Husker Posted March 26, 2019 Share Posted March 26, 2019 భీమవరం: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్ను తీసుకొనేందుకు రిటర్నింగ్ అధికారి నిరాకరించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసేందుకు ఆయన ఆలస్యంగా రావడంతో నామ పత్రాలు తీసుకోలేదు. ఈ సందర్భంగా పాల్ మీడియాతో మాట్లాడుతూ.. నామినేషన్ వేసేందుకు వచ్చిన తనను అక్కడి అధికారులు సమయం లేదంటూ అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తరఫున ఓ ప్రతినిధి పూర్తి పత్రాలతో మధ్యాహ్నం 2.40 గంటలకు ఎన్నికల అధికారుల వద్దకు వెళ్లాడన్నారు. అనంతరం కొద్దిసేపటికే తాను అక్కడికి చేరుకున్నప్పటికీ సమయం అయిపోయిందంటూ తన నామినేషన్ను తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్తానని పాల్ చెప్పారు. తాను నామినేషన్ వేయకుండా వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారని ఆరోపించారు. తాను భీమవరంలో పోటీ చేస్తున్నానంటే పవన్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. నర్సాపురం పార్లమెంటు స్థానంలో విజయం సాధించిన ఏడాది కాలంలో నర్సాపురాన్ని నార్త్ అమెరికాలా మార్చేస్తాన్నారు. అధునాతన వైద్యంతో కూడిన వసతులు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. నర్సాపురంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. తన పార్టీ గుర్తు హెలికాప్టర్ కావడంతో తుప్పు పట్టిన ఫ్యాన్కు ఓట్లు పడవని వ్యాఖ్యానించారు. inni rojulu hadavidi chesi nomination kuda leda aakariki Link to comment Share on other sites More sharing options...
navalluri Posted March 26, 2019 Share Posted March 26, 2019 No need to see movie comedy scenes just if u see his videos we will fell down laughing ? Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.