RamaSiddhu J Posted November 22, 2018 Share Posted November 22, 2018 Source: Sreenivas Prasad wall నుండి "బాలకృష్ణ,బాబు-తెలుగురాష్ట్రాల ద్రోహులు" "బాలకృష్ణ నిజాం కాలేజ్ లో డిగ్రీ చదివాడు!మాట్లాడేప్పుడు ఆంగ్లపదాలు వాడకుండా తెలుగులోనే మాట్లాడాలి అనే నిబద్ధత వున్నవాడు!ఎక్కువ వాక్సుద్ధి లేకపోవడం వల్ల కొన్ని పెద్ద తెలుగు పదాల ఉచ్చారణ సరిగా చేయలేడు! పైగా తండ్రి ని అనుకరించాలన్న ఆత్రం వల్ల మరింత తడబడతాడు!!కానీ దాని వల్ల తెలుగు భాషకు,భాషా సమాజానికి పెద్దగా కలిగే నష్టం లేదు..మీ ఏడుపుల గోల తప్ప!! అతని కంటూ ఫ్యాన్స్ వున్నారు!అతని సినిమాలు నచ్చే వాళ్ళు వున్నారు!ఫామిలీ బేస్ వున్నా దాన్ని నిలబెట్టుకోడం అంత ఈజీ కాదు గదా!!ఖచ్చితంగా చాలా మంది కంట బెటర్!! నమ్మి వచ్చినోళ్ళని ఆదుకుంటూనే ఉంటాడు...తండ్రి ఇచ్చిన హాస్పిటల్ ద్వారా!!సమాజానికి ఒక్క శాతం నష్టమ్ కూడా చెయ్యడం రాలేదు...ముప్పై ఏళ్ళు సినీ,రాజకీయ రంగాలలో ఉన్న కూడా!!పాపం కుటుంబం కూడ ఒక్కటే ఉంది!!పిల్లలు కూడా ఎవరి జీవితాలు చెడకొట్టినోళ్లు కాదు!! . కానీ బాలకృష్ణ ఒక 'అసమర్థుడైన' కొడుకు!ఇప్పటి స్టాండర్డ్స్ ప్రకారం చూస్తే చీఫ్ మినిస్టర్ కొడుకుల్లో అతనంత' చేతగానోడు', పనికిమాలిన వాడు ఇంకొడు లేడు!! రాష్ట్రంలోనే చూడండి ..జస్ట్ నాలుగేళ్లలో ఒక సీఎం కొడుకు ఎంత 'ద్రవ్యాకర్షణ' చేసాడో!!అందులో ఖండాంతర ఖ్యాతి సంపాదించాడు!! అవినీతిని కొత్త పుంతలు తొక్కించాడు!!యూనివర్సిటీ లలో ఈ తండ్రి కొడుకుల ద్రవ్యాకర్షణ 'కాన్సెప్టు'ని పాఠ్యఅంశం గా పెట్టారు! కేసులు జన్మాంతం నడిచినా ఆకర్షించిన ద్రవ్యం'భవనాలు, పేపర్లు, టీవీలు, సిమెంటు కంపెనీ' ల రూపంలో మన ఎదురుగా కనబడుతూనే ఉన్నయ్యి! సీఎం 'అయ్య'పోయాక ఈ 9 ఏళ్లలో మళ్లీ అలాటి ద్రవ్యాకర్షణ 'మంత్రం' మళ్లీ పనిచేయలా!! పాపం బాలకృష్ణకి 20 ఏళ్ళు అధికారం 'ఇంట్లో' వున్నా ..ఒక్క రూపాయి దాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించడం చేతకానంత పనికిమాలినోడుగా పదే పదే ప్రూవ్ చేసుకున్నాడు!ఇద్దరు ముగ్గురు స్నేహితులకి స్నేహం కోసం టికెట్ ఇప్పించడం తప్ప.. ఒక 50 మందికి కూడా టికెట్స్ అమ్ముకోడం గత ముప్పై ఏళ్లలో చేతకాల!(కొత్తగా వచ్చినోళ్లు బెటర్ ఈ అంశంలో) కాంట్రాక్ట్స్,కంపెనీలు పెట్టినోళ్ళని ఇంటికి పిలిచి 'పది శాతం' కమీషన్ నొక్కడం కూడా చేతకాని 'అసమర్థుడు'!! అధికారాన్ని వాడుకోటం అస్సలు తెలీనోడు!! దీనివల్ల తెలుగు ప్రజలకు చాలా నష్టం కలుగుతోంది!!మరీ ఇంత అసమర్థుడు అవడం వల్ల జనం,ఫ్యాన్స్ కూడా 'సిగ్గు' పడుతున్నారు!! కేసీఆర్, పవన్,జగన్ మాట్లాడే తెలుగు వల్ల భాష ఎంత ప్రాచుర్యం పొందుతుందో, పద సంపద ఎంత వృద్ధి అవుతుందో అంచనా వెయ్యలేం!! 'ఆడికి భయపడి,ఈడికి భయపడి,'వాడెమ్మ మొగుడి'కి భయపడి' అని పవన్ మొరిగినపుడు ఆ చివరి పదం సభ్యత కి చిరునామా గా అధీకృతం అయ్యింది!! 'తోలు తీస్తా' అనే పదం అయితే ఈ ఏడు గూగుల్ సెర్చ్ లో ఎక్కువ వాడబడింది!! అలా భాష వృద్ధికి ఆయన తోడ్పడుతుంటే ఒక్క భాష ప్రేమికుడి కి,బ్లాగర్ కాకి,కాలమిస్ట్ లకి ఎక్కడా చీమ కుట్టినట్లు అనిపించలా !