Jump to content

పార్క్‌హయత్‌లో ప్రజాకూటమి నేతల భేటీ


Palnadu

Recommended Posts

హైదరాబాద్‌: ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థుల గెలుపోటములపై కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సభ్యులు, ప్రజాకూటమి నేతలు నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈరోజు సాయంత్రం పార్క్‌హయత్‌లో నిర్వహించిన ఈ సమీక్షకు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యుడు ఆర్‌.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు వి.హనుమంతరావు, అజారుద్దీన్‌, పొన్నాల లక్ష్మయ్య, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంతోపాటు సీపీఐ నేతలు హాజరయ్యారు.

ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎవరెవరికి విజయావకాశాలు మెండుగా ఉన్నాయి? గెలుపునకు అవకాశాలు లేని నియోజకవర్గాల్లో ఎదురైన ప్రతికూల అంశాలు ఏమిటి? ఓట్లు గల్లంతైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారే ప్రకటించడం తదితర అంశాలపై నేతలు చర్చించినట్లు సమాచారం.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...