Jump to content

Puvvula SM leelalu


APDevFreak

Recommended Posts

Ahmedabad Mayor Bijal Patel tweets an image from Seoul as Sabarmati Riverfront in Ahmedabad

 
By
 Jignesh Patel
 -
7th November 2018
 
 

In a major embarrassment for Ahmedabad Municipal Corporation, the Mayor of the city has tweeted a picture from Seoul as Sabarmati riverfront. On November 6, Ahmedabad Mayor Bijal Patel tweeted an image purportedly of Ahmedabad Riverfront with a message, “It’s not Singapore , Malaysia, Dubai….. , It’s our Amdavad city. #MaruAmdavad #RiverFront night areal view. #WorldHeritageCity @AmdavadAMC @vnehra”.

Screenshot_20181107-201242_01.jpg?resize

One of the first handles to tweet this image was Manish Tilwani, who describes himself on twitter, “ITSM Sabarmati” and is followed by Piyush Goyal Office and several prominent BJP leaders. The mayor has tweeted an identical text including the spelling error, areal. Patel was also tagged by Tilwani in his tweet.

Screenshot_20181107-201214_01.jpg?resize

Vrushant Merchant, who’s Twitter bio reads, “Social Media Convener BJYM Karnavati” also made the identical claim.

Sabarmati Riverfront?

Alt News did a Google reverse image search and found a similar picture on the travel website Trip Advisor. The vantage point from which the photograph was shot is the restaurant ‘Walking on the Cloud’ located near the banks of Han river, South Korea.

Selection_07_11_2018_002.jpg?resize=696%

To confirm the location of the image, we independently verified the views of the same place using Google Maps and found a daytime image from the same vantage point in live view.

Screenshot_20181107-193957_01.jpg?resize View from Walking on the clouds restaurant, Seoul

A daytime image of Han River of Seoul, South Korea from a distance can also be found on Wikipedia.

1280px-63_Building_Seoul_15495025317-1.j

As shown above, the images are from Seoul, South Korea and NOT Ahmedabad. Earlier in October this year, BJP Chhattisgarh had used images from Gujarat and Canada to showcase improved highways in the state.

 

source:https://www.altnews.in/ahmedabad-mayor-bijal-patel-tweets-an-image-from-seoul-as-sabarmati-riverfront-in-ahmedabad/

Link to comment
Share on other sites

1 hour ago, APDevFreak said:

Ahmedabad Mayor Bijal Patel tweets an image from Seoul as Sabarmati Riverfront in Ahmedabad

 
By
 Jignesh Patel
 -
7th November 2018
 
 

In a major embarrassment for Ahmedabad Municipal Corporation, the Mayor of the city has tweeted a picture from Seoul as Sabarmati riverfront. On November 6, Ahmedabad Mayor Bijal Patel tweeted an image purportedly of Ahmedabad Riverfront with a message, “It’s not Singapore , Malaysia, Dubai….. , It’s our Amdavad city. #MaruAmdavad #RiverFront night areal view. #WorldHeritageCity @AmdavadAMC @vnehra”.

Screenshot_20181107-201242_01.jpg?resize

One of the first handles to tweet this image was Manish Tilwani, who describes himself on twitter, “ITSM Sabarmati” and is followed by Piyush Goyal Office and several prominent BJP leaders. The mayor has tweeted an identical text including the spelling error, areal. Patel was also tagged by Tilwani in his tweet.

Screenshot_20181107-201214_01.jpg?resize

Vrushant Merchant, who’s Twitter bio reads, “Social Media Convener BJYM Karnavati” also made the identical claim.

Sabarmati Riverfront?

Alt News did a Google reverse image search and found a similar picture on the travel website Trip Advisor. The vantage point from which the photograph was shot is the restaurant ‘Walking on the Cloud’ located near the banks of Han river, South Korea.

Selection_07_11_2018_002.jpg?resize=696%

To confirm the location of the image, we independently verified the views of the same place using Google Maps and found a daytime image from the same vantage point in live view.

Screenshot_20181107-193957_01.jpg?resize View from Walking on the clouds restaurant, Seoul

A daytime image of Han River of Seoul, South Korea from a distance can also be found on Wikipedia.

1280px-63_Building_Seoul_15495025317-1.j

As shown above, the images are from Seoul, South Korea and NOT Ahmedabad. Earlier in October this year, BJP Chhattisgarh had used images from Gujarat and Canada to showcase improved highways in the state.