కిమ్మనుకుండా కూకున్నారు!! ఇక కేసీఆర్ వాడే తిట్లు'ధూ నీ బతుకు చెడా'అంటే తిట్టింది బాబు ని కదా...కర్ణపేయంగా అనిపించింది!గత దశాబ్దంగా అతను వాడిన తెలుగు తిట్లు,బూతులు..థిన్ లైన్ ని భాష విషయంలో క్రాస్ చేసిన సంఘటనలతో నిజంగా భాష మీద ప్రేమ ఉన్నోళ్లు అయితే మినీ థీసిస్ సబ్మిట్ చెయ్యొచ్చు!!selective amnesia వల్ల ఇది materialise కాలేదు!! బాలకృష్ణ తప్పుగా ఉచ్ఛరిస్తే 'భాషా ఉపద్రవాలు' వచ్చినట్టు ఘిoకారాలు చేశారు కదా....'తెలుగు బూతులు' వీళ్లు మైకుల ముందు వాడితే సమ్మగా ఉందా!? తెలుగు భాష అంతరించిపోతున్న లెక్క 'పెడబొబ్బలు' పెట్టి వెర్బల్ డయేరియా వచ్చినట్టు ట్రోలింగ్ చేశారు....అదే సూత్రం ఎవరికీ వర్తించదా!? మిగిలిన రాజకీయ నాయకులు,సినిమా వాళ్ళు అందరూ భాషని 'సుసంపన్నం' చేస్తున్నారా!? 1983 లో ఎన్టీఆర్ పెట్టిన పథకాలు,నిర్ణయాలు కొంత మందికి గుర్తున్నయ్యి,అవన్నీ వేస్ట్ అని ఇప్పుడు తీర్మానాలు చేస్తారు కానీ 2004-2009 మధ్య జరిగిన వినూత్న విస్తృత అవినీతి మాత్రం convenient గా భలే మర్చిపోయి న్యూట్రల్ ముసుగులో ప్రవచనాలు చెబుతుంటారు వందిమాగధులకి...దాన్ని అస్సలు గమనించనట్టు! నువ్వు నొక్కితే కోర్ట్ తీర్పు రాలేదు కదండీ అనే సన్నాయి నొక్కులు!అరె ఒక్క అవినీతి కేసూ లెనోడు వాళ్ల దృష్టిలో నాలుగు నెలల్లో బోఢీ దెబ్బకి జైల్లో కి పోతాడని కలలు కంటూ వుంటారు!! ఇంకొ విచిత్ర 'పిత్తపరిగ' మొహం వాడికి నిద్దట్లో కూడా లోకేష్,బాలకృష్ణ మాత్రమే వారసత్వం వల్ల ఉన్నత స్థానంలో ఉన్నట్లు గుర్తుకు వస్తుంటారు!!Bcom చదివిన జగ్గడు,ఇంటర్ తప్పిన pk లు ఇప్పుడున్న స్థానాలకు ఎలా సరిపోతారో ఏడవలెడు!!ప్రతి శివారు గ్రామంలో 25 మంది యువకులు ఇంతకన్నా బెటర్ టాలెంట్ తో అవకాశాలు లేక ఏడుస్తున్నార్రా అని వీడికి ఒక డిప్ప మీద నాలుగు జెల్లకాయలు ఇచ్చి చెప్పాలి!! డైరెక్ట్ గా ఏడ్చేవాడు ఎప్పుడూ ప్రమాదం కాదు!!నేరుగా చెప్పలేక పరోక్షంగా, న్యూట్రల్ ముసుగులో బోలెడంత మేధావితనం ముందు ఒలకబోసి తర్వాత ఓరిజినాల్టీ విషాన్ని కక్కుతుంటారు!!వీరిలో 99 మందికి బాబు మీద గెలవడం చేతగాని ఏడుపు!అతన్ని తొక్కలేని కడుపు మంట!!దాన్ని మరుగున పెట్టి 'రైతులు,వ్యవసాయం, నిరుద్యోగం,భూసేకరణ,నష్టపరిహారాలు, అవినీతి' అని నిత్య విషాదాలు పలవరిస్తుంటారు....అవన్నీ '95 లో బాబు అధికారం చేపట్టినప్పటి నుండే మొదలయినట్టు!!! కిందా పైనా ఓమిటింగ్స్,మోషన్స్ చూపడంతో వీళ్ళ తర్వాతే!! ఒంట్లో జీవం ఉన్నంత వరకు ఇలాటి అరమేధో 'శిఖండులు' ఎదురుపడుతూనే ఉంటయ్యి!! బాబు కైనా,బాలకృష్ణ కైనా!!" Link to comment Share on other sites More sharing options...
AnnaGaru Posted November 22, 2018 Share Posted November 22, 2018 Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted November 22, 2018 Share Posted November 22, 2018 Chaala baaga rasaaru ????? Link to comment Share on other sites More sharing options...
V Jagadeesh Posted November 22, 2018 Share Posted November 22, 2018 Perfect Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.