Jump to content

ycp mla buggana met rammadhav proof


Recommended Posts

ఢిల్లీ లో వైకాప ఎంఎల్ఏ బుగ్గన, భాజపా ఎంఎల్ఎ ఆకుల కలిసి భాజపానేత రాం మాధవ్ నివాసానికి వెళ్ళినప్పుడు లాగ్ పుస్తకం లో సంతకాలు చేసిన ఆధారాలు బయట పెట్టిన తెదేపా ఎంపీలు

No automatic alt text available.

No automatic alt text available.

No automatic alt text available.

No automatic alt text available.

Image may contain: text

 

Link to comment
Share on other sites

ప్రభుత్వ కారులో వెళ్లి మంతనాలు: కేశినేని
15-06-2018 19:16:48
 
636646870211283417.jpg
అమరావతి: వైసీపీ, బీజేపీ నేతల భేటీ ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. సమావేశానికి సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆకుల సత్యనారాయణ కలిసి రామ్ మాధవ్ నివాసానికి వెళ్లినట్టు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. బీజేపీ, వైసీపీ కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకంటే ఏం నిదర్శనం కావాలని నాని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై మరిన్ని ఆధారాలు బయట పెడతామని ఆయన స్పష్టం చేశారు.
 
ఈ సందర్బంగా కేశినేని నాని ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ బుగ్గన, ఆకుల విజయవాడ నుంచి కలిసి వెళ్లారని, ఢిల్లీలో దిగారని, ప్రభుత్వ కారులో వెళ్లి షంగ్రిళ్లా హోటల్‌లో భోజనం చేశారని, తర్వాత రాంమాధవ్ ఇంటికి వెళ్లారని చెప్పారు. దీనికి సంబంధించిన అన్నీ ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ, బీజేపీతో కుమ్మక్కయిందని, జగన్ తన కేసులు మాఫీ చేసుకోవడం కోసం మోదీతో కుమ్మక్కై ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని కేశినేని నాని విమర్శించారు. వైసీపీ నేతలు మోదీ వద్దకు వెళ్లి కాళ్లు మొక్కడం, బయటకు వచ్చి అవిశ్వాసం పెట్టడం... ఈ విధంగా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ, బీజేపీ కలిసి రాజకీయాలు చేస్తే నిజాయితీగా ఒప్పుకోవాలని కేశినేని డిమాండ్ చేశారు. అన్నీ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఏ చాలెంజ్‌కైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...