sonykongara Posted November 9, 2018 Share Posted November 9, 2018 వట్టి రవి ఇంట్లో జగన్, పవన్ కలిశారు09-11-2018 02:58:14 సీట్లు సర్దుబాటుకాక విడిపోయి.. మోదీ చెప్పినట్లుగా ఆడుతున్నారు: కారెం రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 8: ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్కల్యాణ్ ఇటీవల విశాఖపట్నంలో వట్టి రవి ఇంట్లో కలిశారని ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ కారెం శివాజీ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘విశాఖపట్నం జిల్లాలో పాదయాత్ర జరిగిన సమయంలో జగన్మోహనరెడ్డి పవన్ను కలిసి 40 సీట్లు ఆఫర్ చేశారు. అయితే సీఎం సీటుపై పవన్కల్యాణ్ దృష్టి పెట్టడం వల్ల సీట్లు సర్దుబాటుకాక బయటకు వచ్చినట్టు తెలిసింది. కులం, మతం పునాదులపై వారు అధికారంలోకి రాలేరు. ప్రధాని మోదీ చెప్పినట్టుగా ఆడుతూ ఆంధ్ర ప్రజలను మోసగించేందుకు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం ఏపీని నమ్మించి దగా చేసింది. అధికారంలోకి వస్తే విభజన హామీలను నెరవేర్చి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు కాంగ్రె్సతో కలిసి ఒక బలమైన కూటమి ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. దానిని చూసి ఓర్వలేక కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారు’’ అని కారెం మండిపడ్డారు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.