Jump to content

దారికొస్తున్న తమ్ముళ్లు!


RamaSiddhu J

Recommended Posts

టికెట్‌ దక్కలేదని నిన్నటి వరకు చిర్రుబుర్రులాడుతూ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తెలుగు తమ్ముళ్లు నెమ్మదిగా దారికి వస్తున్నారు. వీరిని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అమరావతికి పిలిపించి మాట్లాడటంతో పరిస్థితిలో మార్పు కన్పిస్తోంది.  ఖైరతాబాద్‌ నుంచి  నామినేషన్‌ వేసిన తెదేపా నేత బీఎన్‌రెడ్డి బరిలో నుంచి తప్పుకొని కూటమి అభ్యర్థి డాక్టర్‌ శ్రవణ్‌కు మద్దతు ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ముషీరాబాద్‌లో టిక్కెట్‌ ఆశించిన భంగపడిన తెదేపా నగర అధ్యక్షుడు ఎం.ఎన్‌.శ్రీనివాస్‌ తొలుత రెబల్‌గా బరిలోకి దిగేందుకు నిర్ణయించారు. అధిష్ఠానం పిలిచి మాట్లాడటంతో వెనక్కి తగ్గారు. సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి సెగ్మెంట్లలో రెబల్స్‌ బెడద తప్పదని అనుకున్నప్పటికీ ... ప్రస్తుతం అక్కడి తిరుగుబాటు నేతలంతా కూటమి అభ్యర్థులను బలపర్చేందుకు అంగీకరిస్తుండటం విశేషం

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...