Jump to content

Mukhyamantri e-Eye Kendram | CM e-Eye Care Centre


Recommended Posts

  • 2 weeks later...
2.34 లక్షల మందికి కంటి పరీక్షలు 
2.01 లక్షల మందికి  ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి ఈ-ఐ కేంద్రాల ద్వారా జూన్‌ నెలాఖరకు  రాష్ట్రంలో 2,34,352 మంది గ్రామీణులకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. వీరిలో 2,01,699 మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కంటి చూపు సమస్య తీవ్రతను అనుసరించి పెద్దాసుపత్రులకు సిఫార్సు చేసినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 5 నెలల్లో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో గ్రామీణ నేపథ్య సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 115 సీఎం ఈ-ఐ కేంద్రాలు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా ప్రజల కంటి చూపు సమస్యలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించేందుకు వీలవుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పథకం నిబంధనల మేరకు ఒక్కో కేంద్రం ద్వారా ప్రతిరోజూ కనీసం 15 మందికి తగ్గకుండా పరీక్షలు నిర్వహించాలి. ఫండస్‌ పరీక్షకు రూ.185, కళ్లజోళ్లకు రూ.175-270 మధ్య ప్రభుత్వం చెల్లింపులు చేస్తోంది. మరికొన్ని పట్టణాలు, మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కంటి పరీక్షలు జరపాలని ప్రభుత్వానికి అభ్యర్థనలు అందుతున్నాయి.

అంధత్వ సమస్యను 0.3 శాతానికి తగ్గించడం లక్ష్యం: ‘2006-07లో రాష్ట్రంలో అంధత్వ సమస్య 1 శాతం ఉంది. వివిధ నివారణ చర్యలతో ప్రస్తుతం ఈ సమస్య 0.5 శాతానికి చేరింది. 2020 నాటికి ఈ సమస్యని 0.3 శాతానికి తగ్గించే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నాం’ అని పర్యవేక్షణాధికారి డాక్టర్‌ సీహెచ్‌ ప్రసన్నకుమార్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...