Jump to content

క్యాన్సర్‌ ఆసుపత్రికి రూ.40 కోట్లు విరాళం


sonykongara

Recommended Posts

క్యాన్సర్‌ ఆసుపత్రికి రూ.40 కోట్లు విరాళం

 

పారిశ్రామిక వేత్త వెలమాటి చంద్రశేఖర జనార్దనరావు దాతృత్వం
  భవనాలకు శంకుస్థాపన చేసినవైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి

12ap-state4a.jpg

ఈనాడు డిజిటల్‌, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో క్యాన్సర్‌ ఆసుపత్రి, కార్డియాలజీ బ్లాకుల భవనాల నిర్మాణానికి పారిశ్రామికవేత్త వెలమాటి చంద్రశేఖర జనార్దనరావు ఏకంగా రూ.40 కోట్ల విరాళం అందజేశారు. ఈ భవన నిర్మాణాలకు శనివారం వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దాత చంద్రశేఖర జనార్దనరావును ఆమె అభినందించారు. డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది కానీ ఇలాంటి మహత్తర కార్యక్రమాలు చేయడానికి ముందుకు రారని అన్నారు. సమాజానికి ఉపయోగపడే విధంగా ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడం జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టమని కొనియాడారు. పెద్దలు ఇచ్చిన ఆస్తులను తిరిగి తీసేసుకుంటున్న ఈ రోజుల్లో ఆయన మనవడు కృష్ణబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందించదగ్గ విషయమని అన్నారు. ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వాలంటే నమ్మకం ఉండాలని.. ఆ నమ్మకం జిల్లా కలెక్టరు కాటంనేని భాస్కర్‌ తన పనితీరుతో కల్పించగలిగారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ మాగంటిబాబు, ఎమ్మెల్సీ రాముసూర్యారావు, కలెక్టర్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

అనేక సేవా కార్యక్రమాలు
పారిశ్రామికవేత్త వెలమాటి చంద్రశేఖర జనార్దనరావు పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో జన్మించారు. పదోతరగతి వరకు కొవ్వలిలోనే విద్యాభ్యాసం చేశారు. విజయవాడలోని లయోలా కళాశాలలో ఇంటర్‌, బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలలో ఇంజినీరింగు కోర్సును అభ్యసించారు. హైదరాబాద్‌లో రిఫ్రిజిరేటర్‌ కంప్రెసరు తయారీ సంస్థను ప్రారంభించారు. 1965లో వెల్‌జన్‌ హైడ్రేయర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ను స్థాపించారు. 1973లో వెల్‌జన్‌ డెనిసన్‌ లిమిటెడ్‌ను ప్రారంభించారు. స్వగ్రామమైన కొవ్వలి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు అదనపు భవనాలు, ఫర్నిచర్‌, ప్రయోగశాలల ఏర్పాటుకు ఆయన గతంలో విరాళం ఇచ్చారు. ఏలూరులోని సర్‌ సీఆర్‌ఆర్‌ ఇంజినీరింగు కళాశాలలో 2000లో టెక్నాలజీ కేంద్రం ఏర్పాటుకు రూ.2 కోట్ల భూరి విరాళం ఇచ్చారు. హైదరాబాదులోని ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి రూ.10 కోట్లు, 2014లో హుద్‌హుద్‌ తుపాను బాధితుల సహాయార్థం రూ.కోటి విరాళం ఇచ్చారు. ఏలూరు ఆసుపత్రిలో తలసేమియా రోగుల చికిత్స కేంద్రం భవనానికి రూ.కోటి విరాళం ఇచ్చారు.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...