Jump to content

AP welfare schemes


Yaswanth526

Recommended Posts

  • Replies 332
  • Created
  • Last Reply
1 minute ago, sagarkurapati said:

Telangana lo 4000 per acre was huge success infact only thing that has changed fate of TRS manam kuda alochinchali similar scheme , local mlas/incharge tho ippinchali amount 

Bro... TG vallu 1lakh loan waiver chesthe AP lo 1.5L chesaru.. 50k extra is more than what TG is giving as 4k. we are deficit budget with more agri land.

Link to comment
Share on other sites

8 minutes ago, katti said:

That is a challenge for the govt.. day time is peak usage time... asalu manaki antha infra vundha?

Poyina saari same exact reason (network cannot handle, transformers peli potaayi etc) cheppi vaayida vesaru

T lo 24 hrs istunna kooda malli ade reason cheptaru antaaraa? Chebite navvula palu avvadam tappite emi undadu

Link to comment
Share on other sites

Division tarvata mana network meeda spend cheyyadaniki money untunnayi

Farmers ki chala chotla subsidy meeda capacitors ichharu

Farm feeders meeda high capacity capacitors annadi eppudu choodaledu before 2016. Networks have become much more stable now

Link to comment
Share on other sites

వరాల సంక్రాంతి

 

సంక్షేమ ఫలాల మూట విప్పుతున్న ప్రభుత్వం
  ఈ నెల నుంచే 2వేల పింఛను
  సాగుకు 9 గంటల విద్యుత్తు
  రేషన్‌ డీలర్లకు కమీషన్‌ పెంపు
  రజకులకు పింఛన్ల ప్రతిపాదన
  70 ఏళ్లు దాటిన ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు పెంపు 15శాతం
  2 చేతులు లేని వారికి  రూ.10వేల ‘వరం’?
  రాష్ట్రాభివృద్ధి కొనసాగించడానికి మద్దతివ్వాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి
  తెలుగు వారికి పండగ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు నాయుడు

13ap-main1a_2.jpg

రాష్ట్ర ప్రభుత్వం వరాల మూట విప్పుతోంది. ఈ సంక్రాంతికి క్రాంతి నింపే పథకాలను అమలు చేయబోతోంది. పింఛన్లను రూ.2వేలకు పెంచడం, సాగుకు 9 గంటల ఉచిత విద్యుత్తు అందించడం, రేషన్‌ డీలర్లకు కమీషన్ల పెంపు, 50 ఏళ్లు దాటిన రజకులకు పింఛన్లు, 75ఏళ్లు దాటిన ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లను 15శాతం పెంచడం వంటి చర్యలకు శ్రీకారం చుడుతోంది, వీటిలో కొన్ని ఈనెల నుంచి, మరికొన్ని వచ్చే నెల నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో పింఛన్ల పెంపుపై ఇప్పటికే నిర్ణయం తీసుకోగా.. మిగిలిన వాటిపై పండగ తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు ‘ఇంటికి పెద్ద కొడుకుగా సంక్రాంతి కానుక ఇచ్చా. పింఛన్లు రెట్టింపు చేశా. ఇది నాకెంతో సంతృప్తినిస్తోంది. నిరుపేదల కళ్లల్లో వెలుగు చూడటమే నిజమైన సంక్రాంతి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దివ్యాంగులకు నెలకు రూ.3వేలు ఇస్తామని, 2 చేతులు లేని వారికి రూ.10వేలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ‘వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ఒక భరోసా.. చేనేత కార్మికులు, గీత కార్మికులకు వరం.. డప్పు కళాకారులు, చర్మకారులకు ఒక తోడ్పాటు.. ప్రతి పేద కుటుంబం తెదేపాకు అండగా ఉండాలి’ అని ఆకాంక్షించారు. ‘రాష్ట్ర పురోభివృద్ధికి రోజుకు 18 గంటల పాటు శ్రమిస్తున్నా, ప్రగతిని కొనసాగించడానికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు తిరిగి మద్దతివ్వాలి. ఆశీర్వదించాలి’ అని రాష్ట్ర ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. సంక్రాంతి సందర్భంగా ఆయన ఒక ప్రకటనలో తెలుగు ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.

