Jump to content

చంద్రబాబుకు నోటీసులు వ్యవహారంపై మరో బాంబు పేల్చిన శివాజీ!


koushik_k

Recommended Posts

విజయవాడ: 2010నాటి బాబ్లీ ఘటనకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబుకు తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై ఏపీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రాజకీయ వర్గాల్లో కూడా ఈ అంశమే ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్ గరుడ’ను తెరపైకి తెచ్చిన సినీ నటుడు శివాజీ మరో బాంబు పేల్చారు. చంద్రబాబుకు మరో రెండుమూడు నోటీసులు రాబోతున్నట్లు చెప్పారు. చంద్రబాబు వారి ట్రాప్‌లో పడొద్దని శివాజీ సూచించారు. త్వరలో ఆ రెండు నోటీసులు రాబోతున్నాయని కూడా చెప్పుకొచ్చారు.
 
శివాజీ పనీపాటా లేకుండా తిరుగుతున్నాడని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తనపై కామెంట్స్ చేశారని, జగన్‌కు ఏమన్నా పని ఉందా అని శివాజీ మండిపడ్డారు. ఆయనేమన్నా మహాత్ముడా అని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయడం సరికాదని వ్యాఖ్యానించారు. కుర్చీ కాంక్ష మొదలైనప్పుడే విధ్వంసం మొదలవుతుందని శివాజీ చెప్పారు. జనవరిలో ఎన్నికలు వస్తాయని జగన్ ఎలా చెప్పగలుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఏదో విధంగా చంద్రబాబును ఒంటరి చేసి, ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తున్నారని ఆరోపించారు. దేశంలో మోదీకి ఎదురుగా నిలబడ్డ వ్యక్తి చంద్రబాబు ఒక్కరేనని శివాజీ వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితిలో మాట్లాడే అవకాశం చంద్రబాబుకు దక్కడం తెలుగుజాతికి గౌరవమని శివాజీ అభిప్రాయపడ్డారు.
Link to comment
Share on other sites

inka 2 or 3 kadu, 3 ani confirmedga cheppadu poduna AP 24*7 debatelo phone call lo vachi

 

Beeru oka state govt meda target chesaru, CBN Centre ni target chesadu, akkade telustundi what you are upto ani, Bring it on Baffas maaku target  matram clearga kanipistundi to get you down.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...