Jump to content

ఏటీఎంలో రూ.12.38 లక్షల్ని ఎలుకలు తినేశాయి! 


KING007

Recommended Posts

ఏటీఎంలో రూ.12.38 లక్షల్ని ఎలుకలు తినేశాయి! 
అసోంలో వెలుగుచూసిన ఘటన

గువాహటి: అసోంలోని తీన్‌సుకియా పట్టణంలోని లైపులిలో భారతీయ స్టేట్‌బ్యాంక్‌కు చెందిన ఏటీఎంలో ఏకంగా రూ.12.38 లక్షల నగదును ఎలుకలు ముక్కలుగా కొరికేశాయి. సాంకేతిక సమస్య తలెత్తడంతో మూడు వారాలుగా ఏటీఎం పనిచేయడం లేదు. దీనిని బాగు చేయడానికి గత గురువారం వచ్చిన సాంకేతిక నిపుణులు- యంత్రాన్ని తెరవగానే వేర్వేరు విలువల్లోని నోట్లు ముక్కలుగా రాలిపడ్డాయి. బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ ప్రారంభించి, ఏటీఎంలో ఎలుకల్ని గుర్తించారు. నోట్లను ఎలుకల మంద ఇలా చేసిందని తేల్చారు. యంత్రంలో ఇంకా రూ.17.10 లక్షల విలువైన నోట్లు భద్రంగానే ఉన్నాయని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బ్యాంకు అధికారులకు వారు సూచించారు. మూడు వారాలకు పైగా ఏటీఎం ఎందుకు పనిచేయడం లేదో తెలుసుకునేందుకు అంతర్గత విచారణ చేపట్టినట్లు ఎస్‌బీఐ వర్గాలు తెలిపాయి. సీల్‌ చేసిన అరలో ఉండాల్సిన నోట్లు ఎలా ఎలుకల పాలయ్యాయో కూడా విచారణలో తేలుస్తామని చెప్పాయి.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...