సంక్షేమ పథకాల అమల్లోనే ఇదొక చరిత్ర
‘జనవరిలో ఇవ్వాల్సిన రూ.1,000, ఫిబ్రవరిలో ఇచ్చే రూ.2వేలు కలిపి.. మొత్తం రూ. 3వేల పింఛను సొమ్మును ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో ఒకేసారి పంపిణీ చేస్తాం. తర్వాత ప్రతి నెలా రూ. 2వేల చొప్పున అందిస్తాం. పండగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ జరగాలి. వచ్చే నెల మొదట్లో అందరికీ భోజనాలు పెట్టి రూ.3వేలు అందిస్తాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘రాష్ట్రంలోని 1.42 కోట్ల కుటుంబాల్లో 54 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నాం. అంటే ప్రతి 3 కుటుంబాల్లో ఒకరికి పింఛను ఇస్తున్నాం. సంక్షేమ పథకాల అమల్లోనే ఇదొక చరిత్ర.. పేదల భవిష్యత్తుకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే భరోసా ఇది’ అని స్పష్టం చేశారు. తెదేపా నేతలు, ప్రజాప్రతినిధులు, బాధ్యులతో ఆదివారం సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పింఛన్ల పంపిణీపై ప్రతి గ్రామంలో ప్రచారం చేయాలని తెదేపా నేతలకు  సీఎం సూచించారు.

ధాన్యం కొనుగోళ్లకు సహకరించని కేంద్రం
ధాన్యం విక్రయాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను పలువురు నేతలు టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో ఆయన ఆగ్రహం వెలిబుచ్చారు. తడిసిన, రంగు మారిన ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం సహకరించడం లేదని మండిపడ్డారు. భారత ఆహార సంస్థ నిబంధనలను సడలించి కొనుగోలు చేయాలని సూచించారు. వెంటనే దిల్లీ వెళ్లి ఎఫ్‌సీఐ అధికారులతో చర్చించాలని మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావులను ఆదేశించారు.

13ap-main1b.jpg

అందరి సహకారంతోనే...
ప్రభుత్వ యంత్రాంగం, సిబ్బంది సహకారంతోనే రాష్ట్రం రెండంకెల వృద్ధి రేటు సాధించిందని చంద్రబాబు వెల్లడించారు. గత నాలుగేళ్లుగా వర్షపాతం తక్కువగా ఉన్నా వ్యవసాయ రంగం వృద్ధి రేటు 17.18 శాతం నమోదైందని వివరించారు. పట్టిసీమ ద్వారా నాలుగేళ్లలో రూ.44వేల కోట్ల విలువైన పంట పండిందని గుర్తు చేశారు. ఇదే సమయంలో రాయలసీమకు కృష్ణా జలాలు తీసుకెళ్లి చెరువులు నింపామని, క్రమక్రమంగా అక్కడ కరవు ఛాయలు తొలగిపోతున్నాయని పేర్కొన్నారు. పట్టిసీమ స్ఫూర్తితో పంచ నదుల మహాసంగమ పనులకు శ్రీకారం చుట్టిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు 65శాతం పైగా పూర్తయిందని, రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు.

సంక్రాంతి నవ్యాంధ్రప్రదేశ్‌కు నవక్రాంతి..
సంక్రాంతి పండగ నవ్యాంధ్రప్రదేశ్‌కు నవక్రాంతి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లోని తెలుగువారికి ఆయన భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వాకిట వెలుగు ముగ్గులు వేసి మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే సృజనాత్మక వేడుక సంక్రాంతి పండగని పేర్కొన్నారు. పంట చేతికొచ్చిన సంతోషంతో రైతులు చేసుకునే పండగే సంక్రాంతి అని, అందుకే ఇది రైతుల నిజమైన పండగని వ్యాఖ్యానించారు.

రేషన్‌ డీలర్లకు కమీషన్‌ పెంపు!

రాష్ట్రంలో వివిధ వర్గాల వారికి సంక్రాంతి కానుకలను ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి రేషన్‌ డీలర్లకూ కమీషన్‌ పెంపు కానుకను సిద్ధం చేశారు. డీలర్లకు బియ్యంపై ప్రస్తుతం క్వింటాల్‌కు ఇస్తున్న రూ.70ని రూ.100కు పెంచనున్నారు. ఈ పెంపువల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28,500 మంది డీలర్లకు లబ్ధి చేకూరే అవకాశముంది. డీలర్లకు కమీషన్‌ పెంపునకు సంబంధించిన దస్త్రం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. సంక్రాంతి సెలవుల తర్వాత ఈ దస్త్రానికి ఆమోద ముద్ర పడే అవకాశముందని పౌర సరఫరాలశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పెంచే కమీషన్‌ను ఈ నెల నుంచి గానీ, ఫిబ్రవరి నుంచిగానీ వర్తింపజేసే అవకాశముంది.