 

source:https://www.altnews.in/ahmedabad-mayor-bijal-patel-tweets-an-image-from-seoul-as-sabarmati-riverfront-in-ahmedabad/

dG6Xxf.gif

Link to comment
Share on other sites

8 minutes ago, sskmaestro said:

Image not visible, what’s the story?

I am paraphrasing it...

Ambedkar constitutional committee ki elect kavatam Patel ki ishtam ledu. So ayanni Bombay state lo vodinchadu. Appudu Dalit party Ambedkar ni Bengal (current Bangladesh) nunchi gelipinchu kundi. elagaina Ambedkar ni stop cheyyatam kosam aayana represent chestunna areas ni Bangladesh ki icchesadu even though Muslim population there is around 46% only. British guidance was to give areas to Bangladesh if Muslim population is 50% or more. British realized this arm twisting and suggested to take those two areas back tin to India or Elect Ambedkar from someother place. later he was elected again from Pune.  And by the way, those two areas (Jessor and Khulna) are currently most developed areas in bangladesh.

Link to comment
Share on other sites

32 minutes ago, sskmaestro said:

Image not visible, what’s the story?

AndhraJyothy editorial : 06-11-2018 23:41:39
పటేల్‌ విగ్రహం, కొన్ని వాస్తవాలు
06-11-2018 23:41:39
 
636771445008338795.jpg
భారతీయులు కృతజ్ఞత గలవారు. మేలు చేసినవారిని స్మరించుకునే ఉదాత్త గుణం గలవారు. అందువల్లనే ఈ దేశంలో నాయకుల విగ్రహాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి విగ్రహాల ‘స్థాయి’ మరింత పెంచుతూ, ఈ దేశ మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అతిపెద్ద విగ్రహాన్ని మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠించింది. ఈ సందర్భంగా ‘పటేల్‌ను చరిత్ర విస్మరించినా, బీజేపీ విస్మరించదు. నెహ్రూ కాకుండా పటేల్ గనుక దేశ తొలి ప్రధాని అయ్యుంటే కశ్మీర్‌లోని ఆ చిన్న ముక్క కూడా భారత్‌లోనే అంతర్భాగమయ్యేది. పటేల్‌ను కాంగ్రెస్ ఏనాడు పట్టించుకోలేదు’ అన్న మోదీ వ్యాఖ్యల వెనుక, ఏ లక్ష్యాలు దాగివున్నాయో చెప్పడమే ఈ వ్యాసం ఉద్దేశం. పటేల్ పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చే పేర్లు మూడు: గాంధీ, అంబేడ్కర్, నెహ్రూ. పై ముగ్గురి వ్యక్తిత్వాలతో పటేల్‌ను పోల్చి చూస్తే, వాళ్ళ జీవితాలలో జరిగిన సంఘటనలతో పటేల్‌కు వున్న సంబంధాన్ని పరిశీలిస్తే కొన్ని నిజాలు బయటపడతాయి.
 
ముందుగా గాంధీజీ జీవితంతో పటేల్ సంబంధాలను చూద్దాం. ఆయన గాడ్సే చేతిలో హత్య గావించబడ్డప్పుడు పటేల్ ఈ దేశ ప్రథమ హోమ్ మినిష్టర్. గాంధీజీ పై రెండుసార్లు హత్యాయత్నం జరిగింది. మూడవసారి విజయవంతంగా పూర్తిచేశారు. ఇక్కడ హోం మంత్రిగా పటేల్ పాత్ర ముఖ్యం. సంఘ విద్రోహ శక్తులకు విద్రోహ చర్యలు చేయాలనే ఉంటుంది. కానీ, ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్నవారు చేయాల్సిందల్లా వాటిని అరికట్టడం. రెండుసార్లు గాంధీని చంపడానికి విఫలయత్నం చేసిన ఆప్టే, గాడ్సేల కుట్రలను పటేల్ కనిపెట్టి హోమ్ మంత్రిగా తన బాధ్యత సక్రమంగా నిర్వహించలేదన్నది చారిత్రిక వాస్తవం. గాంధీని ఎందుకు కాపాడలేకపోయారు? తెలియకనా, సమాచారం లేకనా? అన్నప్పుడు తెలియక కాపాడలేకపోయారనే వాదన ఇక్కడ నిలబడదు. ఎందుకంటే అంతకు ముందు రెండుసార్లు అటువంటి ప్రయత్నం జరిగింది కాబట్టి. ఇక్కడే చాలా మంది చరిత్రకారులు పటేల్ పాత్రపై అనుమానాలు వ్యక్తపరిచారు. ఎందుకంటే, అప్పటికి ఒక్క పటేల్ పై తప్ప మిగతా కాంగ్రెస్ నాయకులందరిపై నాటి హిందూ సంస్థలు గుర్రుగా వున్నాయి.
 
