Jump to content

తెలుగుదేశం నేతలకు కొడాలి నాని వార్నింగ్


Recommended Posts

200 రోజులు ఆగండి.. చుక్కలు చూపిస్తా: తెలుగుదేశం నేతలకు కొడాలి నాని వార్నింగ్
  • పోలీసులు, అధికారులు టీడీపీ తొత్తులుగా మారారని మండిపాటు
  • తెలుగుదేశాన్ని గుడివాడలో భూస్థాపితం చేస్తానని ప్రకటన
  • మీడియా సమావేశంలో నిప్పులు చెరిగిన నాని
  • వైఎస్సార్సీపీనేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు(నాని) ఈ రోజు తెలుగుదేశం నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంకో 200 రోజులు ఆగితే గుడివాడలో తెలుగుదేశం నేతలకు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. పోలీసులు, అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని మండిపడ్డారు. గుడివాడలోని శరత్ థియేటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో నాని మాట్లాడారు.


తనను గుడివాడ నుంచి తరిమికొడతామని తెలుగుదేశం నేతలు చెప్పడంపై నాని తీవ్రంగా స్పందించారు. ఇంకో 200 రోజులు ఆగితే గుడివాడలో టీడీపీని భూస్థాపితం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. అప్పుడు టీడీపీ నేతల్ని తరిమితరిమి కొడతానన్నారు. వైఎస్సార్ సీపీ నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్న నేతలకు అసలు రాజకీయ జీవితమే లేకుండా చేస్తానని హెచ్చరించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...