Jump to content

Indian Culinary institute,Tirupati.


Recommended Posts

  • 1 month later...
పర్యాటకానికి కొత్త సొబగులు
24-09-2018 04:16:32
 
636733603867806861.jpg
  •  నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 230 కోట్లతో ప్రాజెక్టులు
  • నేడు తిరుపతిలో ప్రారంభించనున్న వెంకయ్య
తిరుపతి (జీవకోన), సెప్టెంబరు 23: రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి పలుచర్యలు చేపడుతున్న ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకశాఖ నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాజెక్టులు పూర్తిచేసింది. ఈ ప్రాజెక్టులను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం తిరుపతి నుంచి ఏకకాలంలో ప్రారంభించనున్నారు. తిరుపతి సమీపంలోని పాపానాయుడుపేట వద్ద రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించిన జాతీయ పాకశాస్త్ర సంస్థ (కలినరీ ఇన్‌స్టిట్యూట్‌) నూతన భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు. అదే వేదికనుంచి ఏకకాలంలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో రూ.130 కోట్లతో రూపుదిద్దుకున్న పర్యాటక ప్రాజెక్టులను కూడా డిజిటల్‌ విధానంలో ఆయన ప్రారంభిస్తారు. కోస్తా తీరప్రాంత పర్యాటకాభివృద్ధిలో భాగంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రూ.60.37 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. దేశంలోనే రెండో అతిపెద్ద సరస్సుగా ఉన్న పులికాట్‌ అభివృద్ధికి రూ.22.76 కోట్లు, ఉబ్బలమడుగు జలపాతం పర్యాటక ప్రాంత అభివృద్ధికి రూ.3.5 కోట్లు ఖర్చుచేశారు. రూ.6.32 కోట్లతో నేలపట్టు పక్షుల కేంద్రాన్ని కూడా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు కల్పించారు. ఈ ప్రాజెక్టులన్నింటిని తిరుపతిలో వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...