సంతృప్త స్థాయికి ప్రోత్సాహం
ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌక ధరల దుకాణాల వారీగా కార్డుదారుల సంతృప్తస్థాయిని ప్రభుత్వం తెలుసుకుంటోంది. ఈ లెక్కల ఆధారంగా కార్డుదారులు 85శాతంపైగా సంతృప్తిని వ్యక్తం చేసిన దుకాణాలను నిర్వహిస్తున్న డీలర్లను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఒక్కో డీలరుకు నెలకు రూ.2వేల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు పౌర సరఫరాలశాఖ మంత్రి ప్రకటించారు.

గత ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో..
* 80శాతం నుంచి 90శాతం మధ్య సంతృప్తస్థాయి సాధించిన డీలర్లు 10300 మంది.
* 90శాతంపైన సాధించినవారు 3800 మంది.
* 85శాతంపైగా సంతృప్త స్థాయిని సాధించిన డీలర్లు సగటున 10వేల మంది వరకూ ఉన్నట్లు అంచనా.

పెంపు ప్రతిఫలం
* మొత్తం డీలర్లు: 28,500 మంది
* కేజీ బియ్యంపై పెరగనున్న కమీషన్‌: 30 పైసలు
* కమీషన్‌ పెంపు, నగదు ప్రోత్సాహకం కలిపి ఏటా అదనపు వ్యయం: రూ.100 కోట్లపైనే

చారిత్రకం: శిద్ధా

13ap-main1f.jpg

రాష్ట్రంలో సామాజిక భద్రత పింఛన్ల కింద ఇచ్చే మొత్తాన్ని రూ.2 వేలకు పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయం హర్షణీయమని రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు ఒక ప్రకటనలో తెలిపారు. లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరి బతుకుకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని వ్యాఖ్యానించారు.

50 ఏళ్లు దాటిన రజకులకు పింఛన్లు!

సామాజిక భద్రత కింద 50 సంవత్సరాలు దాటిన రజకులకు పింఛన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆర్థిక వెనుకబాటు, కుల వృత్తిలో భాగంగా త్వరగా అనారోగ్యానికి గురవడం వంటి కారణాల ఆధారంగా ఈ పింఛన్లను అందించనుంది. కులవృత్తిని అనుసరిస్తున్న వారు త్వరగా అనారోగ్యానికి గురవుతున్నందున 50ఏళ్లు దాటిన వారికి పింఛన్లు ఇవ్వాలని రజకుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. దీనిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో పింఛన్లకు సంబంధించిన ప్రతిపాదనలను బీసీ సంక్షేమశాఖ అధికారులు సిద్ధం చేసి ఆర్థికశాఖ ఆమోదానికి పంపినట్లు తెలిసింది. త్వరలో జరగనున్న మంత్రిమండలి సమావేశంలో దీనికి ఆమోదం లభించే అవకాశాలున్నట్లు బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నెలకు రూ.2వేలు ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో దాదాపు 12 లక్షల మందికిపైగా రజకులున్నట్లు ప్రజా సాధికార సర్వే ద్వారా అధికారులు గుర్తించారు. వృద్ధాప్య పింఛన్ల విభాగంలో 65ఏళ్లు దాటిన వారికి ప్రభుత్వం ఎన్టీఆర్‌ భరోసా కింద పింఛన్లు ఇస్తోంది. 50- 65ఏళ్ల మధ్య ఎంత మంది ఉంటారనేది అధికారులు గుర్తించే పనిలో ఉన్నారు.

‘పింఛను పెంపుతో ముందే పండగ’

70 ఏళ్లు దాటిన ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు 15 శాతం అదనపు పింఛను ఇచ్చేందుకు అంగీకారం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం హర్షణీయమని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. రూ.200 కోట్లు అదనపు భారం పడుతున్నప్పటికీ ప్రభుత్వం ఆమోదం తెలపడం ఉద్యోగుల మీదున్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 4 లక్షల మంది పెన్షనర్లకు సంక్రాంతి పండగ ముందే వచ్చిందని వ్యాఖ్యానించారు.
13ap-main1c.jpg
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...