గాంధీజీ హత్యకు ప్రధాన సూత్రధారి అని అనుమానిస్తున్న సావార్కరుతో పటేల్‌కు దగ్గర సంబంధాలు ఉండేవి. అందుకే పటేల్ గాంధీజీ రక్షణ విషయంలో చాలా ఉదాసీనంగా వ్యవహరించాడనీ, ఆ నాటి ప్రభుత్వం తనపై ఎంతో నమ్మకంతో ఉంచిన బాధ్యతను విస్మరించాడనీ పరిశోధకులు అంటున్నారు. ఆరెస్సెస్‌ను నిషేధించిన జాతీయవాది అన్న ప్రచారం కూడా సత్యదూరమే.
 
గాంధీ హత్యకు మూడు నెలల ముందు వారిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించాడు. వాళ్ళను దండంతో బెదిరించరాదనీ, గౌరవంగా చూడాలనీ, వారు నిజమైన దేశభక్తులనీ పటేల్ కొనియాడాడు. గాంధీ హత్యానంతరం ఆరెస్సెస్‌ను నిషేధించినా ఏడాది గడవక ముందే ఎత్తివేశాడు. దేశ విభజనానంతరం హిందూ -ముస్లిం విద్రోహశక్తులు అమాయక ప్రజలపై పేట్రేగి హింసాకాండకు పాల్పడుతున్న సమయంలో కూడా పటేల్‌ మౌనముని పాత్ర వహించాడు. కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు నడిపిన ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి. నెహ్రూ వర్గంతో గొడవలు గాంధీకీ తలనొప్పిగా మారుతుండేవి. దేశ విభజన సమయంలో ఐదు లక్షల మంది ఊచకోతను ఆపడానికి పటేల్‌ చేసిన ప్రయత్నం శూన్యం. ఈ విషయంలో మోదీకి- పటేల్‌కు సారూప్యతలు కనిపిస్తాయి.
 
రెండవది ఈ దేశ తాడిత -పీడిత కులాల విమోచకుడు, రాజ్యాంగ రూపశిల్పి డా.అంబేడ్కర్ జీవితంతో పటేల్ సంబంధాలు. రాజ్యాంగ పరిషత్‌కు 1946 జులై, ఆగస్టులలో ఎన్నికలు జరిగాయి. అప్పుడు భారతదేశంలో బ్రిటిష్‌ ఇండియా, స్వదేశీ సంస్థానాలనే రెండు పరిపాలన విభాగాలు ఉండేవి. ప్రతీ సంస్థానం నుంచి సుమారు 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడు చొప్పున పరిషత్‌కు తీసుకున్నారు. 296 మంది బ్రిటీష్ ఇండియా నుంచి, 93 మంది స్వదేశీ సంస్థానాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. బ్రిటిష్ సంస్థానాలలో రాజ్యాంగ పరిషత్‌కు జరిగిన ఎన్నికలలో షెడ్యుల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్‌ను, అంబేడ్కర్‌ను ఓడించటానికి పటేల్ అప్పటి బొంబాయి సంస్థాన ప్రధానమంత్రియైన బీ.జి ఖేర్‌కు సూచనలు చేసి ఓడించడం జరిగింది. పటేల్ కుట్రను గమనించిన బెంగాల్ నామశూద్రుల నాయకుడు జోగేంద్రనాథ్ మండల్ జెస్సోర్‌–ఖుల్నా ప్రాంతం నుంచి పోటీ చేసిన తమ అభ్యర్థి ముఖుంద్ బిహారి మల్లిక్‌తో రాజీనామా చేయించి అంబేడ్కర్ చేత పోటీ చేయించారు.
 
