం జరిగిందన్నారు. కాగా.. కేరళ పర్యటనలో భాగంగా ప్రఖ్యాత అనంతపద్మనాభ స్వామి దేవాలయాన్ని కేసీఆర్‌ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనతో ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం ఆయన విజయన్‌ అధికార నివాసానికి వెళ్లి ఫెడరల్‌ ఫ్రంట్‌‌పై చర్చించారు. ఇప్పుడు తమిళనాడు వెళ్దాం అనుకుంటే, అక్కడ స్టాలిన్ షాక్ ఇచ్చారు.

Link to comment
Share on other sites

already dmk is part of UPA.. kalisi contest chesaaru.. stalin tho meeting enti raa kachara naayaala.. thupuk.. NDA allies shivasena, JDU vaallani kaluvu poyi dammuntey.. veedu politics lo ethics gurinchi cbn ni comment cheyyatam.. lol  

Link to comment
Share on other sites

13 minutes ago, Narendra1 said:

already dmk is part of UPA.. kalisi contest chesaaru.. stalin tho meeting enti raa kachara naayaala.. thupuk.. NDA allies shivasena, JDU vaallani kaluvu poyi dammuntey.. veedu politics lo ethics gurinchi cbn ni comment cheyyatam.. lol  

 

Link to comment
Share on other sites

తమ పార్టీ సియంను కలిసిన తరువాత, కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీపీఐ...

 

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌వి అవకాశవాద రాజకీయాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నాను. కేసీఆర్ వైఖరిపై తమకు ఉండే అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతిచ్చే విషయంలో ఇప్పుడేమీ చెప్పలేమని వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత హంగ్ పార్లమెంట్ ఏర్పడే అవకాశం ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. ఫలితాల అనంతరం తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తామని సురవరం చెప్పారు. కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతిచ్చే అంశంపై ఢిల్లీలో మంగళవారం ఎన్టీవీ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ సురవరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

కేసీఆర్, పినరయి విజయన్ భేటీని కేవలం సీఎంల సమావేశంగానే చూస్తామని చెప్పారు. విజయన్ సీపీఐ పొలిట్‌బ్యూరో సభ్యుడు మాత్రమేనని.. ఆయన స్థాయిలో విధానపరమైన నిర్ణయాలు ఉండవని స్పష్టం చేశారు. అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి జాతీయ స్థాయి నాయకత్వం ఉందని చెప్పారు. ‘కేసీఆర్‌పై మా అనుమానాలు మాకున్నాయి. కేసీఆర్ ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటారు. అవసరాన్ని బట్టి తృతీయ కూటమికి కూడా కేసీఆర్ మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ మెజార్టీ రానప్పుడు.. మూడో ప్రత్యామ్నాయానికి అవకాశం ఉంది’ అని సురవరం చెప్పారు.

 

దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తే బీజేపీపై తీవ్రమైన అసంతృప్తి ఉందని సురవరం తెలిపారు. ఈ అసంతృప్తిని పోగు చేయడంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ విఫలమైందన్నారు. ‘కాంగ్రెస్ పెద్ద పార్టీ. కానీ, రాజకీయ చొరవ లేదు. సెక్యులర్ శక్తులను ఏకం చేయడంలో విఫలమైంది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజార్టీ రాదు. హంగ్ పార్లమెంట్ ఏర్పడుతుందని భావిస్తున్నాం’ అని సురవరం అన్నారు. ఇప్పటికీ కెసిఆర్ పై మాకు చాలా అనుమానాలున్నాయన్నారు. కేరళ సీఎం విజయన్ పొలిట్ బ్యూరో సభ్యుడైనా ఆయన స్థాయిలో విధానపరమైన నిర్ణయాలు ఉండవన్నారు. కెసిఆర్ అవసరాన్ని భట్టి ఎప్పటికప్పుడు నిర్ణయాలను మార్చుకుంటారని, రేపు అవసరాన్ని భట్టి కెసిఆర్ తృతీయ కూటమికి మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...