Jump to content

మేడాకు పార్టీలో ఉండే అర్హత లేదు: చంద్రబాబు


koushik_k

Recommended Posts

కడప/అమరావతి: కార్యకర్తలను ఇబ్బంది పెట్టేవాళ్లకు పార్టీలో స్థానంలేదని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీలో ఉండడానికి రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అనర్హుడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేడా మల్లికార్జునరెడ్డిని ఎమ్మెల్యేను చేశాం..శాసనసభ విప్‌గా నియమించాం. మేడా తండ్రి ఐదేళ్లు పదవులు అనుభవించి..ఎన్నికలు సమీపించగానే వెళ్లిపోయారు. గెలుపోటములకు నేను బాధపడను. కుట్రలు, కుతంత్రాలకు భయపడేది లేదు. రాజంపేట కార్యకర్తలకు సోమిరెడ్డి, ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసులురెడ్డి అండగా ఉంటారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే. మధ్యలో వచ్చినవాళ్లు మధ్యలోనే పోతారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే శాశ్వతం, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా. రాజంపేటతో సహా కడప జిల్లాలో టీడీపీ విజయం తథ్యం. గండికోట, చిత్రావతి, పైడిపాలెంకు నీళ్లిచ్చాం. రాజంపేటకు సమర్ధుడైన ఇన్‌ఛార్జ్‌ని నియమిస్తాం.’ అని చంద్రబాబు చెప్పారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...