షెడ్యుల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్‌కు బెంగాల్ లెజిస్లేచర్‌లో పూర్తి మెజారిటీ లేకపోవడంతో ఆంగ్లో ఇండియన్, స్వతంత్ర, దళిత, ముస్లిం లీగ్ అభ్యర్థుల మద్దతుతో 5 బదిలీ ఓట్లను సాధించి అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నిక కాబడ్డారు. అంబేడ్కర్‌ ఇలా విజయం సాధించకుండా తెరచాటు ప్రయత్నాలు చేయడానికి కూడా పటేల్ వెనుకాడలేదు. ఈ పరిస్థితుల్లో దళిత నామశూద్ర- ముస్లిం నాయకులు, -కార్యకర్తలు కర్రలు పట్టుకుని పోలింగ్ బూతులకు కాపలా కాయాల్సి వచ్చింది. ఇలా ఐక్య బెంగాల్‌ నుంచి అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నిక కాబడిన తరువాత కూడా కాంగ్రెస్‌లో అంబేడ్కరంటే గిట్టని కొంతమందిని కూడగట్టుకుని పటేల్ మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ పరిణామాలు జరిగిన కాలంలో అంబేడ్కర్‌పై ఆయన కోపంతో ఉగిపోయేవాడు.   ‘మిస్టర్ అంబేడ్కర్! నీకు రాజ్యాంగ పరిషత్ తలుపులే కాదు కిటికీలు కూడా మూసివేయబడ్డవి. ఎలా లోనికొస్తావో చూస్తా’నంటూ మాట్లాడేవాడు. కేవలం అంబేడ్కర్‌పై కోపంతో, రాజ్యాంగ పరిషత్‌కు దూరం చేసే దురుద్దేశంతో తూర్పు బెంగాల్ నుంచి అంబేడ్కర్ ఎన్నికైన జెస్సోర్‌–-ఖుల్నా ప్రాంతాన్ని పాకిస్థాన్‌కు ఇచ్చేశారు. ఇలా మన దేశ భూభాగాన్ని పాకిస్థాన్‌కి కట్టబెట్టి దేశ సమగ్రతను దెబ్బతీయడంలో పటేల్ పాత్ర మరువరానిది. విభజన విధానం ప్రకారం యాభైశాతం, అంతకంటే ఎక్కువ ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాలనే పాకిస్థాన్‌కు ఇవ్వాలి. కానీ, రాజ్యాంగ పరిషత్‌కు అంబేడ్కర్‌ను దూరం చేయాలనే ఉద్దేశంతో 46% ముస్లింలు ఉన్న జెస్సోర్ -ఖుల్నా ప్రాంతాన్ని పాకిస్తాన్‌కు ఇచ్చేశారు. జరిగిన అన్యాయాన్ని అంబేడ్కర్ బ్రిటిష్ ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకులకు విన్నవించగా తీవ్రంగా తీసుకున్న బ్రిటీష్ ప్రభుత్వం ఇది విభజన నిబంధనలకు వ్యతిరేకమని, తప్పిదాన్ని సరిచేసి జెస్సోర్‌–ఖుల్నా ప్రాంతాన్ని భారత్‌లో కలపాలనీ, లేదంటే అంబేడ్కర్‌ను వేరే ప్రాంతం నుంచైనా ఎన్నుకోవాలని నెహ్రూకు సూచించటం జరిగింది.  ఇది తెలిసిన గాంధీ విస్తుపోయి పిలిచి చీవాట్లుపెట్టిన తర్వాత అంబేడ్కర్‌ను రాజ్యాంగ పరిషత్‌కు ఎలాగైనా రప్పించే బాధ్యతను పటేల్ పైనే పెట్టడం జరిగింది. విభజన ప్రక్రియ నిలిచిపోయి పెద్ద సమస్యలు తలెత్తుతాయని సమస్య తీవ్రతను గమనించిన కాంగ్రెస్ పూణే నుంచి మాల్వంకర్‌ను తప్పించి అంబేడ్కర్‌ను ఎన్నుకున్నది. అందుకే రాజ్యాంగ పరిషత్ చర్చల మొదటి పుస్తకంలో బెంగాల్ ప్రావిన్స్‌లో వున్న అంబేడ్కర్ పేరు రెండవ పుస్తకంలో బాంబే ప్రావిన్సులోకి మారిపోయింది. అలా పోగొట్టుకున్న ఆ తూర్పు బెంగాల్ రెండు జిల్లాలు వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైనవి. 1971 డిసెంబర్ యుద్ధంలో పాకిస్థాన్ నుండి విముక్తిపొందిన మొట్టమొదటి బంగ్లాదేశ్ జిల్లా జెస్సోర్. చిత్రమేమంటే మన ప్రాంతాన్ని పాకిస్థాన్‌కు వదులుకుని మరలా వాళ్ళ బంధనాల నుంచి విముక్తి గావించడానికి బంగ్లాదేశ్‌కు సహాయం చేయడం. రెండవదైన ఖుల్నా బంగ్లాదేశ్‌లో పారిశ్రామిక నగరం. దేశంలోనే రెండవ అతి పెద్ద ఓడ రేవు ‘పోర్ట్ ఆఫ్ మొంగ్లా’, రెండు ప్రధాన నౌకాదళ కేంద్రాలు ఇక్కడే వున్నాయి. విముక్తి సమరం ముగిసిన తర్వాత బిఎన్‌ఎస్‌ టిటుమీర్ నౌకాదళం ఇక్కడే ఏర్పాటైంది. ఇంతటి ముఖ్యమైన, వనరులు గల ఆ తూర్పు బెంగాల్ ప్రాంతాన్ని పాకిస్థాన్‌కు పోగొట్టడంలో ప్రధాన సూత్రధారి పటేల్‌.  
 
