Vulavacharu Posted December 2, 2018 Share Posted December 2, 2018 (అమరావతి, ఆంధ్రజ్యోతి ): డిసెంబరు 7న తెలంగాణలో 11 వేల మంది ఆంధ్రా ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీని కోసం ఆ రోజున ఏపీ ప్రభుత్వం వారికి సెలవు ప్రకటించింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చినా ఓటు హక్కు తెలంగాణలోనే ఉంది. కొంత మంది ఏపీకి ఓటు హక్కు బదిలీ చేసుకున్నా.. ఇంకా సచివాలయం, అసెంబ్లీ, మండలిలోని దాదాపు వెయ్యి మంది ఉద్యోగులు.. 200 హెచ్వోడీ కార్యాలయాల్లో సుమారు 8 వేల మందికి తెలంగాణలోనే ఓటు హక్కు ఉంది. వీరితోపాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న సుమారు 2 వేల మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్, పార్ట్ టైం ఉద్యోగులు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. దీంతో ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యుల ఓట్లపై కూడా పార్టీలు దృష్టి సారించాయి. వీరి ఓట్లన్నీ సాలిడ్గా తమకే పడతాయని ఒక పార్టీ.. లేదు గంపగుత్తగా తమకే మద్దతు ఇస్తారని మరో పార్టీ వర్గాలు చర్చించుకోవడం ఆసక్తికరంగా మారింది. http://www.andhrajyothy.com/artical?SID=674489 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.