Jump to content

మహేశ్‌బాబుకు మరో షాక్‌ ఏఎంబీ థియేటర్‌కు నోటీసులు


sonykongara

Recommended Posts

మహేశ్‌బాబుకు మరో షాక్‌

ఏఎంబీ థియేటర్‌కు నోటీసులు

20brk-mahesh.jpg

హైదరాబాద్‌: సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు మరోసారి జీఎస్టీ అధికారులు షాక్‌ ఇచ్చారు. ఆయనకు చెందిన ఏఎంబీ సినిమాస్‌ థియేటర్‌లో ప్రేక్షకుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి కొత్త అమల్లోకి వచ్చిన జీఎస్టీ నిబంధనలు ఏఎంబీ మాల్‌ అతిక్రమించిందని వార్తలు వెలువడుతున్నాయి. రూ.100 ఆ పైన టికెట్‌కు గతంలో 28 శాతం జీఎస్టీ ఉండగా.. జనవరి 1 నుంచి 18 శాతానికి, రూ.100 లోపు టికెట్‌పై 18 శాతాన్ని కాస్తా 12కు తగ్గించింది.

అయితే ఏఎంబీ మాల్‌ తగ్గించిన ధరలు అమలు చేయకుండా అక్రమంగా ప్రేక్షకుల నుంచి రూ.30 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దాంతో థియేటర్‌పై కేసు నమోదు చేసి, నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితమే బ్రాండ్ల నుంచి వస్తున్న పారితోషికాలపై పన్ను ఎగ్గొట్టారంటూ మహేశ్‌కు నోటీసులు అందాయి. ఆయన బ్యాంక్‌ ఖాతాలను కూడా సీజ్‌ చేశారు. తాజాగా వస్తున్న ఆరోపణలపై మహేశ్‌ స్పందించాల్సి ఉంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...