మూడవది నెహ్రూతో పటేల్ వ్యవహారశైలి. బీజేపీ ఇటీవల రాజ్యాంగం నుండి 370 ఆర్టికల్‌ను తొలగించాలన్న డిమాండ్‌ను బలంగా ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే. కాశ్మీర్ సమస్య ఇంత తీవ్రం కావటానికి ఈ ఆర్టికల్‌ ప్రధాన కారణమని వాళ్ళ అభిప్రాయం. దీనిపై అప్పట్లోనూ పెద్ద దుమారమే రేగింది. పటేల్ డీల్ చేసిన హైదరాబాద్, ట్రావెన్ కోర్, జునాఘడ్‌లు ఇండియన్ యూనియన్‌లో కలిసిపోయి ప్రశాంతంగా ఉంటే, నెహ్రూ డీల్ చేసిన కశ్మీర్ విషయంలోనే సమస్యంతా అంటూ నెహ్రూ నాయకత్వానికి సవాలు విసిరారు. నెహ్రూ వల్లనే కశ్మీర్ అంశాన్ని యూఎన్‌వోకు ఫిర్యాదు చేశారంటూ ఆయనను దోషిగా నిలబెట్టాలనుకుంటున్నారు. కశ్మీర్‌ను నెహ్రూ, మిగతా సంస్థానాలను పటేల్ డీల్ చేశారన్న వాదన చరిత్రను తప్పు దారి పట్టించే కుట్ర. అన్ని సంస్థానాల విలీనంలో నెహ్రూ, పటేల్ పాత్ర ఉమ్మడిగా వుంది. చర్చల ద్వారా కలవని సంస్థానాలను బలవంతంగానైనా కలుపుకోవాలన్నది అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం. అందులో భాగంగానే హైదరాబాద్‌పై పోలీస్ చర్య జరిపి భారత్‌లో కలిపారు. ఈ ఘనత ఒక్క పటేల్‌కే చెందదు, నెహ్రూకు చెందకుండా పోదు. ఇక, ఆర్టికల్ 370 రూపశిల్పి పటేల్‌ అన్న వాస్తవాన్ని బీజేపీ ప్రజలకు చెప్పడం లేదు. ఈ ఆర్టికల్ వలన భవిష్యత్ ప్రమాదాలను ముందే ఉహించి అంబేడ్కర్ దీనిని నిర్మొహమాటంగా వ్యతిరేకించాడు. కశ్మీర్‌కు ప్రత్యేక హోదా విషయమై షేక్ అబ్దుల్లా పలుమార్లు సంప్రదించినప్పటికీ అంబేడ్కర్‌ ససేమిరా అన్నాడు. చివరకు నెహ్రూ ఆ బాధ్యతను పటేల్‌కు అప్పగించారు. పటేల్, గోపాలస్వామి అయ్యంగార్ (అప్పటి కేంద్ర మంత్రి, కశ్మీర్ మాజీ దివాన్) కలిసి ఆర్టికల్ 370 తయారు చేశారు. నెహ్రూ విదేశీ పర్యటనలో వున్నప్పుడు ఈ తంతు ముగించి పార్టీని ఒప్పించటానికి పటేల్ చేసిన కృషి మరువలేనిది. కానీ, ఈ పరిణామాలేవీ చెప్పకుండా కేవలం నెహ్రూను దూషించడం ఆశ్చర్యకరం.  
 
