Jump to content

పార్టీ మారితే ‘కేసు’ క్లోజ్‌!


Recommended Posts

పార్టీ మారితే ‘కేసు’ క్లోజ్‌!
22-03-2019 03:02:55
 
ఇటీవలిదాకా టీడీపీలో చురుగ్గా ఉన్న ఒక నాయకుడికి పలు విద్యా సంస్థలు ఉన్నాయి. హైదరాబాద్‌ చుట్టుపక్కల కూడా విద్యా సంస్థలు ఉన్నాయి. అందులో ఫీజు రీ ఎంబర్స్‌మెంట్‌కు సంబంధించిన కుంభకోణం చోటు చేసుకొందని ఫిర్యాదులు వచ్చాయి. విద్యార్థులు లేకుండానే ఉన్నట్లుగా చూపి ప్రభుత్వం నుంచి ఫీజు సొమ్ము రాబట్టారన్నది ఈ ఆరోపణల సారాంశం. పైగా ప్రభుత్వం నుంచి నిధులు రాలేదంటూ విద్యార్థుల నుంచి అదనంగా ఫీజులు వసూలు చేశారన్నది మరో ఆరోపణ! ఉమ్మడి రాష్ట్రంలో ఈ వ్యవహారం జరిగింది. అప్పటికి ఆ నాయకుడు టీడీపీలో లేరు. మరో పార్టీలో ఉన్నారు. ఆ ఫిర్యాదులపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు జరిపారు.
 
రూ.35 కోట్ల వరకూ అవినీతి జరిగిందని ప్రాఽథమికంగా తేల్చారు. లోతుల్లోకి వెళితే కేసు తీవ్రత చాలా ఉండేదని అంటున్నారు. ఈలోపు ఎన్నికలు వచ్చాయి. ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో విచారణ పెండింగ్‌లో పడింది. ఆ తర్వాత ఏపీ ఎన్నికలు వచ్చాయి. ‘గిఫ్ట్‌ - రిటర్న్‌ గిఫ్ట్‌’ ప్రక్రియ మొదలైంది. ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ స్కామ్‌ ఎదుర్కొంటున్న... టీడీపీ నేత ఉన్నట్టుండి వైసీపీలో చేరిపోయారు. ఆయనకు టికెట్‌ కూడా వచ్చింది. తెలంగాణలో విచారణలో ఉన్న కేసు మరింత ముందుకు కదలకుండా ఆపేయాలని నిర్ణయించారని, పార్టీ మార్పిడి ఫలితమే ఈ బహుమతి అని కొందరు నాయకులు చెబుతున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...