Jump to content

chirala


sonykongara

Recommended Posts

636856498120873801.jpg
అమరావతి: చీరాలలో రాజకీయం మారుతున్న దృష్ట్యా పార్టీ సీనియర్ నేత కరణం బలరాంను చీరాల వెళ్లాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రేపో మాపో టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నారన్న వార్తలు వెలువడుతున్న నేపధ్యంలో ఎమ్మెల్సీ కరణం బలరాంను చీరాలకు వెళ్లి పార్టీ పరిస్థితులను చక్కదిద్దాలని అధిష్టానం ఆదేశించింది. పోతుల సునీతను తీసుకెళ్లి చీరాలలో కార్యకర్తల సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. కాగా... మరికొద్దిసేపట్లో కరణం బలరాం చీరాలకు బయలుదేరనున్నారని సమాచారం.
Link to comment
Share on other sites

చీరాలలో మారుతున్న రాజకీయం.. రేపో మాపో వైసీపీలో చేరనున్న ఆమంచి
13-02-2019 09:58:06
 
636856487907404702.jpg
అమరావతి: చీరాలో రాజకీయం మారుతోంది. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రేపో మాపో వైసీపీలో చేరనున్నారని సమాచారం. గత వారం రోజుల క్రితం ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరనున్నారనే వార్తలు వెలువడడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతికి పిలిపించి మాట్లాడారు. చంద్రబాబుతో భేటీ తర్వాత ఆమంచి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఇంతటితో ఈ ఊహాగానాలకు చెక్ పడ్డట్లే అనుకున్న తరుణంలో బుధవారం ఉదయం నుంచి ఆమంచి వైసీపీలో చేరబోతున్నారన్న సమాచారం పొక్కింది. టీడీపీని వీడాలంటూ ఆమంచిని ఆయన అనుచరులు వత్తిడి తేవడంతో ఇక పార్టీ మారేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రేపో మాపో ఆయన వైసీపీలో చేరుతున్నారని సమాచారం.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...