 
పాకిస్థాన్ ప్రభుత్వం హైదరాబాద్ నవాబుతో మాట్లాడి ఇండియన్ యూనియన్‌లో చేర్పించిన పక్షంలో కశ్మీర్‌ను పాకిస్థాన్‌కు ఇచ్చేయడానికి వీలుగా పాక్‌ ప్రధాని లియాఖత్ అలీఖాన్‌తో చర్చలు జరిపింది కూడా పటేలే. ప్రత్యామ్నాయంగా కశ్మీర్–-జునాఘడ్‌ల గురించి మాట్లాడదామన్న అలీఖాన్ ప్రతిపాదనను పటేల్ ఒప్పుకోలేదు. కశ్మీర్ కంటే హైదరాబాద్ ముఖ్యమని పటేల్‌ భావించారు. ఈ విషయాన్ని 1947 నవంబర్‌లో జునాఘడ్‌ను ఆక్రమించుకున్న తర్వాత కూడా బహిరంగంగా ప్రకటించాడు. ‘ఇదివ్వు అదిస్తాను’ అన్న పటేల్ ఫార్ములాను నెహ్రూ ఒప్పుకోలేదు. కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితికి విన్నవించడంలో నెహ్రూ తప్పేమీ లేదని జనసంఘ్ వ్యవస్థాపకులైన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కూడా చెప్పడం విశేషం. కశ్మీర్ సమస్యపై అందరు కలిసే నిర్ణయం తీసుకున్నారు కానీ ఇలాంటి ప్రాథమిక విషయాలను తప్పుదారి పట్టించకూడదన్న జ్ఞానం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వారసులకు లేకపోవడం శోచనీయం. పటేల్‌ 550 సంస్థానాలకుపైగా భారత్‌లో కలిపాడన్నది కూడా సత్యదూరమే. ఆంగ్లేయులు స్వాతంత్య్రం ఇచ్చే నాటికి బ్రిటీష్ పాలనకు బయటవున్న ఐదువందలకు పైగా సంస్థానాలన్నీ చిన్న చిన్నవి. పెద్దవి చాలా తక్కువ. భౌగోళిక కారణాల రీత్యా తొంభైశాతానికి పైగా యూనియన్‌లో కలవాల్సిన స్థితి. మిగిలినవాటిలో మైసూర్, ట్రావెన్కోర్‌లు చర్చల ద్వారా యూనియన్‌లో కలిసిపోగా, జునాఘడ్, హైదరాబాద్‌లను సైనిక ప్రయోగంతో కలుపుకున్నారు. వీటిని బలప్రయోగంతో కలుపుకున్నా, కశ్మీర్ విషయంలో వెనుకకు తగ్గినా అది నాటి నాయకత్వం ఉమ్మడి నిర్ణయమే.
 
గాంధీ, పటేల్ ఇద్దరూ గుజరాతీయులే అయినప్పటికీ గాంధీ అహింసా సిద్ధాంత ప్రభావానికి కాక, పటేల్ సిద్ధాంతానికి మోదీ ప్రభావితుడవ్వడం ఆయనలోని ఫాసిస్టు పోకడలను బహిర్గతపరుస్తుంది. రానున్న ఎన్నికలలో ఓట్లు అడిగే హక్కు అన్నివిధాలా కోల్పోయిన మోదీ, పటేల్‌ భారీ విగ్రహ ప్రతిష్ఠాపన ద్వారా, ప్రజలను మైమరపించి అధికారంలోకి రావాలనుకుంటున్నారు. ఆరువందల అడుగుల ఎత్తయిన ఈ విగ్రహం వెనుక ఉన్నది రాజకీయమే. గాంధీ, నెహ్రూ, కాంగ్రెస్‌లపై బురద చల్లడానికి, లేనిచరిత్రను పటేల్‌కు ఆపాదించాలని ఆరాట పడుతున్నాడు మోదీ. ఆకాశాన్ని తాకే ఈ ఎత్తయిన విగ్రహం పల్లెల్లో, గ్రామాలలో, పట్టణాలలో ప్రజలు పెట్టుకున్న గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలతో సరితూగగలదా?
 గుమ్మడి ప్రభాకర్
 అరుణ గోగులమండ
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...